అన్వేషించండి

AP 10th Supplementary Exams: ఏపీ టెన్త్ ఫెయిల్ విద్యార్థులకు సర్కార్ ఊరట, ఫీజు చెల్లించకుండానే సప్లిమెంటరీ హాల్ టికెట్స్

AP SS Supplementary Exam Date 2022: ఏపీలో టెన్త్ ఫెయిన్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఫీజు కట్టకున్నా హాల్ టికెట్స్ జారీ చేయనున్నారు.

ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మొదలుకావడం నుంచి రిజల్ట్స్ త‌రువాత సైతం ప‌రిస్దితులు రోజురోజుకు మారిపోతున్నాయి. ఏపీ టెన్త్ ఫలితాల్లో కేవలం 67 శాతం విద్యార్థులు పాసయ్యారు. అయితే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాత్రం ఎలాంటి సప్లిమెంటరీ పరీక్షలు లేకుండానే పాస్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజులు కట్టించుకోకుండా సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను అనుమతించాలని కోరిన నేప‌థ్యంలో టెన్త్ ఫెయిన్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఫీజు కట్టకున్నా హాల్ టికెట్స్ జారీ చేయనున్నారు.

ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల నుండి ఫీజు వసూలు చేసినప్పటికీ ప్రభుత్వానికి కట్టనవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి .వి.నారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ‌నివాస‌రావు వెల్ల‌డించారు. సప్లిమెంటరీ పరీక్షలకు చెల్లించాల్సిన ఫీజులపై విద్యార్థులు ఆందోళన చెందనవసరం లేదని వెల్ల‌డించారు. ప్రస్తుతానికి విద్యార్థుల వద్ద నుంచి వసూలు చేసిన ఫీజును ప్ర‌ధానోపాధ్యాయుల వ‌ద్ద‌నే ఉంచుకోవాలని వారికి సూచించారు. ప్ర‌భుత్వం స‌ప్ల‌మెంట‌రీ ప‌రీక్ష ఫీజును 500, రీవెరిఫికేష‌న్ కు వెయ్యి రూపాయ‌లుగా నిర్ణ‌యించింది. జూలై 6 నుంచి జూలై 15 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స ఫలితాలు వచ్చిన రోజు తెలిపారు. 

రెండేళ్ల తరువాత బోర్డ్ ఎగ్జామ్స్.. ఎన్నో పరీక్షలు
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రెండేళ్ల పాటు పరీక్షలు లేకుండానే విద్యార్థులను ఏపీ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పాస్ చేస్తూ వస్తోంది. గత విద్యా సంవత్సరంలో కరోనా నుంచి కోలుకోవడంతో తరగతులు కొన్ని నెలలు నిర్వహించారు. విద్యార్థులకు సిలబస్ తగ్గింపు, పేపర్లు తగ్గింపు లాంటి ఊరట కలిగించే ఎన్నో నిర్ణయాలను ఏపీ విద్యాశాఖ తీసుకుంది. రెండేళ్ల అనంతరం గతంలో నిర్వహించినట్లు ఏపీ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించారు. కానీ ఈ సారి ఎన్నో రాజకీయ పరిణామాల మధ్య పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. ఉత్తీర్ణత శాతం చాలా తగ్గడంతో ప్రతిపక్షాలు ఏపీ ప్రభుత్వాన్ని లక్ష్యాన్ని చేసుకుని విమర్శలు గుప్పించాయి. అయితే విద్యార్థులు సొంతంగా పాస్ కావాలని, ప్రభుత్వం నేరుగా పాస్ చేస్తే వారి జీవితాలను నాశనం చేయడం అవుతుందని భావించారు. మార్కులు కలపడం ఉండదని, సప్లిమెంటరీ రాసి పాస్ కావాలని విద్యార్థులకు సీఎం జగన్ సైతం సూచించారు.

మూడు, నాలుగు మార్కుల వరకు తక్కువ రావడంతో ఫెయిలైన టెన్త్ విద్యార్థులను పాస్ చేయాలని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కొందరు డిమాండ్ చేశారు. మరికొందరైతే ఏకంగా 10 శాతం గ్రేస్ మార్కులు కలిపి పాస్ చేయాలని ప్రభుత్వానికి సూచించగా.. కొందరు నేతలు ప్రతి టెన్త్ క్లాస్ విద్యార్థిని పాస్ చేసి వారికి న్యాయం చేయాలన్నారు. అందుకు కరోనాను కారణంగా చూపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయానికి కట్టుబడి ఉందని, విద్యార్థులు సప్లిమెంటరీ రాసి పాస్ కావడం వారి జీవితాలకు మేలు చేస్తుందన్నారు. అయితే ఈ ఏడాది సప్లి రాసి పాసైన వారిని రెగ్యూలర్ విద్యార్థుల తరహాలో డైరెక్ట్ పాస్ అయినట్లు మెమోలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఫీజుల కోసమే పరీక్షలని విమర్శలు రావడంతో విద్యార్థుల వద్ద నుంచి ప్రస్తుతానికి ఎలాంటి ఫీజు వసూలు చేయవద్దని, అందరికీ హాల్ టికెట్లు జారీ చేయాలని ఏపీ ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ‌నివాస‌రావు వెల్ల‌డించారు.

Also Read: AP 10th Supplementary Exams: ఏపీ టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ఊరట, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం 

Also Read: AP SSC Supplementary Exam 2022: జూలైలో ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు, తేదీలు ప్రకటించిన మంత్రి బొత్స

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP High Court on Temples: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: హైకోర్టు కీలక ఆదేశాలు
విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: హైకోర్టు కీలక ఆదేశాలు
PM Modi: దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Khanapur Municipal Chairman: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
Chandrababu Amaravati Review: అమరావతి ఇన్ ఫ్రా పనులు వేగంగా జరగాల్సిందే - అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి ఇన్ ఫ్రా పనులు వేగంగా జరగాల్సిందే - అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం

వీడియోలు

TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP High Court on Temples: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: హైకోర్టు కీలక ఆదేశాలు
విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: హైకోర్టు కీలక ఆదేశాలు
PM Modi: దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Khanapur Municipal Chairman: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
Chandrababu Amaravati Review: అమరావతి ఇన్ ఫ్రా పనులు వేగంగా జరగాల్సిందే - అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి ఇన్ ఫ్రా పనులు వేగంగా జరగాల్సిందే - అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం
Basra Development: బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
IPL 2026లో కొందరు స్టార్ ప్లేయర్లు ఎందుకు ఆడటం లేదు, ఫ్యాన్స్ మాత్రం వెయిటింగ్
IPL 2026లో కొందరు స్టార్ ప్లేయర్లు ఎందుకు ఆడటం లేదు, ఫ్యాన్స్ వెయిటింగ్
Tiger In Polavaram: వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
Tyson Naidu OTT : టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
Embed widget