అన్వేషించండి

NALSAR: నల్సార్‌ యూనివర్సిటీలో ఎంఏ&అడ్వాన్స్‌డ్ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు

నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దూరవిద్య విధానంలో 2023-2024 విద్యా సంవత్సరానికి ఎంఏ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దూరవిద్య విధానంలో 2023-2024 విద్యా సంవత్సరానికి ఎంఏ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రోగ్రామ్ వివరాలు..

ఎంఏ: ఏవియేషన్ లా అండ్‌ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ అండ్‌ డిఫెన్స్ లా, స్పేస్ అండ్‌ టెలికమ్యూనికేషన్ లా, మారిటైమ్ లా, క్రిమినల్ లా & ఫోరెన్సిక్ సైన్స్, ఇంటర్నేషనల్ టాక్సెషన్, ఎనిమల్ ప్రొటెక్షన్ లా, కార్పొరేట్ లా.

వ్యవధి: 2-సంవత్సరాలు.

అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా: పేటెంట్ లా, సైబర్ లా, మీడియా లా, ఇంటర్నేషనల్‌ హ్యూమనిటేరియన్‌ లా, ఆల్టర్నేటివ్‌ డిస్‌ప్యూట్‌ రెజల్యూషన్‌, ఫ్యామిలీ డిస్‌ప్యూట్‌ రెజల్యూషన్‌, డ్రాఫ్టింగ్, నెగోషియేషన్ &ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్స్, కార్పొరేట్ టాక్సేషన్‌, లేబర్ లా&ఎంప్లాయ్ మేనేజ్‌మెంట్, ఏవియేషన్ లా అండ్‌ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, GIS & రిమోట్ సెన్సింగ్ లా, మారిటైమ్ లా, క్రిమినల్ లా & ఫోరెన్సిక్ సైన్స్, ఫైనాన్సియల్ సర్వీసెస్ & లేగిస్లేషన్స్, ఎనిమల్ ప్రొటెక్షన్ లా, సైబర్ సెక్యూరిటీ & డేటా ప్రొటెక్షన్ లా, కార్పొరేట్ లా.

వ్యవధి: సంవత్సరం.

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.08.2023.

Notification

Website

ALSO READ:

సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం, మాతృభాషలో విద్యాబోధన - పాఠశాలలకు అనుమతి!
మాతృభాషలో విద్యాబోధనను ప్రోత్సహించేందుకు సెకండరీ బోర్డ్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు స్థానిక భాషల్లో విద్యా బోధన అందించేందుకు పాఠశాలలకు అనుమతించింది. ఒకవైపు ఏపీ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం కేంద్రీయ విద్యాలయాల్లో, ఇతర సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో మాతృభాషల్లో విద్యాబోధనను ప్రోత్సహించాలని నిర్ణయించడం విశేషం. ఇందుకు అనుగుణంగా కొత్త పాఠ్యపుస్తకాలను 22 భారతీయ భాషల్లో కొత్త పాఠ్యపుస్తకాలు రూపొందించాలని ఎన్‌సీఈఆర్‌టీని కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు సీబీఎస్‌ఈ తన అనుబంధ పాఠశాలలకు సర్క్యులర్‌ జారీ చేసింది. ప్రస్తుతం సీబీఎస్‌ఈ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మాధ్యమంలో విద్యాబోధన చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో హిందీలో బోధిస్తున్నారు. సీబీఎస్‌ఈ తాజా నిర్ణయంతో పాఠశాలలు ఇకపై తమకు నచ్చిన భారతీయ భాషల్లో విద్యాబోధన చేసేందుకు వీలవుతుంది. సీబీఎస్‌ఈ పాఠశాలల్లో భిన్న భాషల్లో విద్యాభోధన అమలుచేసేందుకు అందుబాటులో ఉన్న వనరులను అన్వేషించాలని, నిపుణులతో సంప్రదింపులు జరుపాలని, ఇతర పాఠశాలలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని సీబీఎస్‌ఈ డైరెక్టర్‌ జోసెఫ్‌ ఇమ్మానుయేల్‌ పాఠశాలలకు సూచించారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

డా.వైఎస్సార్‌ హెల్త్‌ వర్సిటీ ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి విజయవాడలోని డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్ యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. నీట్‌(యూజీ)-2023 అర్హత సాధించిన అభ్యర్థులు జులై 26న సాయంత్రం 6 గంటల్లోగా సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో అర్హత సాధించిన అభ్యర్థుల తాత్కాలిక ప్రాధాన్య క్రమాన్ని విజయవాడలోని వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏపీ నుంచి 68,578 మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్ష రాయగా 42,836 మంది అర్హత సాధించారు. వీరంతా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.
నోటిఫికేషన్, కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి.

జులై 24 నుంచి ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
తెలంగాణలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ జులై 24 నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే మొదటి దశ కౌన్సెలింగ్‌ పూర్తికాగా, జులై 16న సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. మొద‌టి విడత కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థుల‌ు జులై 23లోగా సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం జులై 24 నుంచి రెండో విడత  కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది. విద్యార్థులు జులై 24, 25 తేదీల్లో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్‌ ఫీజును చెల్లించి, స్లాట్ బుకింగ్‌ చేసుకోవాలి. వీరికి జులై 26న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. జులై 24 నుంచి 27 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. జులై 27న సీట్లను ఫ్రీజ్‌ చేయనున్నారు. ఇక జులై 31న అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన వారు జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌రిపోర్ట్‌ చేయడంతో పాటు, ట్యూషన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
MMTS Rape Case : ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్Klassen's glove error Rickelton Not out | IPL 2025 MI vs SRH మ్యాచ్ లో అరుదైన రీతిలో రికెల్టన్ నాట్ అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
MMTS Rape Case : ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
New Toll Policy: మరో 15 రోజులే, ఆ తర్వాత ఒక్క టోల్ గేట్‌ కూడా కనిపించదు!
మరో 15 రోజులే, ఆ తర్వాత ఒక్క టోల్ గేట్‌ కూడా కనిపించదు!
TGEAPCET: తెలంగాణ ఎప్‌సెట్ హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్, ఎప్పటినుంచంటే? పరీక్షల తేదీలు ఇవే
తెలంగాణ ఎప్‌సెట్ హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్, ఎప్పటినుంచంటే? పరీక్షల తేదీలు ఇవే
Anurag Kashyap: బ్రాహ్మణులపై మూత్రం పోస్తా -కలకలం రేపుతున్న బాలీవుడ్ దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
బ్రాహ్మణులపై మూత్రం పోస్తా -కలకలం రేపుతున్న బాలీవుడ్ దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
Lokesh And Anvesh : బెట్టింగ్ యాప్‌లపై అన్వేష్‌కు లోకేష్ రిప్లై - యాంటీ బెట్టింగ్ పాలసీ తెస్తామని హామీ  !
బెట్టింగ్ యాప్‌లపై అన్వేష్‌కు లోకేష్ రిప్లై - యాంటీ బెట్టింగ్ పాలసీ తెస్తామని హామీ !
Embed widget