అన్వేషించండి

Jagananna's Foreign Education: పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన, తొలివిడతగా రూ.19.95కోట్లు విడుదల

జగనన్న విదేశీ విద్యా దీవెన రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయన్నారు ముఖ్యమంత్రి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల పేద విద్యార్థులకు వరల్డ్‌ టాప్‌ వర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించామని తెలిపారు.

'జగనన్న విదేశీ విద్యా దీవెన' పథకానికి సంబంధించి నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద విద్యార్థులు విదేశీ విద్య అభ్యసించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులు ఈ స్కీం ద్వారా లబ్ధి పొందుతున్నారు. 

ఈ పథకంలో లబ్ధి పొందిన పేద విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా టాప్‌ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యనభ్యసించే వీలు కల్పిస్తుంది ప్రభుత్వం. వారి చదువుకు కావాల్సిన డబ్బును 'జగనన్న విదేశీ విద్యా దీవెన' ద్వారా సమకూరుస్తుంది. దీనికి సంబంధించిన నిధులనే  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ బటనొక్కి ప్రారంభించారు.

'జగనన్న విదేశీ విద్యా దీవెన' పథకం కింద ఈ సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో టాప్‌-200 వర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వాళ్ల చదువుల కోసం మొదటి విడతలో సాయంగా రూ. 19.95 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బటన్‌ నొక్కి వారి వారి ఖాతాల్లో జమ చేశారు. 

200ల వర్సిటీల్లో ఆడ్మిషన్లు పొందిన 213మంది విద్యార్థులకు ఆర్థికసాయం

జగనన్న విదేశీ విద్యా దీవెన ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా అభివర్ణించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల పేద విద్యార్థులకు ప్రపంచంలోనే టాప్‌ యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించామని తెలిపారు. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి ఒక్క చదువేనని అభిప్రాయపడ్డారు. అలాంటి చదువుకు పేదరికం అడ్డుకాకూడదన్నారు జగన్. అలాంటి పేదలు 213 మంది విద్యార్థులు విదేశీ యూనివర్శిటీల్లో అ‍డ్మిషన్లు పొందారని వాళ్లకు సమస్య రాకూడదని వీరందరికి తొలివిడతగా రూ.19.95 కోట్ల సాయం అందిస్తున్నామన్నారు. తమ చదువు ద్వారా ప్రపంచ వేదికపై దేశం, ఆంధ్రప్రదేశ్ జెండా ఎగురవేయాలని లబ్ధిదారులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించారు. రాష్ట్రానికి చెందిన ఈ పిల్లలు ప్రపంచ స్థాయిలో రాణించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆకాక్షించారు. 

విద్యతో రాష్ట్రంలోని అందరి తలరాతలు మారుతుంది: సీఎం జగన్

పేద విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని..విద్య మీద పెట్టే ప్రతి పెట్టుబడి కూడా మానవ వనరుల మీద పెట్టినట్టేనని సీఎం జగన్ తెలిపారు. చదువు కుటుంబాల తలరాతలే కాదు.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి తలరాతలు కూడా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, అంబేద్కర్‌ వంటి వాళ్లు పెద్ద యూనివర్శిటీల నుంచి వచ్చినవారేనని గుర్తు చేశారు. అందుకే పేద పిల్లలు చదువుకునేలా అడుగులు వేయిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. 

గత ప్రభుత్వ హయాంలో కేవలం రూ. 10లక్షలు మాత్రమే ఇచ్చేవారని.. 2016-17లో రూ.300 కోట్లు బకాయిలు పెట్టారని సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్లు, మిగిలిన విద్యార్థులకు గరిష్టంగా రూ.కోటి వరకు సాయం అందిస్తున్నామని తెలిపారు. ట్యూషన్‌ ఫీజు వందశాతం రీయింబర్స్‌మెంట్స్‌ ఇస్తున్నామన్నారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే సీఎంఓలో అధికారులు అందుబాటులో ఉంటారని,  ప్రతీ విషయంలో మీకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Desam Smart Ed Conclave 2026 : ఏబీపీ దేశం స్మార్ట్ ఎడ్ కాన్‌‌క్లేవ్​లో జాహ్నవి దాంగేటి స్పేస్ టాక్.. పాలకొల్లు నుంచి అంతరిక్షం వరకు
ఏబీపీ దేశం స్మార్ట్ ఎడ్ కాన్‌‌క్లేవ్​లో జాహ్నవి దాంగేటి స్పేస్ టాక్.. పాలకొల్లు నుంచి అంతరిక్షం వరకు
International Women Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మీ హక్కులేంటో తెలుసుకోండి; ప్రతి స్త్రీకి ఇవి చాలా అవసరం!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మీ హక్కులేంటో తెలుసుకోండి; ప్రతి స్త్రీకి ఇవి చాలా అవసరం!
UPSC Civil Services Result: యూపీఎస్సీ సివిల్స్ టాపర్‌గా అనూజ్ అగ్నిహోత్రి.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
UPSC సివిల్స్ టాపర్‌గా అనూజ్ అగ్నిహోత్రి.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
T20 World Cup Winner: అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
Trisha Krishnan : అది వారి సంస్కారం - మైక్ ఉంటే ఏదైనా మాట్లాడేస్తారా?... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
అది వారి సంస్కారం - మైక్ ఉంటే ఏదైనా మాట్లాడేస్తారా?... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Alcohol Banned Countries : ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
Embed widget