అన్వేషించండి

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డిపై లోకేష్‌ ఘాటు వ్యాఖ్యలు

Lokesh sensational comments on ycp leaders : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ వైసీపీ కీలక నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Lokesh sensational comments on ycp leaders : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ వైసీపీ కీలక నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy)పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శంఖారావం (Shankaravam) పేరుతో సదస్సులు నిర్వహిస్తున్న నారా లోకేష్‌ (Nara Lokesh) రెండో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలస నియోజకవర్గాల్లో శంఖారావాన్ని నిర్వహించిన లోకేష్‌ వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర వైసీపీ బాధ్యతలు చూస్తున్న వైవీ సుబ్బారెడ్డి, గతంలో ఈ బాధ్యతలు నిర్వర్తించిన విజయసాయిరెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విరుచుకుపడ్డారు. 

ఉత్తరాంధ్రను దోచుకున్న ఆ ఇద్దరూ! 
ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి పందికొక్కుల్లా దోచుకుంటున్నారంటూ లోకేష్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి సంపదను అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు విలువజేసే భూములను కబ్జా చేశారన్నారు. వీరి కబంధ హస్తాల నుంచి ఉత్తరాంధ్రను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలపై ఉందని లోకేష్‌ స్పష్టం చేశారు. జగన్‌ పని అయిపోయిందని, సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలే చెబుతున్నారన్నారు. ఐదేళ్లలో ఇసుకలో రూ.5400 కోట్లు జగన్‌ రెడ్డి దోచుకున్నాడని ఆరోపించారు. వివేకానందరెడ్డిని హత్యచేసి.. పిన్ని తాళి బొట్టును జగన్‌ రెడ్డి తెంపాడని ఆరోపించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో రేపో, మాపో ఏ వన్‌ ముద్దాయిగా జగన్‌ రెడ్డి మిగిలిపోతాడని లోకేష్‌ జోస్యం చెప్పారు. ప్రతి మద్యం సీసాపై పాతిక రూపాయలు చొప్పున జె ట్యాక్స్‌ ద్వారా నేరుగా జగన్‌రెడ్డికి వెళుతోందని, ఇప్పటి వరకు రూ.45 వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని మద్యంపై సంపాదించాడన్నారు. 

ఇంటి పేరులో ధర్మం.. చేసే పనులన్నీ అధర్మాలే 
మంత్రి ధర్మాన ప్రసాదరావుపై సైతం నారా లోకేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరులోనే ధర్మం ఉందని, ఆయన చేసే పనులన్నీ అధర్మాలేనని స్పష్టం చేశారు. ఇక్కడి నేతకు బుద్ధి చెప్పాల్సిన అవసరముందని స్పష్టం చేవారు. స్పీకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలస నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉందన్నారు. స్పీకర్‌ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో అభివృద్ధితో పోటీ పడేలా ఉండాలని, కానీ, ఇక్కడ ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. కొడుకు పేరుతో మైన్లను అడ్డగోలుగా రాయించుకుంటున్నారని ఆరోపించారు. ఇసుకలో రూ.300 కోట్లు రూపాయలు కొట్టేశాడంటూ స్పీకర్‌పై ఆరోపణలు చేశారు. డమ్మా బుస్సుల సీతారాం ఐదేళ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మరో మంత్రి సీదిరి అప్పలరాజుపైనా లోకేష్‌ విమర్శలు గుప్పించారు. అవినీతికి కేరాఫ్‌గా మారిపోయాడని, స్పీకర్‌, సీదిరి అప్పలరాజు అవినీతిలో పోటీ పడుతున్నారన్నారు. శాసనసభలో లేకుండా పోవడానికి ప్రధాన కారణం స్పీకర్‌ తమ్మినేని సీతారామేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ నేతలందరికీ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

రానున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో శ్రీకాకుళం ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. మూడు నెలల్లో తాడేపల్లి ప్యాలెస్‌ కూలడం ఖాయమని, పార్టీకి అండగా ఉన్న పసుపు సైనికులకు లోకేష్‌ దన్యవాదాలు తెలిపారు. ఎన్నికలు ముందు దొంగ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం వైసీపీ చేస్తోందని, అటువంటి వారికి అండగా ఉంటామన్నారు. ఎలక్షనియరింగ్‌ చేయకుండా చేసే ప్రయత్నాలను వైసీపీ చేస్తోందని, ఈ తరహా కేసులపై న్యాయ పోరాటం చేస్తామని, వారి వివరాలను ఎంపీ రామ్మోహన్‌ నాయుడకు అందించాలని సూచించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TTD Chairman BR Naidu: మహిళతో ఉన్న వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ.. వాళ్ల బాగోతం బయటపెడతానంటూ వార్నింగ్
మహిళతో ఉన్న వీడియోపై బీఆర్ నాయుడు క్లారిటీ.. వాళ్ల బాగోతం బయటపెడతానంటూ వార్నింగ్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
1st March Rules Change: ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Chairman BR Naidu: మహిళతో ఉన్న వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ.. వాళ్ల బాగోతం బయటపెడతానంటూ వార్నింగ్
మహిళతో ఉన్న వీడియోపై బీఆర్ నాయుడు క్లారిటీ.. వాళ్ల బాగోతం బయటపెడతానంటూ వార్నింగ్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
1st March Rules Change: ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Toxic Romantic Song : టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?
టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
Chronic Pain : ఆరు నెలలకు మించి నొప్పి ఉంటే జాగ్రత్త.. ఇవే అత్యంత బాధాకరమైన వ్యాధులు
ఆరు నెలలకు మించి నొప్పి ఉంటే జాగ్రత్త.. ఇవే అత్యంత బాధాకరమైన వ్యాధులు
Embed widget