అన్వేషించండి

TS EdCET Exams: నేటి నుంచి తెలంగాణ ఎడ్‌సెట్‌.. రెండు సెషన్లలో పరీక్షలు

48 కేంద్రాలలో పరీక్షలు నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీఎడ్‌సెట్‌ కోకన్వీనర్‌ పారిపల్లి శంకర్‌ వెల్లడి

తెలంగాణలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్ )- 2021 పరీక్షలు ఈరోజు నుంచి (ఆగస్టు 24) ప్రారంభం కానున్నాయి. బుధవారం (ఆగస్టు 25) కూడా ఈ పరీక్షలు జరగనున్నాయి. వీటి ద్వారా 2021 - 22 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు చేపట్టనున్నారు. మొత్తం రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహిస్తారు. పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోనే పరీక్షలు జరగనున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది.

మొదటి సెషన్ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు.. రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 48 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎడ్‌సెట్‌ కోకన్వీనర్‌ డాక్టర్‌ పారిపల్లి శంకర్‌ వెల్లడించారు. పరీక్ష సమయానికి ముందే ఆయా కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షకు నిర్దేశించిన సమయం కంటే నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.

కాగా, తెలంగాణలో ఎడ్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 19న ప్రారంభమైంది. కరోనా కారణంగా గడువును పొడిగిస్తూ వచ్చారు. కోవిడ్ తీవ్రత కాస్త తగ్గడంతో పరీక్షలను నిర్వహిస్తున్నారు.

పరీక్ష కేంద్రాల వివరాలివే.. 
హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ ఈస్ట్, హైదరాబాద్ వెస్ట్, హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్, ఆదిలాబాద్, ఖమ్మం, సిద్దిపేట, పాల్వంచ, సత్తుపల్లి, నిజామాబాద్, కర్నూలు, నల్గొండ, కరీంనగర్‌, వరంగల్, విజయవాడ, కోదాడ, మహబూబ్‌నగర్, నర్సంపేట్ పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి. 

Also Read: JEE Main Admit Card 2021: జేఈఈ మెయిన్ 2021 అడ్మిట్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి.. కింద లింక్ ఉంది..
ఏపీ ఎడ్‌సెట్‌ ముఖ్యమైన తేదీలివే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్ ) - 2021 నోటిఫికేషన్ విడుదలైంది. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ జూలై 17న ప్రారంభం కాగా, ఆగస్టు 17వ తేదీతో ముగిసింది. అయితే ఆలస్య రుసుముతో ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉంది. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఎడ్‌సెట్ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కే.విశ్వేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ఎడ్‌సెట్ పరీక్ష సెప్టెంబరు 21వ తేదీన ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Read More: AP EdCET 2021: ఏపీ ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..

Also Read: Grand Old 10th Class Student : ఆ 86 ఏళ్ల మాజీ సీఎం టెన్త్ పాసవుతారా? లేదా? నిన్నే ఇంగ్లిష్ పరీక్ష రాశారు...

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
Skyroot Vikram-1 launch: నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!
నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget