అన్వేషించండి

RGUKT: ఆర్జీయూకేటీ ప్రవేశాల జాబితా వచ్చేస్తోంది, ఎప్పుడంటే?

ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయనున్నారు. ఈ ఏడాదిలో కూడా 1500 సీట్లను భర్తీ చేయనున్నారు.

బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాల జాబితాను ఆగస్టు 22న ప్రకటించనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయనున్నారు. ఈ ఏడాదిలో కూడా 1500 సీట్లను భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రత్యేక కేటగిరి కింద 96 సీట్లు పోగా.. మిగిలిన 1404 సీట్లలో 702 సీట్లు వివిధ రిజర్వేషన్లకు కేటాయిస్తారు. జనరల్‌కు మిగిలిన 702లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 140 సీట్లు కేటాయిస్తారు. దీంతోపాటు 30 ఎన్‌ఆర్‌ఐ సీట్లు, 75 గ్లోబల్ సీట్లు అందుబాటులో ఉంటాయి.


Also Read: ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!


నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక జాబితా ప్రకటనలో జాప్యం కొనసాగుతోంది. ఆగస్టు రెండో వారంలో నోటిఫికేషన్‌ ఇస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. దరఖాస్తులు ఎక్కువగా రావడంతో పాటు ఈడబ్ల్యూఎస్​ కోటాపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో తర్జనభర్జన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రవేశాలకు సంబంధించి తాజా సమాచారం వెలువడింది.


ఈ ఏడాది ఈడబ్ల్యూఎస్ కోటాలో 10 శాతం సీట్లు కేటాయించాల్సి రావడంతో... న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. గతేడాది ఆగస్టు మొదటి వారంలోనే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈసారి ఇప్పటివరకు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.


Also Read: తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలు ఇవే!


తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాసర ఆర్జీయూకేటీలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్‌ 30న నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. గతేడాది (2021-22) తెలంగాణ పాలిసెట్‌-2021లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు నిర్వహించారు. అయితే ఈసారీ పాలిసెట్‌ ద్వారానే ప్రవేశాలు కల్పించాలని నోటిఫికేషన్‌ను మొదట్లో విడుదల చేసినప్పటికీ.. అలా చేస్తే గ్రామీణ విద్యార్థులకు నష్టం కలుగుతుందని పలు వర్గాల నుంచి వినతులు రావడంతో ఉన్నత విద్యామండలి పునరాలోచన చేసి పాత పద్ధతిలోనే, పదో తరగతి పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది.


తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో మొదటి ప్రయత్నంలోనే పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌‌లో ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుముగా రూ.400 (ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు రూ.350)లు చెల్లించవల్సి ఉంటుంది.

 

Virchow Scholarship Program: బాలికల విద్యకు ప్రోత్సాహం - విర్చో స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిభ కలిగిన, ఆర్థికంగా వెనుకబడిన బాలికల చదువు కోసం విర్చో స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2022 ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ స్కాలర్‌షిప్ కోసం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన బాలికలు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి లేదా ఇంటర్ లేదా ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నవారు, ప్రభుత్వ కళాశాలల్లో డిప్లొమా, డిగ్రీ చదువుతున్న బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల్లోపు ఉండాలి. 
పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

 

టాప్ హెడ్ లైన్స్

NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Adilabad News: తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive
తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive
UK Student Visa Rules: ఇకపై యూకేలో చదువులు మరింత ప్రియం.. విద్యార్థి వీసా నిబంధనల్లో కీలక మార్పులు!
ఇకపై యూకేలో చదువులు మరింత ప్రియం.. విద్యార్థి వీసా నిబంధనల్లో కీలక మార్పులు!
NEET PG Exam 2026: మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది
మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget