TG Inter Results 2026 Link: ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్తో రిజల్ట్స్ ఇలా
Telangana Inter Results 2026 Link | తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు https://tgbie.in/result.html లో విడుదల చేయనున్నారు.

హైదరాబాద్: తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఇంటర్మీడియట్ ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. ఏప్రిల్ 12 (ఆదివారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్ కె. కేశవ రావు, విద్యాశాఖ కార్యదర్శి, టీజీబీఐఈ వైస్ చైర్పర్సన్ యోగితా రానా పాల్గొని ఫలితాలను విడుదల చేయనున్నారు. https://tgbie.in/result.html
ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.97 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4.41 లక్షలు కాగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5.07 లక్షల మంది ఉన్నారు. ఇంటర్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
ఫలితాలను ఎలా చూసుకోవాలి? విద్యార్థులు తమ ఫలితాలను, మార్కుల మెమోను అధికారిక వెబ్సైట్లు https://tgbie.cgg.gov.in , http://results.cgg.gov.in లో సులభంగా పొందవచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేసి మీ హాల్ టికెట్ నంబర్ను ఎంటర్ చేయడం ద్వారా వెంటనే ఫలితాలను పొందవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసి పెట్టుకోవాలని సూచించారు.

వాట్సాప్ ద్వారా ఇంటర్ ఫలితాలు
వెబ్సైట్లతో పాటు ఈసారి వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు పొందే వెసులుబాటు కల్పించారు. దీనికోసం 8096958096 నెంబర్కు వాట్సాప్లో 'Hi' అని మెసేజ్ పంపి, అక్కడ అడిగిన వివరాలు, హాల్ టికెట్ నంబర్ నమోదు చేయడం ద్వారా సులభంగా మార్కుల మెమోను పొందవచ్చు. ఫలితాల అనంతరం మార్కులతో అసంతృప్తిగా ఉన్న వారికి రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేసుకునే అవకాశాన్ని కూడా బోర్డు కల్పించనుంది. https://tgbie.in/result.html
ఉత్తీర్ణత, గ్రేడింగ్
ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం ఉత్తీర్ణత సాధించాలంటే విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. 75 శాతం కంటే ఎక్కువ మార్కులు వస్తే A గ్రేడ్, 60 నుంచి 74 శాతం మధ్య మార్కులు వస్తే B గ్రేడ్ కేటాయిస్తారు. ఒకవేళ ఫలితాలతో అసంతృప్తిగా ఉంటే, రీ-వెరిఫికేషన్ లేదా రీ-కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని బోర్డు కల్పించనుంది. అతి తక్కువ సమయంలోనే మూల్యాంకనం పూర్తి చేసి బోర్డు ఈ ఫలితాలను సిద్ధం చేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు



















