అన్వేషించండి

ఏపీలో 22 రోజులకే ఇంటర్ ఫలితాలు, తెలంగాణలో మరీ అంత లేటా?

ఎంసెట్‌తో పాటు ఇతర పరీక్షల దృష్ట్యా, వీలైనంత త్వరగా వాల్యూయేషన్ పూర్తి చేయాలని చూస్తోంది. అన్నీ కుదిరితే మే రెండో వారంలో ఇంట‌ర్ ఫ‌లితాల‌ను విడుదల చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

➥ చివరి దశకు చేరుకున్న ఇంటర్ మూల్యాంకనం

➥ మే 10న ఫలితాలు వెలువడే అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడటంతో.. ఇక ఫలితాల కోసం ఎదురుచూపులు తెలంగాణ విద్యార్థుల వంతైంది. ఏపిలో ఏప్రిల్ 26న ఇంటర్ ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. పరీక్ష పూర్తయిన 22 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం విశేషం. ఏపీలో మార్చి 15న ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 4తో ముగిశాయి. అయితే తెలంగాణలోనూ ఇంటర్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగాయి. కాని ఏపీలో అతి తక్కువ కాలంలో ఫలితాలు వెలువరించగా.. తెలంగాణలో మాత్రం ఫలితాల వెల్లడికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారంలేదు.

మూల్యాంకన ప్రక్రియ కూడా ఏపీ కంటే ముందుగానే తెలంగాణలో ప్రారంభమైంది. ఈ ఏడాది తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు 9 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరం పరీక్షలకు 4,82,619 మంది విద్యార్థులు హాజరుకాగా, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 4,02,630 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రస్తుతం మూల్యాంకన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దీంతో సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఎంసెట్‌తో పాటు ఇతర పరీక్షల దృష్ట్యా.... వీలైనంత త్వరగా వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తోంది. అన్నీ కుదిరితే మే రెండో వారంలో ఇంట‌ర్ ఫ‌లితాల‌ను విడుదల చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెలఖారులోగా వాల్యూయేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారని సమాచారం. విద్యార్థులు ఓవైపు ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తూనే ఎంసెట్, నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పనిలో లీనమయ్యారు.

తెలంగాణలో ఒకవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకులు, టెన్త్ పేపర్ల లీకేజీల వ్యవహారాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో.. గత అనుభవాల దృష్ట్యా (గ్లోబరీనా వ్యవహారం) ఇంటర్ ఫలితాల విషయంలో ఎలాంటి పొరపాట్లు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం కావడంతో ప్రభుత్వ కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది.

Also Read:

ఏపీ ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు విడుదల, 61 శాతం ఉతీర్ణత నమోదు!
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 26) విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సాయంత్రం 6.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఫలితాల్లో మొత్తం 61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ఫస్టియర్ లో బాలురు 58%, బాలికలు 65 % ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షల్లో బాలుర కంటే బాలికలదే పైచేయిగా నిలిచింది. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో, 70 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా రెండో స్థానంలో, 68 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా మూడోస్థానంలో నిలిచాయి. 
ఫలితాల కోసం క్లిక్ చేయండి..

ఏపీ ఇంటర్ సెకండియర్ పరీక్ష ఫలితాలు విడుదల, 72 శాతం ఉతీర్ణత నమోదు!
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 26) విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సాయంత్రం 6 గంటలకు ఫలితాలనున విడుదల చేశారు. ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ సెకండియర్ పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఫలితాల్లో మొత్తం 72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ సెకండియర్ లో బాలురు 68% , బాలికలు 75%   ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటిస్థానంలో, 78 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో, 77 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా మూడోస్థానంలో నిలిచింది.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..

ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
CPR Full Form in Telugu: సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Task Force for Exam Reforms: పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
Paper Leak New Bill: పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Embed widget