అన్వేషించండి

రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్‌ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా

బాపట్ల జిల్లా రేపల్లెలోని శ్రీ అనగాని భగవంతరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ ఏ+ గుర్తింపు లభించింది. ఈ మేరకు న్యాక్ అధికారులు ఆ కళాశాల ప్రిన్సిపల్ రవిచంద్రకు సమాచారమిచ్చింది.

బాపట్ల జిల్లా రేపల్లెలోని శ్రీ అనగాని భగవంతరావు(ఏబీఆర్) ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ ఏ+ గుర్తింపు లభించింది. ఈ మేరకు నేషనల్ అసెస్‌మెంట్, అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్) ఆ కళాశాల ప్రిన్సిపల్ రవిచంద్రకు సమాచారమిచ్చింది. బోధన, అభ్యసన, విశ్లేషణ, పరిశోధన, సృజనాత్మకత, మౌలిక సదుపాయాలు లాంటి వాటిని మదింపు చేసిన తర్వాత న్యాక్ గ్రేడ్లు ఇస్తుంది. 3.26-3.50 పాయింట్లు వస్తే ఏ+ గ్రేడ్ ఇస్తారు. 2015లో ఈ కళాశాలకు 'బీ' గ్రేడ్ ఉండగా.. ఇప్పుడు 3.28 పాయింట్లతో ఏ+ గుర్తింపు పొందింది.

ఎంతో పురాతనమైన ఈ కళాశాలలో 697 మంది విద్యార్థులు చదువుతుండగా.. 20 మంది అధ్యాపకులు పని చేస్తున్నారు. రాష్ట్రంలోని 165 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఇప్పటి వరకు రాజమహేంద్రవరం, విశాఖపట్నం మహిళా డిగ్రీ కళాశాలలకు న్యాక్ ఏ+ గుర్తింపు ఉండగా.. తాజాగా ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఆ గ్రేడ్ లభించింది. దీంతో రూసా వంటి వాటి నుంచి కళాశాలకు నిధులు వచ్చే అవకాశముంది. ఈ కళాశాలలో ఇండోర్ గేమ్స్, వర్మీ కంపోస్టు యూనిట్, వర్చువల్, ఈ-తరగతి గదులు, బొటానికల్ గార్డెన్, కంప్యూటర్ ల్యాబ్, భౌతిక శాస్త్రం, బయోలజీ ల్యాబ్ తదితర సదుపాయాలతో పాటు మహిళా సాధికారత, కెరీర్ మార్గదర్శకం కోసం ప్రత్యేకంగా సెల్‌లు ఏర్పాటు చేశారు.

ప్రపంచ ర్యాంకింగ్‌లో ముందు వరసలో అనంత జేఎన్‌టీయూ..
ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్‌లో అనంతపురం జేఎన్‌టీయూ ముందు వరుసలో నిలిచింది. లండన్‌కు చెందిన టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అనే అంతర్జాతీయ సంస్థ 2024 సంవత్సరానికిగాను సెప్టెంబర్‌ 27న ర్యాంకులను వెల్లడించింది. రాష్ట్రానికి చెందిన 7 విశ్వవిద్యాలయాలు టాప్‌ 1000లో ఉండగా.. అందులో జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నోలాజికల్‌ యూనివర్సిటీ అనంతపురం 34వ స్థానంలో నిలిచి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ప్రథమ స్థానం కైవసం చేసుకొంది. 

బోధన, పరిశోధనలే ప్రామాణికం..
విశ్వవిద్యాలయంలో బోధన, పరిశోధన, అనులేఖనం, అంతర్జాతీయ దృక్పథం, పరిశ్రమ ఆధారిత కోర్సులను ప్రామాణికంగా తీసుకొని ఈ ర్యాంకులు కేటాయించారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంఖ్య, బోధన, బోధనేతర ఉద్యోగులు వారిలో స్త్రీ, పురుష నిష్పత్తిని సైతం పరిగణించారు. విద్యార్థుల సంఖ్య 6,175 కాగా, స్త్రీ, పురుష నిష్పత్తి 41:59 ఉన్నట్లు పేర్కొన్నారు.

ALSO READ:

ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుకు అక్టోబరు 13 వరకు అవకాశం
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థుల కోసం నిర్దేశించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) దరఖాస్తుకు అక్టోబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. డిసెంబరు 10న జరిగే పరీక్షకు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అర్హులని, రెసిడెన్షియల్‌ విధానంలో చదువుతున్న వారికి అర్హత లేదని తెలిపారు. ఈసారి తొలిసారిగా ఎస్టీ రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచుతున్నామని వెల్లడించారు. దానివల్ల స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యే ఎస్టీ అభ్యర్థుల సంఖ్య పెరుగుతుందన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలుగు యూనివర్సిటీ కోర్సుల్లో స్పాట్ ప్రవేశాలు
హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023-24 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం 'స్పాట్ అడ్మిషన్స్' నిర్వహిస్తోంది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. లలితకళా రంగంలో ఎంపీఏ (కూచిపూడి, జానపదం, రంగస్థలం, సంగీతం), సామాజిక తదితర శాస్త్రాల విభాగంలో జ్యోతిషం, ఎంఏ (లింగ్విస్టిక్స్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నవంబరు 25లోగా ఆయా వర్సిటీ ప్రాంగణాల్లో సంప్రదించి ప్రవేశాలు పొందవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Embed widget