అన్వేషించండి

Election Expenses : ప్రచారానికి వచ్చే కూలీల ఖర్చూ చెప్పాల్సిందే - అభ్యర్థులకు కఠిన నిబంధనలు

Election News : ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చుపై ఈసీ నిఘా పెట్టింది. అనుమతించిన దాని కన్నా ఎక్కువ ఖర్చు పెడితే అనర్హతా వేటు పడుతుంది.

Candidates Elections Expences :  ఇప్పుడంతా ఎన్నికల సీజన్. అభ్యర్థులంతా ప్రచారాలు చేస్తున్నారు. ప్రతి రూపాయి ఖర్చుకు అభ్యర్థులు లెక్కలు చూపాలి. దీన్ని తేలిగ్గా తీసుకుంటే గెలిచినా, తర్వాత పదవి కోల్పోవాల్సి ఉంటుంది. ప్రతి ఖర్చూ రోజువారీ పద్దుల పుస్తకంలో నమోదు తప్పనిసరి. అభ్యర్థుల పేరుతో బ్యాంకులో ప్రత్యేక ఖాతా తెరవాల్సి ఉంటుంది.   సభల నిర్వహణ, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాలు, ర్యాలీలు, ఇతరాల ప్రతి ఖర్చుకూ లెక్కలు చూపక తప్పదు. 

అభ్యర్థుల ఖర్చుపై  పరిమితి 

లోక్‌సభ అభ్యర్థులు రూ.95 లక్షలు, శాసనసభ అభ్యర్థులు రూ.40 లక్షల వరకూ ఖర్చు చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతించింది. దీనికి లోబడే ఖర్చు ఉండాలి. దేనికి ఎంత అనేది కూడా ఈసీ నిర్ణయించింది. సామర్థ్యం ప్రామాణికంగా రూ.1,200 నుంచి రూ.ఐదు లక్షల వరకు సౌండ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. చదరపు అడుగు ఎల్‌ఇడి వాల్స్‌కు రూ.342 వరకు అనుమతిస్తారు. కళ్యాణ మండపానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష, టన్ను ఎసికి రూ.4 వేలు, ఎయిర్‌ కూలర్లకు రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు వెచ్చించవచ్చు. ఎన్నికల ప్రచారమన్నాక బ్యానర్లు, బ్యాడ్జీలు, జెండాలు, పోస్టర్లు, అనుచరులకు అల్పాహారాలు, భోజనాలు, తప్పవు. వీటిలో ప్రతి అంశమూ వ్యయ పరిమితికి లోబడే ఉండాలి. పార్టీ గుర్తు ఉన్న ప్రతి వస్తువుకూ నిర్ణీత ధర ప్రకారమే పద్దు రాయాలి. సాధారణ కుర్చీకి రూ.5 నుంచి రూ.20, స్టీలు కుర్చీకి రూ.100, మహారాజా సోఫాకు రూ.1,500, షామియానాలకు రూ.800 నుంచి రూ.10 వేలు, మినీ జనరేటర్‌కు రూ.3,500, 125 కెవి జనరేటర్‌కు రూ.20 వేలకు మించకూడదు. 200 గ్రాముల పులిహోర, ప్లేట్‌ ఉప్మా , దోశలకు రూ.30 ధరలు ఖరారు చేశారు. 

రాజకీయ కూలీల ఖర్చు కూడా ఖాతాలో రాయాల్సిందే !

ప్రచారంలో నిర్వహించే ర్యాలీల్లో ఆయా పార్టీల కార్యకర్తలతో పాటు కూలీలు పాల్గొంటారు. వీరు సభా ప్రాంగణాల ఏర్పాటుకే పరిమితం కారు. వందల సంఖ్యలో జనసమీకరణ జరగాలంటే అందుకు కొంత వ్యయం భరించాల్సిందే. ఈ ఖర్చును వారి కూలిగా చూపాలని ఎన్నికల సంఘం పేర్కొంది. బైక్‌కు ఐదు లీటర్ల పెట్రోల్‌కు రూ.550, ఎద్దుల బండికి రూ.1,500, నైపుణ్యం లేని కార్మికులకు రూ.519 నుంచి రూ.649 వరకు, మోస్తరు నైపుణ్యమున్న వారికి రూ.621 నుంచి రూ.776 వరకు, నిపుణులకు రూ.741 నుంచి రూ.926, అతి నైపుణ్యమున్న వారికి రూ.1,046 నుంచి రూ.1,059 వరకు చెల్లించాలని  ఈసీ  సూచించింది.  

ఇప్పుడు ఖర్చు లెక్కలోకి రాదు.. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే !                      

ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టుకున్నా ఇబ్బంది లేదు. ఎన్నికల సంఘం లెక్కలు వేయదు. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి అంటే... నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండే ఖర్చులు పరిగణనలోకి తీసుకుంటారు.  ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున సహాయ వ్యయ పరిశీలకులను, పార్లమెంట్‌ స్థానానికి సంబంధించి అన్ని విభాగాలను పరిశీలించేందుకు మరో ఎనిమిది మంది ఎన్నికల వ్యయ పరిశీలకులను ఇప్పటికే నియమించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Congress Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Embed widget