అన్వేషించండి

TS Ed.CET 2023: టీఎస్ ఎడ్‌సెట్ ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

తెలంగాణలోని బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్ దర‌ఖాస్తు గడువును ఏప్రిల్ 25 వ‌ర‌కు పొడిగిస్తున్నట్లు ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ ఏ రామ‌కృష్ణ ఒక ప్రక‌ట‌న విడుద‌ల చేశారు.

తెలంగాణలోని బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్ దర‌ఖాస్తు గ‌డువు ఏప్రిల్ 20తో ముగిసింది. అయితే అభ్యర్థుల విజ్ఞప్తుల మేర‌కు ద‌ర‌ఖాస్తుల గ‌డువును ఏప్రిల్ 25 వ‌ర‌కు పొడిగిస్తున్నట్లు ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ ఏ రామ‌కృష్ణ ఒక ప్రక‌ట‌న విడుద‌ల చేశారు. అర్హులైన అభ్యర్థులు వీలైనంత త్వర‌గా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని, త‌మ‌కు ద‌గ్గర్లో ఉన్న ప‌రీక్షా కేంద్రాల‌ను ఎంపిక చేసుకోవాల‌ని సూచించారు. జనరల్‌, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.500 రిజిస్ట్రేషన్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది మహాత్మాగాంధీ వర్సిటీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.

టీఎస్ ఎడ్‌సెట్ – 2023 దరఖాస్తు ప్రక్రియ మార్చి 6న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అభ్యర్థులు ఎలాంటి ఆల‌స్య రుసుము లేకుండా ఏప్రిల్ 20 వ‌ర‌కు ఉన్న ద‌ర‌ఖాస్తు గడువును ఏప్రిల్ 25 వ‌ర‌కు పొడిగించింది. దరఖాస్తు చేసుకున్నవారు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఏప్రిల్ 30న ఎడిట్ చేసుకోవ‌చ్చు. మే 5 నుంచి ఎడ్‌సెట్ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. మే 18న ప్రవేశ ప‌రీక్ష నిర్వహించి, మే 21న ప్రాథ‌మిక కీ విడుద‌ల చేయ‌నున్నారు. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించి, తదనంతరం ఫైనల్ కీతోపాటు, ఫలితాలను విడుదల చేస్తారు. దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.550, ఇత‌ర కేట‌గిరీల అభ్యర్థులు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

➥ TS Ed.CET – 2023 నోటిఫికేషన్ వెల్లడి: 04.03.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.03.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.04.2023.

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 30.04.2023.

➥ పరీక్ష హాల్‌టికెట్ల వెల్లడి: 05.05.2023.

➥ TS Ed.CET-2023 పరీక్ష తేది: 18.05.2023.

➥ పరీక్ష సమయం: మొదటి సెషన్: 09.00 AM -11.00 AM, రెండో సెషన్: 12.30 PM - 02.30 PM, మూడో సెషన్: 04.00 PM - 06.00 PM

➥ ప్రిలిమినరీ కీ విడుదల: 21.05.2023

➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 24.05.2023 వరకు.

➥ ఫలితాల వెల్లడి: ప్రకటించాల్సి ఉంది.

టీఎస్‌ ఎడ్‌సెట్ నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

Also Read:

సీయూఈటీ పీజీ - 2023 దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా మొత్తం 142 విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పించే కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ) దరఖాస్తు గడువును నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పొడిగించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి ఏప్రిల్‌ 19తో ముగియాల్సిన గడువును మే 5 వరకు పొడిగించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా వెంటనే తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మే 6, 7, 8 తేదీల్లో అవకాశం కల్పించింది. పరీక్ష తేదీలు, అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌, ఫలితాల ప్రకటన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేసుకునేందుకు వీలు లేదని స్పష్టం చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ పీహెచ్‌డీ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2022-23 విద్యాసంవత్సరానికి పీహెచ్‌డీ ప్రవేశ ప్రకటన ఏప్రిల్ 14న విడుదల చేసింది. ఇంగ్లిష్, హిందీ, ఎడ్యుకేషన్‌, చరిత్ర, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఎనిర్వాన్‌మెంటల్‌ సైన్స్‌ విభాగాల్లో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ లేదా 04023680411, 04023680241, 18005990101 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. మే 25న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆరోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు  అభ్యర్థులు మే 8లోగా పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా సుజనా చౌదరి! విజయసాయిరెడ్డి రాజీనామాతో లైన్ క్లియర్!
ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా సుజనా చౌదరి! విజయసాయిరెడ్డి రాజీనామాతో లైన్ క్లియర్!
Budget 2025: పీఎం ఆవాస్ యోజన నుంచి కిసాన్ సమ్మాన్ నిధి వరకు - సంక్షేమ పథకాలపై బడ్జెట్‌లో భారీ తాయిలాలు!
పీఎం ఆవాస్ యోజన నుంచి కిసాన్ సమ్మాన్ నిధి వరకు - సంక్షేమ పథకాలపై బడ్జెట్‌లో భారీ తాయిలాలు!
Nara Lokesh: విశాఖ కోర్టుకు హాజరైన నారా లోకేష్, అనంతరం యువగళం పాదయాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు
విశాఖ కోర్టుకు హాజరైన నారా లోకేష్, అనంతరం యువగళం పాదయాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు
Thandel First Review: 'తండేల్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఎడిట్ రూమ్‌లో మూవీ చూసిన అల్లు అరవింద్
'తండేల్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఎడిట్ రూమ్‌లో మూవీ చూసిన అల్లు అరవింద్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna on Padmabhushan | పద్మభూషణ్ పురస్కారంపై నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ | ABP DesamBobbili Battle Completes 268 Years | బొబ్బిలి యుద్ధం ఆనవాళ్లు నేటికీ పదిలం | ABP DesamGuntakal Railway Track Incident | రైల్వే ట్రాక్ చిక్కుపడిపోయిన ఆర్టీసీ బస్సు | ABP DesamJr NTR Kalyan Ram Tweet NBK Padma Bhushan | బాలకృష్ణకు పద్మభూషణ్ రావటంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంతోషం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా సుజనా చౌదరి! విజయసాయిరెడ్డి రాజీనామాతో లైన్ క్లియర్!
ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా సుజనా చౌదరి! విజయసాయిరెడ్డి రాజీనామాతో లైన్ క్లియర్!
Budget 2025: పీఎం ఆవాస్ యోజన నుంచి కిసాన్ సమ్మాన్ నిధి వరకు - సంక్షేమ పథకాలపై బడ్జెట్‌లో భారీ తాయిలాలు!
పీఎం ఆవాస్ యోజన నుంచి కిసాన్ సమ్మాన్ నిధి వరకు - సంక్షేమ పథకాలపై బడ్జెట్‌లో భారీ తాయిలాలు!
Nara Lokesh: విశాఖ కోర్టుకు హాజరైన నారా లోకేష్, అనంతరం యువగళం పాదయాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు
విశాఖ కోర్టుకు హాజరైన నారా లోకేష్, అనంతరం యువగళం పాదయాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు
Thandel First Review: 'తండేల్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఎడిట్ రూమ్‌లో మూవీ చూసిన అల్లు అరవింద్
'తండేల్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఎడిట్ రూమ్‌లో మూవీ చూసిన అల్లు అరవింద్
GBS Syndrome: మహారాష్ట్రలో కొత్త సిండ్రోమ్ కలకలం - వ్యాధి లక్షణాలివే!
మహారాష్ట్రలో కొత్త సిండ్రోమ్ కలకలం - వ్యాధి లక్షణాలివే!
Kannappa : ప్రభాస్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్ చెప్పిన మంచు విష్ణు... 'కన్నప్ప' నుంచి డార్లింగ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
ప్రభాస్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్ చెప్పిన మంచు విష్ణు... 'కన్నప్ప' నుంచి డార్లింగ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
Crime News: టీడీపీ సభ్యత్వం పేరుతో కొత్త తరహా మోసం, మహిళ అకౌంట్ నుంచి లక్ష కట్! న్యాయం చేయాలంటూ వీడియో
టీడీపీ సభ్యత్వం పేరుతో కొత్త తరహా మోసం, మహిళ అకౌంట్ నుంచి లక్ష కట్! న్యాయం చేయాలంటూ వీడియో
Rythu Bharosa Amount: తెలంగాణలో ఆ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ - నేటి నుంచి విత్ డ్రా షురూ
తెలంగాణలో ఆ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ - నేటి నుంచి విత్ డ్రా షురూ
Embed widget