అన్వేషించండి

TS Inter Supply Results: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం (జులై 7) విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఆన్‌లైన్‌లో ఫలితాలను ఇంటర్ బోర్డు ప్రకటించింది.

➥ ఫ‌స్టియ‌ర్‌లో జ‌న‌ర‌ల్ 63 శాతం, ఒకేష‌నల్ 55 శాతం ఉత్తీర్ణత
➥ సెకండియర్‌‌లో జ‌న‌ర‌ల్ 46 శాతం, వొకేష‌నల్ 60 శాతం ఉత్తీర్ణత

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం (జులై 7) విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఆన్‌లైన్‌లో ఫలితాలను ఇంటర్ బోర్డు ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఇంటర్ జనరల్, ఒకేషనల్, బ్రిడ్జ్ కోర్సు, ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సు అన్ని కోర్సుల ఫలితాలను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. 

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 

ఉత్తీర్ణత వివరాలు ఇలా..
ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ జ‌న‌ర‌ల్ విద్యార్థులు 63 శాతం ఉత్తీర్ణత సాధించ‌గా, వొకేష‌నల్ విద్యార్థులు 55 శాతం ఉత్తీర్ణత సాధించారు. 
ఇంటర్ ఫ‌స్టియ‌ర్‌లో 2,52,055 మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షలు రాయ‌గా.. 1,57,741 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఫ‌స్టియ‌ర్‌ ఒకేష‌న‌ల్ కోర్సుల‌కు సంబంధించి 18,697 మంది విద్యార్థులు ప‌రీక్షలు రాయ‌గా, 10,319 మంది ఉత్తీర్ణులయ్యారు. 
ఇంటర్ సెకండియర్‌ ఫ‌లితాల్లో జ‌న‌ర‌ల్ విద్యార్థులు 46 శాతం, వొకేష‌నల్ విద్యార్థులు 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. 
ఇంటర్ సెకండియర్‌లో మొత్తం 1,29,494 మంది విద్యార్థులు స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షలు రాయ‌గా.. 59,669 మంది ఉత్తీర్ణత సాధించారు.
సెకండియర్‌ ఒకేష‌న‌ల్ కోర్సుల‌కు సంబంధించి 11,013 మంది విద్యార్థులు ప‌రీక్షలు రాయ‌గా.. 6,579 మంది ఉత్తీర్ణులయ్యారు.

తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 12 నుంచి 20 వ‌ర‌కు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం ఫస్టియర్‌ విద్యార్థులకు, మధ్యాహ్నం సెకండియర్‌ వారికి పరీక్షలు జ‌రిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షాకేంద్రాల్లో ఈ ప‌రీక్షల‌ను నిర్వహించారు. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌కి క‌లిపి మొత్తం 4,12,325 మంది విద్యార్థులు ఈ పరీక్షలను రాశారు. ఇందులో ఫస్టియర్‌కి 2,70,583 మంది, సెకండియ‌ర్‌కి 1,41,742 మంది విద్యార్థులు ఈ ప‌రీక్షల‌కు హాజ‌ర‌య్యారు.

ALSO READ:

ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?
తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. రాష్ట్రంలోని అన్ని రకాల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి తుది గడువును జూన్ 25 వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ జులై 1న ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు పొందిన కళాశాలల్లోనే ప్రవేశాలు తీసుకోవాలని,  ఆయా కాలేజీల జాబితా బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులకు మిత్తల్ సూచించారు. ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా.. ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు నవీన్‌మిట్టల్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఇంటర్‌లో బైపీసీనా, ఎంబీబీఎస్ సీటు రాకపోయినా సరే - మరెన్నో కోర్సులున్నాయి!
ఇంటర్ లో బైపీసీ తీసుకొని.. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక చాలా మంది విపరీతంగా భయపడిపోతుంటారు. ముఖ్యంగా ఎంబీబీఎస్ లో సీటు రాకపోతే ఆ తర్వాత ఏం చేయాలో తెలియక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. బీఏఎంస్, బీహెచ్ఎంఎస్, బీడీఎఎస్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సుల్లో చేరుతుంటారు. మరికొంత మంది విదేశాల్లోనూ వైద్య విద్య అభ్యసించడానికి వెళ్తుంటారు. కానీ ఇంటర్ లో బైపీసీ చదివి ఎంబీబీఎస్ యే కాకుండా ఆ తర్వాత చదివేందుకు అనేక కోర్సులు ఉన్నాయి. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇక తెలుగులోనూ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష! ఐఐటీ కౌన్సిల్‌లో నిర్ణయం!
జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామ్‌(జేఈఈ) అడ్వాన్స్‌డ్‌‌కు హాజరయ్యే తెలుగు విద్యార్థులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నీట్‌, జేఈఈ మెయిన్‌ తరహాలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షనూ తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఐఐటీ కౌన్సిల్‌, ఐఐటీ ఢిల్లీని ఆదేశించింది. ప్రధానంగా ఐఐటీల్లో డ్రాపౌట్ల నివారణకు తీసుకోవల్సిన చర్యలపై ఐఐటీ కౌన్సిల్‌ దృష్టి పెట్టింది. డ్రాపౌట్స్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి  నివేదికను ఇవ్వాలని ఐఐటీ ఖరగ్‌పూర్‌ను కౌన్సిల్‌ ఆదేశించింది. గత ఏప్రిల్‌లో జరిగిన ఐఐటీ కౌన్సిల్‌ మీటింగ్‌కు సంబంధించిన  తీర్మానాలను కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
NEET Re-Exam 2026: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్‌! నీట్ రీ ఎగ్జామ్‌కు ముందు ఎన్‌టిఎ నిర్లక్ష్యం!
నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్‌! నీట్ రీ ఎగ్జామ్‌కు ముందు ఎన్‌టిఎ నిర్లక్ష్యం!
NEET Re-Exam June 21: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్‌కు ముందే బిగ్ ఆపరేషన్! రెండున్నర లక్షలతో మెగా మాక్‌డ్రిల్‌!
నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్‌కు ముందే బిగ్ ఆపరేషన్! రెండున్నర లక్షలతో మెగా మాక్‌డ్రిల్‌!
AP SSC Supply Results: ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, మెమో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, మెమో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Annadata Sukhibhava Status Check Online: రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Annadata Sukhibhava Status Check Online: రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
KTR Latest News:
"కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి - ఆత్మహత్యలు చేసుకోవద్దు" రైతులకు కేటీఆర్ సూచన! 
Allu Arjun : ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
Barmer Instagram Influencer Murder Case: నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
IND vs AFG 3rd ODI Records: రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
Embed widget