అన్వేషించండి

Chandrababu Comments : జనవరిలో బటన్ నొక్కి ఇప్పటి వరకూ ఎందుకు డబ్బులు ఇవ్వలేదు - జగన్‌కు చంద్రబాబు సూటి ప్రశ్న

Andhra Politics : జనవరిలో బటన్ నొక్కిన పథకాలకు ఇప్పటి వరకూ నిధులు ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Elections 2024 :  ఏపీలో పథకాలకు డబ్బులు విడుదల చేయకపోవడం వివాదాస్పదమయింది. పోలింగ్ ముందు ఓటర్ల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని వైసీపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. కానీ ఈసీ మాత్రం పోలింగ్ ముగిసిన తర్వాతనే జమ చేయాలని సూచించింది. ఈ విషయంపై చంద్రబాబునాయుడు ప్రభుత్వ చిత్తశుద్దిని ప్రశ్నించారు. కురుపాంలో ఎన్నికల ప్రచారసభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.  జనవరిలో  బటన్ నొక్కితే ఇంత కాలం ఎందుకు జమ కాలేదని ప్రశ్నించారు.   డీబీటీ అంటే 24 గంటల్లో అకౌంట్లోకి డబ్బులు రావాలా, లేదా? ఫోన్ లో ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ లోకి ఒక గంటలో డబ్బులు బదిలీ అయిపోతాయి.   జనవరిలో బటన్ నొక్కి ఎక్కడ గాడిదలు కాస్తున్నావు జగన్ రెడ్డీ? పేదవాళ్ల అకౌంట్లో ఎందుకు డబ్బులు పడలేదని ప్రశ్నించారు. 

ఉత్తుత్తి బటన్ల రాజకీయం వద్దు ఇంటికిపోయే రోజు వచ్చిన తర్వాత నేను బటన్ నొక్కాను, డబ్బులు పడలేదు అంటున్నాడని మండిపడ్డారు. నువ్వు నొక్కింది ఉత్తుత్తి బటన్ ఖజానా ఖాళీగా ఉందన్నారు.  నువ్వు నొక్కిన బటన్ పేదలకు కాదు, దళారీలకు కాదు.   జనవరి నుంచి కాంట్రాక్టర్లకు రూ.16 వేల కోట్లు దోచిపెట్టిన దుర్మార్గుడు జగన్ మోహన్ రెడ్డి అని విమర్శలు గుప్పించారు. జలగ జగన్ దళిత, గిరిజన ద్రోహి. అందరినీ మోసం చేశాడన్నారు.   ఓట్లేశారు కాబట్టి జగన్ గిరిజన ప్రాంతాల్లో ఏవైనా పనులు చేస్తాడనుకున్నానన్నారు.  ఓట్లేసే వాళ్లను కాటేసే రకం ఈ జలగ జగన్. అభివృద్ధి జరిగిందా... ఒక్క రోడ్డయినా వేశాడా? ఒక స్కూలు కట్టాడా... ఒక్కటంటే ఒక్క మేలు జరిగిందా అని ప్రశ్నించారు. 
 
కురుపాం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా తోయక జగదీశ్వరి పోటీ చేస్తున్నారని, ఆమె ఆదివాసీ బిడ్డ అని వెల్లడించారు. మీ ఇంటిలో ఒక బిడ్డ  ఎమ్మెల్యేగా పోటీ చేస్తోందని, జగదీశ్వరిని ఆదరించాలని పిలుపునిచ్చారు.  ఎంపీగా బీజేపీ అభ్యర్థి గీత పోటీ చేస్తున్నారని, కమలం పువ్వుపై ఓటేసి ఆమెను గెలిపించాలని అన్నారు. గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసిన పార్టీ బీజేపీ అని కొనియాడారు. ఎండలు మండిపోతున్నా ప్రజల ఉద్ధృతి తగ్గడం లేదని, ఈ దెబ్బకు ఫ్యాన్ ముక్కలైపోవడం ఖాయమని, ఫ్యాన్ నుంచి గాలి కూడా రావడంలేదని, ఎన్నికలయ్యాక చెత్త బుట్టలో పడేయాలని అన్నారు. 

ఎంతో పేదలైన గిరిజనులు ఉండే నియోజకవర్గం ఇది. అలాంటి పేదల కోసం నేను 16 పథకాలు తీసుకువచ్చానని గుర్తు చేసుకున్నారు.  పేదవాళ్లందరికీ పింఛన్లు ఇస్తాను. రూ.200 పింఛను రూ.2 వేలు చేసింది నేనే. పింఛన్లు ప్రారంభించింది ఎన్టీఆర్.  ఇంటివద్దనే రూ.4 వేల పెన్షన్ ఇస్తాను. ఏప్రిల్ 1 నుంచి వర్తించేలా పెన్షన్ ఇస్తాం. వికలాంగులకు జులైలో రూ.12 వేలు వస్తాయి. ఎప్పుడైనా జలగ జగన్ ఇలాంటి ఆలోచనలు చేశాడా? జగన్  వచ్చాక బాదుడే బాదుడు, గుద్దుడే గుద్దుడు! అన్నీ ధరలు పెరిగిపోయాయి. కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెరిగిపోయాయి. నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. మేం అధికారంలోకి వచ్చాక ధరలు తగ్గిస్తామన్నారు. 

మహాశక్తి పథకం కింద ఆడబిడ్డలకు నెలకు.1,500 ఇస్తాం. సంవత్సరానికి రూ.18,000 చొప్పున ఐదేళ్లలో రూ.90,000 ఇస్తాం. ఇంట్లో ముగ్గురుంటే ఐదేళ్లలో రూ.2.70 లక్షలు ఇస్తాం. తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు ఆర్థిక సాయం అందిస్తాం. ఒక బిడ్డ ఉంటే రూ.15 వేలు, ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తాం.   దీపం పథకం కింద ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. అన్నదాత రైతన్నకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. భవిష్యత్ లో ఆడబిడ్డలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ వస్తుందన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP Warning Bells:  వార్నింగ్ బెల్స్ వినిపిస్తున్నాయా బాబుగారూ..?
వార్నింగ్ బెల్స్ వినిపిస్తున్నాయా బాబుగారూ..?
Revanth Chitchat: 3 అనుమానాస్పద మరణాలకు కేటీఆర్‌కు లింకేంటి ? - ఢిల్లీలో సీఎం రేవంత్ చిట్ చాట్
3 అనుమానాస్పద మరణాలకు కేటీఆర్‌కు లింకేంటి ? - ఢిల్లీలో సీఎం రేవంత్ చిట్ చాట్
MLC Election Voting Procedure : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలి? ఈ జాగ్రత్తలు పాటించకుంటే నష్టమే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలి? ఈ జాగ్రత్తలు పాటించకుంటే నష్టమే!
Universal Pension Scheme: దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్‌- ఉద్యోగుల్లా ప్రతి నెల పింఛన్ వచ్చే పథకానికి రూపకల్పన
దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్‌- ఉద్యోగుల్లా ప్రతి నెల పింఛన్ వచ్చే పథకానికి రూపకల్పన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

GV Reddy Resign Controversy | GV రెడ్డి రాజీనామాతోనైనా చంద్రబాబులో మార్పు వస్తుందా.? | ABP DesamAP Deputy CM Pawan Kalyan Speech | మొఘలులు ఓడించారనేది మన చరిత్ర అయిపోయింది | ABP DesamPastor Ajay Babu Sensational Interview | యేసును తిడుతున్నారు..అందుకే హిందువులపై మాట్లాడుతున్నాం |ABPAdani Speech Advantage Assam 2.0 | అడ్వాంటేజ్ అసోం 2.0 సమ్మిట్ లో అదానీ సంచలన ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Warning Bells:  వార్నింగ్ బెల్స్ వినిపిస్తున్నాయా బాబుగారూ..?
వార్నింగ్ బెల్స్ వినిపిస్తున్నాయా బాబుగారూ..?
Revanth Chitchat: 3 అనుమానాస్పద మరణాలకు కేటీఆర్‌కు లింకేంటి ? - ఢిల్లీలో సీఎం రేవంత్ చిట్ చాట్
3 అనుమానాస్పద మరణాలకు కేటీఆర్‌కు లింకేంటి ? - ఢిల్లీలో సీఎం రేవంత్ చిట్ చాట్
MLC Election Voting Procedure : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలి? ఈ జాగ్రత్తలు పాటించకుంటే నష్టమే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలి? ఈ జాగ్రత్తలు పాటించకుంటే నష్టమే!
Universal Pension Scheme: దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్‌- ఉద్యోగుల్లా ప్రతి నెల పింఛన్ వచ్చే పథకానికి రూపకల్పన
దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్‌- ఉద్యోగుల్లా ప్రతి నెల పింఛన్ వచ్చే పథకానికి రూపకల్పన
Euphoria Making Video: గుణశేఖర్, భూమిక 'యుఫోరియా' మూవీ షూటింగ్ పూర్తి - మేకింగ్ వీడియో చూశారా?
గుణశేఖర్, భూమిక 'యుఫోరియా' మూవీ షూటింగ్ పూర్తి - మేకింగ్ వీడియో చూశారా?
US Gold Card : పౌరసత్వానికి రేటు కట్టిన ట్రంప్ - అమెరికాను ఇలా దిగజార్చుతారని ఎవరైనా అనుకుంటారా?
పౌరసత్వానికి రేటు కట్టిన ట్రంప్ - అమెరికాను ఇలా దిగజార్చుతారని ఎవరైనా అనుకుంటారా?
Indiramma Atmiya Bharosa Amount: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, వారి ఖాతాల్లో రూ.6 వేలు చొప్పున జమ
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, వారి ఖాతాల్లో రూ.6 వేలు చొప్పున జమ
Ration Cards EKYC Update News: ఏపీ, తెలంగాణలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- మార్చి 31 తర్వాత సేవలు ఆగిపోవచ్చు!
ఏపీ, తెలంగాణలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- మార్చి 31 తర్వాత సేవలు ఆగిపోవచ్చు!
Embed widget