అన్వేషించండి

TS Election 2024 Voting updates: తెలంగాణలో సమస్యల పరిష్కారం కాలేదని పోలింగ్ బహిష్కరించిన పలు గ్రామాలు

Telangana News: సమస్యల పరిష్కారం కాలేదని తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పోలింగ్‌ను ప్రజలు బరిష్కరించారు. తమ డిమాండ్ల తీర్చే వరకు ఓటుకు వెళ్లబోమన్నారు. అధికారులు వారితో చర్చలు జరిపారు.

తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఆరు నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అయినా ఓటర్లలో చైతన్యం ఏ మాత్రం తగ్గలేదు. అయితే సమస్య పేరుతో కొన్ని గ్రామాల ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు. సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఓటు వేసేది లేదని తేల్చి చెబుతున్నారు. 

ధాన్యం కొనలేదని

భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం కనుముక్కలలో ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించారు. ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాలకు తమ పంటలు పూర్తిగా పాడైపోయాయని వాటిని కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని చెబుతూ పోలింగ్‌ను బహిష్కరించారు. ముఖ్యంగా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పోలింగ్ వరకు రైతుల సమస్యలపై మాట్లాడుతున్న నేతలు తర్వాత వారి సమస్యలను గాలికి వదిలేస్తున్నారని మండిపడ్డారు. విషయాన్ని తెలుసుకున్న అధికారులు గ్రామానికి వెళ్లి వారితో మాట్లాడారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఉన్నతాధికారులతో మాట్లాడి కచ్చితంగా సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. 

కరెంటు లేదని

కొడంగల్‌లోని ఓ పల్లెలో మూడు రోజులుగా పవర్ లేదని ప్రజల పోలింగ్ బహిష్కరించారు. ఊరిలోని ఏ ఒక్కరు కూడా ఓటు వేసేందుకు రాలేదు. మూడు రోజులుగా కరెంటు లేక ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోలేదని వాపోయారు గ్రామస్థులు. అధికారులు విషయాన్ని తెలుసుకొని వారితో చర్చలు జరిపారు. 

వంతెన లేదని 

ఖమ్మం జిల్లా రాయమాదారంలో ప్రజలు కూడా వంతెన కోసం పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్‌ఎస్పీ కాలువపై ఎప్పటి నుంచో వంతెన ఏర్పాటు చేయమంటే ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రోడ్డు సమస్య తీర్చలేదని

నిర్మల్‌ జిల్లా అల్లంపల్లిలో కూడా రోడ్డు సరిగా లేదని ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎప్పటి నుంచో ఉన్న రోడ్డు సమస్య తీర్చే వరకు ఓటు వేసేది లేదని భీష్కించుకొని కూర్చున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా మైలారంలో కూడా ప్రజలు పోలింగ్‌ను బాయ్‌కాట్ చేశారు. స్థానికంగా జరుగుతున్న మైనింగ్‌తో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. వాటిని ఆపేంత వరకు ఓటు వేయబోమన్నారు. వారికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 
భద్రాద్రి కొత్తగూడెంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి మృతి చెందాడు. అశ్వారావుపేటలోని నెహ్రూనగర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఈ దుర్ఘటన జరిగింది. అక్కడ పని చేస్తున్న శ్రీ కృష్ణ అనే ఉద్యోగి ఒక్కసారిగా గుండెపోటుతో పడిపోయాడు. ఆయనకు సీపీఆర్ చేసిన ప్రయోజనం లేకపోయింది. ఆయన చుంచుపల్లిలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. 

ప్రశాంతంగా పోలింగ్: వికాస్‌ రాజ్ 

తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్ సాగుతోందని ఎన్నికల ప్రధాన అధికారులు వికాస్‌ రాజ్‌ చెప్పారు. విద్యుత్ అంతరాయం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా పోలింగ్ మొదలైందని పేర్కొన్నారు. బస్‌లు, వెహికల్స్ వెళ్లలేని ప్రాంతాలకు ఎద్దుల బండిలో ఈవీఎంలు తరలించి పోలింగ్ నిర్వహించామన్నారు. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ పోలింగ్ స్టేషన్‌లో వికాస్‌రాజ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Virat Kohli: అనుష్క!  నువ్వు లేకుండా సాధ్యమా! T20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత కొహ్లీ భావోధ్వేగం
అనుష్క! నువ్వు లేకుండా సాధ్యమా! T20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత కొహ్లీ భావోధ్వేగం
Electricity Bill Payment: మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
Sonarika Bhadoria : దేవకన్యలా ఉన్న స్మాల్ స్క్రీన్ పార్వతి  సోనారికా భడోరియా - మళ్లీ టాలీవుడ్ కి ఎప్పుడొస్తుందో!
దేవకన్యలా ఉన్న స్మాల్ స్క్రీన్ పార్వతి సోనారికా భడోరియా - మళ్లీ టాలీవుడ్ కి ఎప్పుడొస్తుందో!
Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల బృందం- డయాఫ్రంవాల్‌ గురించి ఏం చెప్పారంటే?
పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల బృందం- డయాఫ్రంవాల్‌ గురించి ఏం చెప్పారంటే?
Embed widget