అన్వేషించండి

Exit polls tension: ఫలితాల కంటే ముందే ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ - ఆసక్తిగా ఎదురు చూస్తున్న జనం

Elections Exit Polls : చివరి విడత పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకటించనున్నారు. ప్రముఖ మీడియా ఏబీపీ సీ-ఓటర్ కూడా ఎగ్జిట్ పోల్ 2024 అంచనాలను ప్రకటించనుంది.

Exit Polls On June 1 :   రాజకీయ పార్టీలన్నీ రెడీ అయిపోయాయి. చివరి విడత పోలింగ్ ఒకటో తేదీన జరగనుంది. పోలింగ్ గడువు ముగిసిన అరగంట తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడానికి అవకాశం ఉంది. అన్ని ప్రముఖ సంస్థలు అప్పుడే తమ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించనున్నాయి. ఇందు కోసం రాజకీయ పార్టీలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఎన్నికల ఫలితాలను ముందుగా తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రజలకు ఉంటుంది. అందుకే పోల్ స్ట్రాటజీల కోసం ఇప్పుడు ప్రత్యేక కంపెనీలు పుట్టుకు వచ్చాయి. వారు సర్వేలు చేసి.. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ వెల్లడించకూదు. చివరి విడత పోలింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే ప్రకటించాలి. అందుకే జూన్ ఒకటో తేదీన ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడిస్తారు. 

సాధారణంగా  పోలింగ్  ముందు నిర్వహించే అభిప్రాయసేకరణ ద్వారా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ , మూడ్ ఆఫ్ ది నేషన్ వంటి పేర్లతో తమ అంచనాలను పోల్ స్ట్రాటజీ సంస్థలు వెల్లడిస్తాయి. కానీ ఓటింగ్ అయిపోయిన తర్వాత పోలింగ్ సరళని విశ్లేషించి.. ఓట్లేసిన వారి అభిప్రాయాన్ని తెలుసుకుని ప్రకటించే అంచనాలే ఎగ్జిట్ పోల్స్.                    

ఎగ్జిట్ పోల్స్ ను చాలా సంస్థలు ప్రకటిస్తాయి కానీ.. వాటిలో అత్యంత విశ్వసమైనవి అతి తక్కువగా ఉన్నాయి. చాలా సంస్థలు ఫీల్డ్ వర్క్ చేయకుండానే అంచనాలను ప్రకటిస్తూ ఉంటాయి. కానీ విస్తృతమైన నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని ప్రజానాడిని పట్టుకునే సంస్థలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో సీఓటర్ సంస్థ ఒకటి. ఏబీపీ గ్రూప్ తో కలిసి సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించనుంది. తుది విడత పోలింగ్ ముగిసిన తర్వాత ప్రకటన ఉంటుంది.                

ఏబీపీ - సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ కు దేశవ్యాప్తంగా మంచి విశ్వసనీయత ఉంది. క్రమం తప్పకుండా ప్రకటించే ఫలితాల్లో 90 శాతానికిపైగా యాక్యురసీతో ఇస్తుంది ఏబీపీ - సీఓటర్. ఈ సారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అందుకే ఎగ్జిట్ పోల్స్ పై .. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.                 

ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్నీ ఏకపక్షంగా ఇస్తే.. ఫలితాలు కూడా దాదాపుగా అంతే ఉంటాయని అనుకోవచ్చు. కొన్ని సంస్థలు..కొన్ని సంస్థలు ఇటూ ఇస్తే.. పోరు హోరాహోరీగా సాగిందని అనుకోవచ్చు. అయితే ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఫలితాలకు ఎంతో సమయం ఉండదు. కేవలం రెండు రోజులే. అందుకే రెండు రోజుల పాటు ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై చర్చలు జరుగుతాయి. నాలుగో తేదీ ఉదయం పది గంటల కల్లా దేశవ్యాప్త ట్రెండ్స్ తెలిసిపోతాయి.                  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
భారత్‌లో కొత్త Skoda Kushaq Facelift లాంచింగ్.. క్రెటా, డస్టర్‌లకు గట్టి పోటీ తప్పదు
భారత్‌లో కొత్త Skoda Kushaq Facelift లాంచింగ్.. క్రెటా, డస్టర్‌లకు గట్టి పోటీ తప్పదు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Embed widget