అన్వేషించండి

JEE Advanced 2021 Exam: నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష.. ఈ నిబంధనలు మర్చిపోకండి..

JEE Advanced Exam Today: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ మొదటి పేపర్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు.. రెండో పేపర్  మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. ప్రతి పేపర్‌కు 3 గంటల సమయం కేటాయించారు.

దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఈరోజు (అక్టోబర్ 3) ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైంది. రెండు షిఫ్టులలో (పేపర్ I, పేపర్ II) పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఫొటో ఐడెంటిటీ కార్డును పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ప్రతి పేపర్‌కు 3 గంటల సమయం కేటాయించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఐఐటీ ఖరగ్‌పూర్‌ (IITK) నిర్వహిస్తోంది. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ ఆధారంగా రెండున్నర లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు వీలు కల్పించింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించింది. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్‌ వెల్లడించింది. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. అభ్యర్థుల హాల్ టికెట్లపై కోవిడ్ 19 ప్రోటోకాల్స్ వివరాలను అందించామని చెప్పింది. 

Also Read: విద్యార్థులకు అలర్ట్.. నీట్ యూజీలో సవరణలకు అవకాశం.. ఇవి చేయకపోతే ఫలితాలు కూడా రావు

మొదటి పేపర్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు.. రెండో పేపర్  మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష కోసం తెలంగాణ నుంచి దాదాపు 14 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 15 పట్టణాల్లో ఈ పరీక్ష జరగనుంది. అక్టోబర్ 10న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. అక్టోబర్ 15వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్‌  ఫలితాలు విడుదల కానున్నాయి. 

ఇవి తప్పనిసరిగా గుర్తుంచుకోండి.. 
విద్యార్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో అందించిన మొబైల్ నంబరుకు ఎగ్జామ్ సెంటర్, రిపోర్టింగ్ సమయం వివరాలు SMS రూపంలో పంపుతారు. దీనికి అనుగుణంగా నిర్దేశించిన సమయంలో విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ వద్ద రిపోర్ట్ చేయాలి. పరీక్ష సమయం కంటే ఒక గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం. అడ్మిట్ కార్డుపై ఉన్న కోవిడ్ 19 సెల్ఫ్ డిక్లరేషన్ వివరాలను నింపాలి. పరీక్షకు హాజరయ్యే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. హ్యాండ్ శానిటైజర్, వాటర్ బాటిల్ (transparent) తీసుకువెళ్లాలి. సామాజిక దూరాన్ని పాటించండి.

Also Read: ఏపీ గ్రూప్ -1 అభ్యర్ధులకు గుడ్ న్యూస్.. మెయిన్ పేపర్లు మాన్యువల్ పద్దతిలో దిద్ది ఫలితాలు ప్రకటించాలన్న హైకోర్టు !

Also Read: పీజీ చదివే వారి కోసం యూజీసీ స్కాలర్‌షిప్‌‌లు.. నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోండి..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Sasivadane OTT : మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
Embed widget