News
News
వీడియోలు ఆటలు
X

Lakhimpur Violence Case: బెయిల్‌పై విడుదలైన కేంద్రమంత్రి కుమారుడు- యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం

లఖింపుర్ ఖేరీలో ప్రధాన నిందితుడైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్‌పై విడుదలయ్యారు.

FOLLOW US: 
Share:

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్‌పై ఈరోజు విడుదలయ్యారు. ఈ కేసులో ఫిబ్రవరి 10న అల్‌హాబాద్ హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది.

గతేడాది అక్టోబర్‌ 3న జరిగిన లఖింపుర్ ఖేరీ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై లఖింపుర్ ఖేరీ పరిధిలోని టికూనియా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అక్టోబర్ 9న ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు.

కింద కోర్టులు ఆశిష్ మిశ్రాకు బెయిల్ తిరస్కరించడంతో ఆయన అల్‌హాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ రాజీవ్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆశిష్ మిశ్రాకు ఎట్టకేలకు బెయిల్ ఇచ్చింది.

ఏం జరిగింది?

యూపీలోని లఖింపుర్ ఖేరిలో 2021 అక్టోబర్ 3న నిరసన చేపట్టిన రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు రైతులు ఉన్నారు.  వాహనంలో ఉన్న నలుగురు భాజపా కార్యకర్తలు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు.

అయితే కాన్వాయ్‌లోని ఓ వాహనంలో కేంద్ర మంత్రి కుమారు ఆశిష్ మిశ్రా ఉన్నాడని రైతులు ఆరోపించారు. ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నేతలు యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి కుమారుడిని రక్షించేందుకు యూపీ సర్కార్, పోలీసులు ప్రయత్నిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపించారు. 

దీంతో ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేసి ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేశారు. అయితే ఆయన బెయిల్‌పై నేడు విడుదలయ్యారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న వేళ ఆశిష్ బయటకు రావడం ప్రాధాన్యంగా మారింది.

Also Read: Fodder Scam Case: లాలూ మళ్లీ జైలు- ఆ కుంభకోణం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

 

Published at : 15 Feb 2022 06:56 PM (IST) Tags: Farmers Lakhimpur Kheri Lakhimpur Violence Case Union Minister Son

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates:  ప్రమాణ స్వీకారం చేసిన సిద్దరామయ్య, డీకే శివకుమార్ - కంఠీరవ స్టేడియంలో కోలాహలం

Breaking News Live Telugu Updates: ప్రమాణ స్వీకారం చేసిన సిద్దరామయ్య, డీకే శివకుమార్ - కంఠీరవ స్టేడియంలో కోలాహలం

Karnataka CM Swearing-In: కర్ణాటక సీఎం పట్టాభిషేకానికి విపక్ష నేతల తరలిరావడం వెనుక అసలు కారణం అదేనా?

Karnataka CM Swearing-In: కర్ణాటక సీఎం పట్టాభిషేకానికి విపక్ష నేతల తరలిరావడం వెనుక అసలు కారణం అదేనా?

Karnataka CM Swearing-In: కర్ణాటక సీఎంగా నేడు సిద్దరామయ్య ప్రమాణం- హాజరుకానున్న అగ్రనాయకత్వం

Karnataka CM Swearing-In: కర్ణాటక సీఎంగా నేడు సిద్దరామయ్య ప్రమాణం- హాజరుకానున్న అగ్రనాయకత్వం

Karnataka Chief Minister: కర్ణాటక ఫజిల్‌ను 72 గంటల్లో కాంగ్రెస్ ఎలా ఛేదించింది, శివకుమార్‌ను ఎలా కూల్ చేసింది, సిద్దూని ఎలా సీఎంను చేసింది?

Karnataka Chief Minister: కర్ణాటక ఫజిల్‌ను 72 గంటల్లో కాంగ్రెస్ ఎలా ఛేదించింది, శివకుమార్‌ను ఎలా కూల్ చేసింది, సిద్దూని ఎలా సీఎంను చేసింది?

వీహెచ్‌ కామెట్స్ సీరియస్‌గా తీసుకున్న నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ బీసీ నేతలు- 3 స్థానాలు కావాలంటూ డిమాండ్!

వీహెచ్‌ కామెట్స్ సీరియస్‌గా తీసుకున్న నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ బీసీ నేతలు- 3 స్థానాలు కావాలంటూ డిమాండ్!

టాప్ స్టోరీస్

Telangana Politics : అయితే కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్ - పొంగులేటి, జూపల్లి డిసైడయ్యారా ?

Telangana Politics :  అయితే కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్ - పొంగులేటి, జూపల్లి డిసైడయ్యారా ?

NT Rama Rao Jayanti : ఎన్టీఆర్‌ను దేవుడిని ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?

NT Rama Rao Jayanti : ఎన్టీఆర్‌ను దేవుడిని ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?

CSK vs GT IPL 2023 Final: మొతేరాలో ఫైనల్‌ మోత! సీఎస్కే, జీటీ పాజిటివ్‌, నెగెటివ్స్‌ ఇవే!

CSK vs GT IPL 2023 Final: మొతేరాలో ఫైనల్‌ మోత! సీఎస్కే, జీటీ పాజిటివ్‌, నెగెటివ్స్‌ ఇవే!

Sharwanand Accident : యాక్సిడెంట్ అయినప్పుడు కారులోనే శర్వానంద్ - గాయాలు ఏం కాలేదు!

Sharwanand Accident : యాక్సిడెంట్ అయినప్పుడు కారులోనే శర్వానంద్ - గాయాలు ఏం కాలేదు!