అన్వేషించండి

జేపీ నడ్డాకు సమాధి కడతారా? సంస్కారం నేర్పింది ఎవరు?- కేసీఆర్‌పై రెచ్చిపోయిన బండి సంజయ్

తెలంగాణలో ఫ్లోరోసిస్ సమస్యలే లేదని, మిషన్ భగీరథ నీళ్లతో ఆ సమస్య పూర్తిగా పరిష్కారమైందని పదేపదే గప్పాలు కొట్టిన టీఆర్ఎస్ నేతలు అదే అంశంపై సమాధి కట్టడానికి సిగ్గు లేదా? అంటూ ధ్వజమెత్తారు బండి సంజయ్.

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు కురిపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమాధి కట్టడంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్దారు. కేసీఆర్... యూజ్ లెస్ ఫెలో.. ఎవరు మీకు చదువు, సంస్కారం నేర్పింది? బతికున్నవాళ్లకు సమాధి కడతారా? ‘‘అంటూ మండిపడ్డారు. 

తెలంగాణలో ఫ్లోరోసిస్ సమస్యలే లేదని, మిషన్ భగీరథ నీళ్లతో ఆ సమస్య పూర్తిగా పరిష్కారమైందని పదేపదే గప్పాలు కొట్టిన టీఆర్ఎస్ నేతలు అదే అంశంపై సమాధి కట్టడానికి సిగ్గు లేదా? అంటూ ధ్వజమెత్తారు బండి సంజయ్. డబుల్ బెడ్రూం ఇండ్లు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, దళిత బంధు సహా ఇచ్చిన హామీలన్నీ విస్మరించిన టీఆర్‌ఎస్‌ నేతలకు తెలంగాణలో ఎన్ని సమాధులు కట్టాలి? అట్లా చేస్తే కేసీఆర్‌ నీ పరిస్థితి ఏమిటో ఆలోచించావా? అంటూ దుయ్యబట్టారు. గొల్ల కురుమలకు గొర్రెల పైసలు రాకుండా ఫ్రీజ్ చేయాలంటూ తాను ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు నిరూపించే దమ్ము ఉందా? అని కేసీఆర్‌ను నిలదీశారు. దమ్ముంటే నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా భార్యాపిల్లలతో కలిసి ప్రమాణం చేసేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. 

ఖమ్మంలో టీఆర్ఎస్ కార్యకర్తను హత్య చేసిన కేసులో ఏ1గా ఉన్నది కమ్యూనిస్టు నేతేనని... ఆ కేసును మాఫీ చేసేందుకే కమ్యూనిస్టు పార్టీని, కార్యకర్తల పోరాటాలను సీఎం కేసీఆర్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపదొస్తే ఆదుకునే పేరున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనుగోడు ఎన్నికల్లో ధీటైన వ్యక్తే లేరని అన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలో జరిగిన ఎన్నికల ప్రచారం నిర్వహించారు బండి సంజయ్. 

బతికుండగానే మన సమాధి కట్టి, ఫొటో పెడితే కుటుంబ సభ్యులు బాధపడతారా? లేదా?... మరి టీఆర్ఎస్ వాళ్లను ఏమనాలె? నిజాయితీకి నిలువుటద్దంగా మారిన జేపీ నడ్డాకు సమాధి కట్టిన టీఆర్ఎస్ నేతలను ఏం చేయాలే? కేసీఆర్ ను ఏం చేయాలే అంటూ తీవ్ర విమర్శలు చేశారు బండి సంజయ్.
 
రేపు తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే. ఈరోజు ఎవరైతే సమాధి పేరుతో అవహేళన చేశారో... వారి బట్టలూడదీసి కొట్టే రోజులు త్వరలోనే రాబోతున్నాయ్ అని హెచ్చరించారు బండి సంజయ్‌ కార్యకర్తలను కంట్రోల్ చేయడం చేతగాకుంటే మూసుకుని ఉండమన్నారు. తాను ఇట్లాంటివి సహించే ప్రసక్తే లేదన్నారు. బతికున్న వ్యక్తికి సమాధి కడతారా? తెలంగాణలో ఫ్లోరైడ్ సమస్యే లేదని చెప్పిన కేసీఆర్...  మిషన్ భగీరథ నీళ్లతో ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారమైందని చెప్పి.... ఫ్లోరోసిస్ సమస్య పై జేపీ నడ్డా పేరుతో సమాధి ఎట్లా కట్టినవ్ అని నిలదీశారు. 

మునుగోడు నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని మాట తప్పినవ్... వాళ్లంతా సమాధి కడితే ఊరుకుంటావా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. వేల మంది యువత ఉద్యోగ, ఉపాధి లేక హైదరాబాద్‌లో ఆటో, క్యాబ్ డ్రైవర్లుగా బతుకుతున్నారు. మరి ఉద్యోగాలిస్తానని, నిరుద్యోగ భృతి ఇస్తానని మాట తప్పినవ్ కదా... అందుకు సమాధి కట్టాలా? అని అడిగారు. దళిత బంధు ఇస్తానని మాట తప్పినవ్.. ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదన్నారు. పోడు భూముల సమస్యలు పరిష్కారం కాలే.... మరి వీళ్లంతా సమాధి కడితే ఎట్లా ఉంటుందో ఊహించుకో అన్నారు. ఓ నిజాయితీ పరుడు, మహానుభావుడైన జేపీ నడ్డా పేరుతో సమాధికడతావా? అని ఫైర్‌ అయ్యారు. 

గొల్ల కురుమలకు ఇచ్చిన నగదు సీజ్ చేయాలని తాను ఎన్నికల సంఘాన్ని లేఖ రాసినట్లు మళ్లీ అబద్దాలాడతారా? అని గర్జించారు. గతంలో ఇట్లనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరద సాయంపై, హుజూరాబాద్‌లో దళిత బంధుపై ఇట్లనే అబద్దాలాడితే జనం కర్రువాత పెట్టినా కేసీఆర్ కు సిగ్గు రాలేదన్నారు. 

చలిదొన లక్ష్మీనర్సింహాస్వామి సాక్షిగా చెబుతున్నా.... నా భార్యాపిల్లలపై ఒట్టేసి చెబుతున్నా... రేపు నేను భార్యాపిల్లలతో నేనొస్తా... దమ్ముంటే కేసీఆర్ నువ్వు, నీ కుటుంబం ఇక్కడికి రా.... ప్రమాణం చేద్దాం రా.... గొల్ల కురుమలకు డబ్బులివ్వడం చేతగాక... ఆ సాకును నాపై రుద్దుతావా? అని బండి సంజయ్‌ సవాల్ చేశారు. కేసీఆర్... దమ్ముంటే టైం.. డేట్ ఫిక్స్ చేయ్...  నా సవాల్ ను స్వీకరించాలన్నారు. లేకుంటే మునుగోడు ప్రజలు తరిమితరిమి కొడతారన్నారు. కల్లాకపటం లేని గొల్లకురుమల ఉసరు ఊరికే పోదని హెచ్చరించారు. 

కేసీఆర్‌కు మునుగోడు ఎన్నికలంటేనే వణుకు పుడుతోందని అభిప్రాయపడ్డారు బండి సంజయ్. అందుకే జ్వరం పట్టుకుందన్నారు. కొడుకేమో ట్విట్టర్లో,... బిడ్డ లిక్కర్లో... అల్లుడు దొంగ మాటల్లో....సడ్డకుడి కొడుకు కమీషన్లలో...ఇదీ కేసీఆర్ కుటుంబం తీరని తీవ్ర ఆరోపణలు చేశారు. 

సిద్దిపేటలో దుబ్బాక లచ్చమ్మ మెడలో తాళిబొట్టుకు గుంజుకుపోయిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు బండి సంజయ్. దండుపాళ్యం ముఠా లెక్క ఇయాళ మునుగోడుపై పడ్డారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బిచ్చపు బతుకు కేసీఆర్‌దన్నారు. ఫైనాన్స్ కట్టలేదని సొంత కారును, ప్రచార రథాన్ని కూడా ఫైనాన్స్ వాళ్లు, మంజీరా బ్యాంకు వాళ్లు గుంజుకుపోయిండ్రన్నారు. దీనికి గాదె ఇన్నయ్యే సాక్షి అని చెప్పారు. ఆనాడు నయాపైసా లేని కేసీఆర్... ఇయాళ 100 కోట్ల రూపాయలతో సొంత విమానం ఎట్లా కొన్నావ్? వేల కోట్ల ఆస్తులను ఇరాన్, ఇరాక్, దుబాయ్, చైనా, బంగ్లాదేశ్‌లో ఎట్లా పెట్టుబడులు పెట్టినవో ప్రజలకు సమాధానం చెప్పాలా? అని బండి సంజయ్ నిలదీశారు. 

ఉపఎన్నికలొస్తేనే సీఎం వస్తారని... రోడ్లంటారన్నారు బండి సంజయ్‌. ఎన్నికలు కాంగనే మళ్లీ పోయి ఫాంహౌజ్‌లో పడుకునే వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే చౌటుప్పల్ కు రోడ్డు వచ్చిందన్నారు. గట్టుప్పల్ మండలం వచ్చిందని గుర్తు చేశారు. చేనేత బంధు వచ్చిందని... పెన్షన్లు వచ్చినయ్... బస్తీ దవాఖానా రాబోతోందని తెలిపారు. ఒక్క వ్యక్తిని ఎదుర్కొవడానికి దండుపాళ్యం ముఠా పడ్డదన్నారు. గుంట నక్కలు గుంపులుగా వచ్చినయ్... రాజగోపాల్ రెడ్డి సింహం... సింగిల్ గా వచ్చారన్నారు. గతంలో హుజూరాబాద్‌లోనూ డబ్బును టీఆర్ఎస్ నేతలు ఏరులై పారించారు. అక్కడి ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పారు... హుజూరాబాద్ తీర్పుతో ఫాంహౌజ్ లో ఉన్న కేసీఆర్ ను ఇందిరాపార్క్ కు గుంజుకొచ్చినవ్... ఇప్పుడు దేశమంతా తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. 

దసరా చీరల పేరుతో ఆర్ఎస్ బ్రదర్స్, జేసీ బ్రదర్స్ నుంచి చీరలు తీసుకుని చేనేత కార్మికుల పొట్ట కొట్టారని విమర్శించారు బండి సంజయ్. తెలంగాణ తల్లి రోదిస్తోంది... కేసీఆర్ కబంధ హస్తాల్లో బంధీ అయిన... బంధవిముక్తి చేయాలని మునుగోడు ప్రజలను బండి సంజయ్ వేడుకున్నారు. తెలంగాణ తల్లికి బంధ విముక్తి జరగాలంటే... మునుగోడులో టీఆర్ఎస్ ను తరిమితరిమికొట్టాలన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections 2026: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
Delimitation 2026 : నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
Kerala Assembly Elections2026: సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!
సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!
Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB Vs SRH Result Update: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
CM Revanth Reddy: 2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Embed widget