అన్వేషించండి

TS SSC Results: తెలంగాణలో 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి

ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి 10 వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 55,662 మంది విద్యార్థులు హాజరయ్యారు.

తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు సెప్టెంబర్ 2న విడుదల చేశారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. 10వ తరగతి సప్లిమెంటరీ రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ http://www.results.manabadi.co.in/2022/TS/SSC-Sup/Telangana-TS-10th-class-SSC-Supply-Results-02092022.htm

ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి 10 వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ఉద‌యం 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12:45 గంట‌ల వ‌ర‌కు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు దాదాపు 55,662 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 204 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

ఫలితాల కోసం వెబ్‌సైట్: https://www.bse.telangana.gov.in 

వార్షిక పరీక్ష ఫలితాలు ఇలా...
తెలంగాణ పదో త‌ర‌గ‌తి పరీక్షలను  మే 23 నుంచి జూన్ 1 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. కొవిడ్‌-19 కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను 11 పేపర్ల పరీక్షకు బదులు 6 పేపర్లకు కుదించారు. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్‌ పెంచారు. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,09,275 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా వీరిలో 99 శాతం మంది హాజరయ్యారు.  జూన్ 30న పదోతగరతి ఫలితాలు వెల్లడించారు. ఫ‌లితాల్లో బాలిక‌లు 92.45 శాతం ఉత్తీర్ణత సాధించి విజ‌య‌భేరి మోగించారు. బాలురు 87.61 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రయివేటు విద్యార్థుల్లోనూ బాలిక‌ల‌దే పైచేయి. బాలిక‌లు 58.76 శాతం ఉత్తీర్ణత సాధించ‌గా, బాలురు 46.21 శాతం పాస‌య్యారు. 3,007 పాఠ‌శాల‌లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 15 పాఠ‌శాలల్లో జీరో శాతం ఉత్తీర్ణత న‌మోదైంది.  రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది ప‌రీక్షల‌కు హాజ‌రు కాగా, 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా టెన్త్ ఫ‌లితాల్లో 90 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక ప్రయివేటు విద్యార్థుల విష‌యానికి వ‌స్తే 819 మంది హాజ‌రు కాగా, 425 మంది పాస‌య్యారు. 51.89 శాతం ఉత్తీర్ణత సాధించారు.  ఫలితాల్లో 97 శాతం ఉత్తీర్ణతతో సిద్ధిపేట జిల్లా టాప్‌గా నిలువగా.. 79 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్‌ చివరిస్థానంలో నిలిచింది.

Also Read:

NSAT 2022: పేద విద్యార్థుల కోసం ‘నారాయణ’ స్కాలర్‌షిప్‌ టెస్ట్, దరఖాస్తు చేసుకోండి!
ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కోసం నారాయణ స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్ (NSAT) నిర్వహణకు నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది. 7వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌ టెస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా  పరీక్ష నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ పేర్లను వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. పరీక్షలో మెరిట్ ఆధారంగా విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందజేస్తారు.
అప్లి చేసుకోవడం సహా పూర్తి వివరాలు

Also Read:

దేశంలోనే తొలి వర్చువల్ స్కూల్ ప్రారంభం, ప్రత్యేకతలివే!
విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో ముందడుగు వేశారు. దేశంలోనే తొలి వర్చువల్ పాఠశాలను కేజ్రీవాల్ ఆగస్టు 31న ప్రారంభించారు. ‘ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్’గా దీనికి పేరు పెట్టారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాల‌నే ల‌క్ష్యంతో ఈ వర్చువల్ స్కూల్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. 
స్కూల్స్ పూర్తి వివరాలు

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget