అన్వేషించండి

AAT Registration: ఆర్కిటెక్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?

AAT 2024 Exam: ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ పరీక్ష (ఏఏటీ)-2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 9, 10 తేదీల్లో కొనసాగనుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 12న ఏఏటీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

AAT 2024 Registration: దేశంలోని ఆర్కిటెక్చర్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ పరీక్ష (ఏఏటీ)-2024' రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 9న ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 9, 10 తేదీల్లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షను జూన్ 12న నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఏఏటీ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన ఫలితాలను జూన్ 14న విడుదల చేయనున్నారు. మరోవైపు జోసా కౌన్సెలింగ్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 10 నుంచి ప్రారంభంకానుంది. అయితే ఏఏటీ పరీక్ష ఫలితాల వెల్లడి తర్వాత అభ్యర్థులు జూన్ 14 నుంచి ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

JEE (Advanced) 2024 AAT Registration

జూన్ 10 నుంచి జోసా రిజిస్ట్రేషన్..
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) షెడ్యూలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను జూన్ 9న వెల్లడించిన నేపథ్యంలో.. జూన్ 10 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. విద్యార్థులు జూన్ 10 నుంచి రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పరీక్ష రాసినవారు, ఫలితాల వెల్లడి తర్వాత జూన్ 14 నుంచి ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సీట్ల కేటాయింపునకు సంబంధించి జూన్ 19 వరకు అభ్యర్థులకు మాక్‌ కౌన్సెలింగ్‌ అందుబాటులో ఉంటుంది. దానివల్ల తమ ర్యాంకు ఆధారంగా ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. జూన్ 20 నుంచి అసలు ప్రక్రియ ప్రారంభంకానుంది. మొత్తం 5 రౌండ్ల కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. 

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలు జూన్ 9 వెలువడిన సంగతి తెలిసిందే. ఫలితాలకు సంబంధించి.. పరీక్షకు మొత్తం 1,80,200 మంది విద్యార్థులు హాజరుకాగా.. 48,248 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కేవలం 27 శాతం అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. పరీక్షలో అర్హత సాధించినవారిలో 40,284 మంది బాలురు ఉండగా.. 7,964 మంది బాలికలు ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు మొత్తం 1,43,637 మంది బాలురు దరఖాస్తు చేసుకోగా.. 1,39,180 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసినవారిలో 40,284 అర్హత సాధించారు. ఇక పరీక్షకు 42,947 మంది బాలికలు దరఖాస్తు చేసుకోగా..41,020 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 7,964 మంది మాత్రమే అర్హత సాధించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్-10 జాబితాల్లో ఐఐటీ మద్రాస్ జోన్ నుంచి ఏకంగా నలుగురు విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. వీరంతా తెలుగు విద్యార్థులే కావడం విశేషం. ఇక ఐఐటీ బాంబే జోన్ విద్యార్థులు ముగ్గురు, ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు ఇద్దరు, ఐఐటీ రూర్కీ జోన్ పరిధిలో ఒక్కరు స్థానం సంపాదించారు. 

బాలుర కేటగిరీలో ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటీ టాపర్‌గా నిలిచాడు. మొత్తం 360 మార్కులకు 355 మార్కులతో కామన్ ర్యాంకింగ్ లిస్టులో మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఆదిత్య (346), భోగల్‌పల్లి సందేశ్‌ (338), రిథమ్‌ కేడియా (337), పుట్టి కుషాల్‌ కుమార్‌ (334) టాప్-5లో నిలిచారు. బాలికల విభాగంలో ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ద్విజా ధర్మేశ్ కుమార్ పటేల్ మొత్తం 360 మార్కులకు 332 మార్కులతో బాలికల విభాగంలో మొదటి స్థానంలో నిలవగా, కామన్ ర్యాంకింగ్ లిస్టులో 7వ స్థానంలో నిలిచింది. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసంక్లిక్ చేయండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
Nita Ambani: కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హ్యుమానిటేరియన్ అవార్డు 2025 గ్రహీత నీతా అంబానీ- గిరిజన విద్యార్థులకు స్ఫూర్తిదాయక పిలుపు
కిస్ హ్యుమానిటేరియన్ అవార్డు 2025 గ్రహీత నీతా అంబానీ- గిరిజన విద్యార్థులకు స్ఫూర్తిదాయక పిలుపు
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Assembly Elections 2026:విజయ్ మెడకు కరూర్ తొక్కిసలాట కేసు - జననాయగన్ షూటింగ్ వల్లే 41 మంది ప్రాణాలు పోయాయా?
విజయ్ మెడకు కరూర్ తొక్కిసలాట కేసు - జననాయగన్ షూటింగ్ వల్లే 41 మంది ప్రాణాలు పోయాయా?
Telangana Gaddar Awards 2026 : తెలంగాణ గద్దర్ అవార్డ్స్ 2026 - విజేతలకు పురస్కారాలు
తెలంగాణ గద్దర్ అవార్డ్స్ 2026 - విజేతలకు పురస్కారాలు
Israel-Iran War: దేశంలోని చమురు, గ్యాస్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు! మధ్యప్రాచ్య సంక్షోభం వేళ ముందస్తు చర్యలు!
దేశంలోని చమురు, గ్యాస్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు! మధ్యప్రాచ్య సంక్షోభం వేళ ముందస్తు చర్యలు!
Amazon Prime Series : అమెజాన్ ప్రైమ్ వీడియో మెగా లైనప్ - 55కి పైగా కొత్త సిరీస్‌లు... మీర్జాపూర్ నుంచి గూఢచారి 2 వరకూ కంప్లీట్ లిస్ట్
అమెజాన్ ప్రైమ్ వీడియో మెగా లైనప్ - 55కి పైగా కొత్త సిరీస్‌లు... మీర్జాపూర్ నుంచి గూఢచారి 2 వరకూ కంప్లీట్ లిస్ట్
Kalvakuntla Kavitha: డాడీ, మోడీ, చిన్న మోడీపై పోరాటం - తన రాజకీయాన్ని తేల్చేసిన కవిత
డాడీ, మోడీ, చిన్న మోడీపై పోరాటం - తన రాజకీయాన్ని తేల్చేసిన కవిత
Iran War Updates: సహనం నశించింది - ఇరాన్‌కు అరబ్ దేశాల హెచ్చరిక - రంజాన్ ముగియగానే విరుచుకుపడతారా?
సహనం నశించింది - ఇరాన్‌కు అరబ్ దేశాల హెచ్చరిక - రంజాన్ ముగియగానే విరుచుకుపడతారా?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గొప్ప మనసు - త్వరలోనే మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం
మెగాస్టార్ చిరంజీవి గొప్ప మనసు - త్వరలోనే మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం
Viral News: ఇన్‌స్టాగ్రామ్ చూసి ప్రమాదకరమైన ఆయుధాలు తయారు చేసిన పిల్లలు! చెప్పుతో పొట్టుపొట్టున కొట్టిన తండ్రి; వీడియో వైరల్!
ఇన్‌స్టాగ్రామ్ చూసి ప్రమాదకరమైన ఆయుధాలు తయారు చేసిన పిల్లలు! చెప్పుతో పొట్టుపొట్టున కొట్టిన తండ్రి; వీడియో వైరల్!
Embed widget