అన్వేషించండి

Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్లలో ఏపీ వాటా ఎంతో తెలుసా..?

Electoral Bonds In AP: ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్న ఫండింగ్‌ స్కీమ్‌గా దీన్ని పేర్కొంటారు.

AP Share In Electoral Bonds?: ఎలక్టోరల్‌ బాండ్లను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్న ఫండింగ్‌ స్కీమ్‌గా దీన్ని పేర్కొంటారు. దీనికి ఎక్కడి నుంచి ఎలా నిధులు వస్తాయో ఎవరికీ తెలియదు. వచ్చే నిధులను ఆయా పార్టీలు వినియోగించుకుంటాయి. అనేక సార్లు బ్లాక్‌ మనీ కూడా ఈ బాండ్ల రూపంలో వస్తాయి. ఖాతాలో పడగానే అది వైట్‌గా మారిపోతుంది. అటువంటి ఎలక్టోరల్ బాండ్లను రాజ్యాంగ వ్యతిరేకంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు వాటిని రద్దు చేయాలని తీర్పును ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, తెలుగుదేశం పార్టీలకు ఎంతెంత మొత్తం ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

ఏపీ వాటా రూ.529 కోట్లు

ఎలక్టోరల్‌ బాండ్ల విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు ఇప్పటి వరకు రూ.529.04 కోట్లు బాండ్ల రూపంలో వచ్చాయి. ఇందులో అధికార వైసీపీకి రూ.382.44 కోట్లు రాగా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి రూ.146 కోట్లు వచ్చాయి. ఇందులో సంవత్సరాలు వారీగా తీసుకుంటే 2017-18లో ఇరు పార్టీలకు రూపాయి కూడా రాలేదు. 2018-19 ఏడాదిలో వైసీపీకి రూ.99.84 కోట్లు రాగా, టీడీపీకి రూ.27.5 కోట్లు, 2019-20లో వైసీపీకి రూ.74.35 కోట్లు, టీడీపీకి రూ.81.6 కోట్లు, 2020-21లో వైసీపీకి రూ.96.25 కోట్లు రాగా, టీడీపీకి రూపాయి కూడా రాలేదు. 2021-22లో వైసీపీకి రూ.60, టీడీపీకి రూ.3.5 కోట్లు, 2022-23లో వైసీపీకి రూ.52 కోట్లు రాగా, టీడీపీకి రూ.34 కోట్లు వచ్చాయి. మొత్తంగా గడిచిన ఆరేళ్లలో (2023 వరకు) వైసీపీకి రూ.382.44 కోట్లు బాండ్ల రూపంలో రగా, టీడీపీకి రూ.146 కోట్లు వచ్చాయి. 

మూడు రకాలుగా వచ్చే విరాళాలు

రాజకీయ పార్టీలకు మూడు రకాలుగా నిధులు సమకూరుతుంటాయి. వ్యక్తులు ఇచ్చే విరాళాలు. ఇలా వ్యక్తులు ఇచ్చే విరాళాలను రూ.20 వేలకుపైగా ఉంటే పార్టీలు వెల్లడించాల్సి ఉంటుంది. రెండోది ఫ్రువెడెన్షియల్‌ ట్రస్ట్‌ బాండ్లు. ఇది మధ్యస్తంగా చెబుతారు. ఒక వ్యక్తి లేదా సంస్థ ప్రుడెన్షియల్‌ ట్రస్ట్‌కు విరాళం ఇవ్వవచ్చు. ఇలాంటివన్నీ సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలకు ఎక్కువగా వెళుతుంటాయి. మూడోది ఎలక్టోరల్‌ బాండ్లు. సంస్థ లేదా వ్యక్తి స్టేట్‌ బ్యాంక్‌లో ప్రాథమిక వివరాలు చెప్పి ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి పార్టీలకు ఇస్తారు. ఈ విరాళం ఎవరిచ్చారన్నది పార్టీలు ప్రకటించాల్సిన అవసరం లేదు. అంటే బ్లాక్‌ మనీ మొత్తం రాజకీయ పార్టీలకు ఈ రూపంలో వెళ్లేందుకు అవకాశం ఉంది. దీన్నే ప్రస్తుతం సుప్రీంకోర్టు తప్పుబట్టింది.

టాప్ హెడ్ లైన్స్

TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Embed widget