అన్వేషించండి

AAT Registration: ఆర్కిటెక్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?

AAT 2024 Exam: ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ పరీక్ష (ఏఏటీ)-2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 9, 10 తేదీల్లో కొనసాగనుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 12న ఏఏటీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

AAT 2024 Registration: దేశంలోని ఆర్కిటెక్చర్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ పరీక్ష (ఏఏటీ)-2024' రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 9న ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 9, 10 తేదీల్లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షను జూన్ 12న నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఏఏటీ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన ఫలితాలను జూన్ 14న విడుదల చేయనున్నారు. మరోవైపు జోసా కౌన్సెలింగ్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 10 నుంచి ప్రారంభంకానుంది. అయితే ఏఏటీ పరీక్ష ఫలితాల వెల్లడి తర్వాత అభ్యర్థులు జూన్ 14 నుంచి ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

JEE (Advanced) 2024 AAT Registration

జూన్ 10 నుంచి జోసా రిజిస్ట్రేషన్..
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) షెడ్యూలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను జూన్ 9న వెల్లడించిన నేపథ్యంలో.. జూన్ 10 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. విద్యార్థులు జూన్ 10 నుంచి రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పరీక్ష రాసినవారు, ఫలితాల వెల్లడి తర్వాత జూన్ 14 నుంచి ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సీట్ల కేటాయింపునకు సంబంధించి జూన్ 19 వరకు అభ్యర్థులకు మాక్‌ కౌన్సెలింగ్‌ అందుబాటులో ఉంటుంది. దానివల్ల తమ ర్యాంకు ఆధారంగా ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. జూన్ 20 నుంచి అసలు ప్రక్రియ ప్రారంభంకానుంది. మొత్తం 5 రౌండ్ల కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. 

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలు జూన్ 9 వెలువడిన సంగతి తెలిసిందే. ఫలితాలకు సంబంధించి.. పరీక్షకు మొత్తం 1,80,200 మంది విద్యార్థులు హాజరుకాగా.. 48,248 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కేవలం 27 శాతం అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. పరీక్షలో అర్హత సాధించినవారిలో 40,284 మంది బాలురు ఉండగా.. 7,964 మంది బాలికలు ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు మొత్తం 1,43,637 మంది బాలురు దరఖాస్తు చేసుకోగా.. 1,39,180 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసినవారిలో 40,284 అర్హత సాధించారు. ఇక పరీక్షకు 42,947 మంది బాలికలు దరఖాస్తు చేసుకోగా..41,020 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 7,964 మంది మాత్రమే అర్హత సాధించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్-10 జాబితాల్లో ఐఐటీ మద్రాస్ జోన్ నుంచి ఏకంగా నలుగురు విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. వీరంతా తెలుగు విద్యార్థులే కావడం విశేషం. ఇక ఐఐటీ బాంబే జోన్ విద్యార్థులు ముగ్గురు, ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు ఇద్దరు, ఐఐటీ రూర్కీ జోన్ పరిధిలో ఒక్కరు స్థానం సంపాదించారు. 

బాలుర కేటగిరీలో ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటీ టాపర్‌గా నిలిచాడు. మొత్తం 360 మార్కులకు 355 మార్కులతో కామన్ ర్యాంకింగ్ లిస్టులో మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఆదిత్య (346), భోగల్‌పల్లి సందేశ్‌ (338), రిథమ్‌ కేడియా (337), పుట్టి కుషాల్‌ కుమార్‌ (334) టాప్-5లో నిలిచారు. బాలికల విభాగంలో ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ద్విజా ధర్మేశ్ కుమార్ పటేల్ మొత్తం 360 మార్కులకు 332 మార్కులతో బాలికల విభాగంలో మొదటి స్థానంలో నిలవగా, కామన్ ర్యాంకింగ్ లిస్టులో 7వ స్థానంలో నిలిచింది. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసంక్లిక్ చేయండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Bhimavaram DSP Jayasurya transfer: పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?

వీడియోలు

Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Bhimavaram DSP Jayasurya transfer: పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Bangladesh Bengali Language: ముస్లింలే కానీ బంగ్లాదేశ్‌లో ఎవరికీ ఉర్దూ రాదు- వారి భాష బెంగాలీనే - దేశం ఏర్పాటుకూ కారణం అదే !
ముస్లింలే కానీ బంగ్లాదేశ్‌లో ఎవరికీ ఉర్దూ రాదు- వారి భాష బెంగాలీనే - దేశం ఏర్పాటుకూ కారణం అదే !
Embed widget