అన్వేషించండి

JoSAA Counseling 2025: టాప్ ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల కేటాయింపు ప్రారంభం- పూర్తి షెడ్యూల్ ఇదే

JoSAA Counseling 2025: JoSAA 2025 కౌన్సెలింగ్ కోసం మొదటి అలాట్‌మెంట్ జాబితా జూన్ 14, 2025న ఉదయం 10:00 గంటలకు విడుదలైంది.

JoSAA Counseling 2025: జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (JoSAA) ద్వారా JEE Main, JEE Advanced 2025ల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సీట్లు కేటాయింపు ఇవాళ ప్రారంభమైంది. మొదటి అలాట్‌మెంట్ జాబితా ఇవాళ (జూన్ 14, 2025) ఉదయం 10:00 గంటలకు విడుదలైంది. ఈ జాబితాను josaa.nic.in వెబ్‌సైట్‌లో చూసుకోవాలంటే, విద్యార్థులు తమ JEE మెయిన్ లేదా JEE అడ్వాన్స్ అప్లికేషన్ నంబర్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి లాగిన్ కావాలి. ఈ జాబితాలో విద్యార్థులకు ఎక్కడ సీటు అలాట్ అయిందో, ఆ సీటును ఆమోదించడం ఎలా చేయాలో వివరాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుకునేందుకు లక్షల మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ కాలేజీల్లో  ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్ గడువు ముగిసింది. josaa.nic.in ద్వారా జూన్ 12న సాయంత్రం 5 గంటలకు వరకు రిజిస్ట్రేషన్ కోసం గడువు ఇచ్చారు.   

JoSAA కౌన్సెలింగ్ ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులు భారతదేశంలోని 127 ప్రముఖ సంస్థల్లో ప్రవేశం పొందేందుకు వీలు కలుగుతుంది. ఇందులో 23 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (IITs), 31 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (NITs), IIEST షిబ్‌పూ ర్, 26 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు (IIITs), 46 ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక సంస్థలు (GFTIs) ఉన్నాయి. 62,853 BTech సీట్లలో IITల్లో 18,160 సీట్లు, NITల్లో 24,525 సీట్లు, IIITల్లో 9,940 సీట్లు, GFTIsలో 10,228 సీట్లు ఉన్నాయి.

అభ్యర్థులు రిజిస్ట్రేషన్ విండోలో ఇష్టమైన కోర్స్,  సంస్థలను ఎంపిక చేసుకున్నారు. వాటి ఆధారంగా వచ్చిన ర్యాంకులు ఆధారంగా సీట్ల కేటాయింపు ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఒక్కో అభ్యర్థి ఎక్కువ ప్రాధాన్యతలు ఇచ్చారు. ఈ ప్రధాన్యాలు ఇవ్వని అభ్యర్థులకు  సిస్టమ్ చివరిగా సేవ్ చేసిన ప్రాధాన్యతలను ఆటోమేటిక్‌గా లాక్ చేస్తుంది. లాక్ తర్వాత మార్పులు చేయాలంటే, కేవలం అభ్యర్థి అభ్యర్థనపై మాత్రమే సాధ్యమవుతుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఇమెయిల్‌కు పంపిన OTP ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మార్పులు చేయడానికి వీలుకలుగుతుంది. 

కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆరు రౌండ్లలో సీట్ కేటాయింపు జరుగుతుంది. మొదటి రౌండ్ ఫలితాలు జూన్ 14న ఉదయం 10 గంటలకు ప్రకటించారు. IITలకు చివరి రౌండ్ ఫలితాలు జూలై 16న ప్రకటిస్తారు. మొత్తం ప్రక్రియ జులై 22న ముగుస్తుంది. సీట్ ఆమోదించిన తర్వాత ఐదో రౌండ్ సీట్ ఆమోద ప్రక్రియ ముగిసే లోపు ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే చేసుకోవచ్చు.  

రిజిస్ట్రేషన్ కాలంలో అభ్యర్థులకు రెండు మాక్ సీట్ అలోకేషన్లు కూడా ఇస్తారు. ఇవి అభ్యర్థులు తమ ప్రాధాన్యతల ఆధారంగా ఎలాంటి ఫలితాలు వస్తాయో అంచనా వేయడానికి సహాయపడతాయి.

లాగిన్ కోసం, JEE Main 2025 అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ని యూజ్ చేసుకోవాలి. విదేశీయులు,  OCI/PIO అభ్యర్థులు తమ JEE Advanced 2025 డైరెక్ట్ రిజిస్ట్రేషన్ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అవ్వాలి.

JoSAA 2025 కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలు:

జూన్ 14: మొదటి రౌండ్ సీట్ కేటాయింపు (ఉదయం 10 గంటలకు)

జూన్ 21: రెండవ రౌండ్ ఫలితాలు (సాయంత్రం 5 గంటలకు)

జూన్ 28: మూడవ రౌండ్ ఫలితాలు (సాయంత్రం 5 గంటలకు)

జూలై 4: నాల్గవ రౌండ్ ఫలితాలు (సాయంత్రం 5 గంటలకు)

జూలై 10: ఐదవ రౌండ్ ఫలితాలు (సాయంత్రం 5 గంటలకు)

జూలై 16: IITలకు చివరి రౌండ్ ఫలితాలు (సాయంత్రం 5 గంటలకు)

మరిన్ని అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు JoSAA వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చూసుకోవాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Embed widget