అన్వేషించండి

JEE Advanced 2022 Registration: జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే ఆగస్టు 8న దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. జేఈఈ మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాలి.

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే ఆగస్టు 8న దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. జేఈఈ మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం ఆగస్టు 8 నుంచి 11 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

షెడ్యూలు ప్రకారం ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు మూడు గంటల సమయం కేటాయించారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్- 2022 కోసం ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రారంభ దశలో విదేశీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే అనుమతించారు. ఇక భారతీయ విద్యార్థుల కోసం జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల తర్వాత అప్లికేషన్ కమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు.

Also Read: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల - రిజల్ట్, ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

అర్హతలు ఇవే..

✪ జేఈఈ మెయిన్స్ పేపర్-1 పరీక్షలో అర్హత సాధించిన అన్ని విభాగాల అభ్యర్థుల నుంచి 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు ఎంపికచేస్తారు.

✪ జేఈఈ అడ్వాన్స్‌డ్ -2022 పరీక్షకు 01.10.1997 తర్వాత జన్మించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది. వీరు 01.10.1992 తర్వాత జన్మించినవారై ఉండాలి.

✪ అభ్యర్థులకు వరుసగా కేవలం రెండు పర్యాయాలు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అవకాశం ఉంటుంది.

✪ జేఈఈ అడ్వాన్స్‌డ్ -2022 పరీక్షలకు 2022 లేదా 2021 సంవత్సరాల్లో ఇంటర్ పాసై.. జేఈఈ మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

✪ అయితే 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఫలితాలను 2020, అక్టోబరు 15 తర్వాత ప్రకటించినట్లయితే.. 2020లో ఇంటర్ ఉత్తీర్ణులైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: TS EAMCET Results: టీఎస్‌ ఎంసెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, రిజల్ట్స్ ఎప్పుడంటే?

దరఖాస్తు ఫీజు వివరాలు..

✪ మహిళా అభ్యర్థులు (ఇండియా): రూ.1400.

✪ మిగతా అభ్యర్థులందరికీ: రూ.2800. 

✪ ఇండియాలో ఇంటర్ చదివిన  విదేశీ విద్యార్థులకు (సార్క్ దేశాలు): రూ.6000.

✪ ఇండియాలో ఇంటర్ చదివిన విదేశీ విద్యార్థులకు (సార్క్ దేశాలు): రూ.6,000.

✪ ఇతర దేశాల్లో ఇంటర్ చదివిన విదేశీ విద్యార్థులకు (నాన్ - సార్క్ దేశాలు): రూ.12,000.

ముఖ్యమైన తేదీలు..

✪ జేఈఈ అడ్వా్న్స్డ్ రిజిస్ట్రేషన్: 08.08.2022 - 11.08.2022.

✪ ఫీజు చెల్లించడానికి చివరితేది: 12.08.2022.

✪ అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడ్: 23.08.2022 - 28.08.2022.

✪ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్ష తేది: 28.08.2022.

పరీక్ష సమయం: 

పేపర్-1: ఉ. 9.00 గం. - మ.12:00 గం. వరకు.

పేపర్-2: మ.14:30 - సా.17:30 గం. వరకు.

✪ ప్రాథమిక కీ: 03.09.2022.

✪ ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: 01.09.2022 - 04.09.2022. 

✪ తుది ఆన్సర్ కీ: 11.09.2022.

✪ ఫలితాల వెల్లడి: 11.09.2022.

* ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2022

✪ రిజిస్ట్రేషన్ ప్రక్రియ: 11.09.2022 - 12.09.2022.

✪ జాయింట్ సీట్ అలొకేషన్ ప్రారంభం (JoSAA): 12.09.2022.

✪ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్: 14.09.2022.

✪ ఫలితాల వెల్లడి: 17.09.2022


JEE (Advanced)-2022: Information Brochure

JEE (Advanced)-2022: Online Registration Portal


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఉద్యోగ సంబంధ కధనాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: ఏపీలో రెడ్ బుక్ పాలన, శాంతిభద్రతలు క్షీణించినా ఉప ఎన్నికల్లో మాదే విజయం: జగన్
ఏపీలో రెడ్ బుక్ పాలన, శాంతిభద్రతలు క్షీణించినా ఉప ఎన్నికల్లో మాదే విజయం: జగన్
Dilsukhnagar Blasts Verdict: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల దోషులకు ఉరిశిక్షను సమర్థించిన హైకోర్టు, వారి అప్పీళ్లు తిరస్కరణ
దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల దోషులకు ఉరిశిక్షను సమర్థించిన హైకోర్టు, వారి అప్పీళ్లు తిరస్కరణ
KIA Factory Theft Case: కియా పరిశ్రమలో భారీ చోరీ, ఏకంగా 900 కారు ఇంజిన్లు మాయం!
KIA Factory Theft Case: కియా పరిశ్రమలో భారీ చోరీ, ఏకంగా 900 కారు ఇంజిన్లు మాయం!
Allu Arjun - Jr NTR:
"హ్యాపీ బర్త్ డే బావా"... ఎన్టీఆర్ స్పెషల్ విషెష్... బన్నీ కోసం తారక్ ఏం కోరుకున్నాడో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli Batting vs MI IPL 2025 | ఫుల్ అగ్రెసివ్ మోడ్ లో దుమ్మురేపిన కింగ్ కొహ్లీMI vs RCB Match Records IPL 2025 | పదేళ్ల తర్వాత ముంబై గడ్డపై ఆర్సీబీ ఘన విజయంTilak Varma Batting vs RCB IPL 2025 | తనను అవమానించిన హార్దిక్ తో కలిసే దడదడలాడించిన తిలక్Hardik Pandya vs Krunal Pandya MI vs RCB | IPL 2025 లో మంచి మజా ఇచ్చిన అన్నదమ్ముల సవాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: ఏపీలో రెడ్ బుక్ పాలన, శాంతిభద్రతలు క్షీణించినా ఉప ఎన్నికల్లో మాదే విజయం: జగన్
ఏపీలో రెడ్ బుక్ పాలన, శాంతిభద్రతలు క్షీణించినా ఉప ఎన్నికల్లో మాదే విజయం: జగన్
Dilsukhnagar Blasts Verdict: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల దోషులకు ఉరిశిక్షను సమర్థించిన హైకోర్టు, వారి అప్పీళ్లు తిరస్కరణ
దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల దోషులకు ఉరిశిక్షను సమర్థించిన హైకోర్టు, వారి అప్పీళ్లు తిరస్కరణ
KIA Factory Theft Case: కియా పరిశ్రమలో భారీ చోరీ, ఏకంగా 900 కారు ఇంజిన్లు మాయం!
KIA Factory Theft Case: కియా పరిశ్రమలో భారీ చోరీ, ఏకంగా 900 కారు ఇంజిన్లు మాయం!
Allu Arjun - Jr NTR:
"హ్యాపీ బర్త్ డే బావా"... ఎన్టీఆర్ స్పెషల్ విషెష్... బన్నీ కోసం తారక్ ఏం కోరుకున్నాడో తెలుసా?
IPL 2025 MI VS RCB Updates:  వాటి వ‌ల్లే వ‌రుస ఓట‌ములు.. రోహిత్ కి ఫామ్ దొర‌కాలంటే ఆలా ఆడాలి.. ముంబై కోచ్ జ‌య‌వ‌ర్ధ‌నే
వాటి వ‌ల్లే వ‌రుస ఓట‌ములు.. రోహిత్ కి ఫామ్ దొర‌కాలంటే ఆలా ఆడాలి.. ముంబై కోచ్ జ‌య‌వ‌ర్ధ‌నే
Jio Unlimited Offer: ఫ్రీగా జియో హాట్‌స్టార్‌, ఫ్రీగా జియో ఫైబర్‌ - ఆఫర్‌ గడువు పొడిగించిన జియో
ఫ్రీగా జియో హాట్‌స్టార్‌, ఫ్రీగా జియో ఫైబర్‌ - ఆఫర్‌ గడువు పొడిగించిన జియో
A22 x A6 Movie: అల్లు అర్జున్ బర్త్ డే ట్రీట్ అదుర్స్... అట్లీతో సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసిందోచ్
అల్లు అర్జున్ బర్త్ డే ట్రీట్ అదుర్స్... అట్లీతో సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసిందోచ్
Pawan Kalyan Son Injured: పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు, అసలేం జరిగింది
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు, అసలేం జరిగింది
Embed widget