అన్వేషించండి

AP SSC Supplementary Exam 2022: జూలైలో ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు, తేదీలు ప్రకటించిన మంత్రి బొత్స

AP SSC Supplementary Exam 2022: ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా జూలై 6వ తేదీన ఏపీలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

AP SSC Results 2022 : ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలను నేటి మధ్యాహ్నం (జూన్ 6)న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. విజయవాడ ఎమ్‌జీ రోడ్డు వద్ద నున్న గేట్‌వే హోటల్‌ లో ఫలితాలు విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది సైతం బాలురి కంటే బాలికలదే పైచేయి. ఫలితాలను కేవలం మార్కుల రూపంలో విడుదల చేశారు. మొత్తం 4.14 లక్షల మంది విద్యార్తులు టెన్త్ క్లాస్ పాసయ్యారు. ఫలితాలు విడుదల చేసిన తరువాత సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించారు. వచ్చేనెల జూలై 6వ తేదీన ఏపీలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూలై 15 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి బొత్స తెలిపారు. త్వరలోనే సప్లిమెంటరీ పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు.

ఆ స్కూల్స్‌లో ఒక్కరూ పాస్ కాలేదు..
రాష్ట్రంలో 11,671 స్కూళ్ల విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయగా 71 స్కూళ్లలో ఒక్కరూ కూడా పాస్ కాలేదు. అయితే 797 స్కూళ్లు మాత్రం 100కు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. కరోనా కారణంగా విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రభావం చూపిందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. జూన్ 7వ తేదీ నుంచి ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజులు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. ఈ మేరకు జూన్ 13 నుంచి ప్రత్యేక శిక్షణా తరగతుల నిర్వహణకు ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే సప్లిమెంటరీ విద్యార్థుల ఫలితాలు సైతం సాధ్యమైనంత త్వరగా విడుదల చేసి, రెగ్యూలర్ విద్యార్థులతో ఇంటర్ లో చేరేలా చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స కీలక ప్రకటన చేశారు.

ఈ సారి బాలికలదే పైచేయి..

ఈ ఏడాది ఏపీ టెన్త్ క్లాస్ పరీక్షలు ఏప్రిల్ 27నుంచి మే 9వరకు జరిగాయి. రెండేళ్ల తరువాత రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు నిర్వహించగా.. దాదాపు 6,21,799 మంది విద్యార్థులు ఎగ్జామ్స్‌కు హాజరు కాగా, 4,14,281 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 2,11,460 మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు 2,02,821 మంది పాసయ్యారు.  టెన్త్ ఫలితాలలో సరాసరి 67.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రకాశం జిల్లాలో అత్యధిక శాతం 78.3 శాతం విద్యార్థులు మంది ఉత్తీర్ణులవగా, అనంతపురం 49.7 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. 64.02 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 70.70 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఏపీ టెన్త్ రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్ 

Also Read: AP SSC Results 2022: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స, Direct Linkతో రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Embed widget