అన్వేషించండి

'ప్రతిభ' విద్యార్థులకు ఐఐటీ, మెడిసిన్‌ ఫౌండేషన్‌ కోర్సులు - ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ  ప్రతిభ గురుకులాల్లోని విద్యార్థులకు ఐఐటీ, మెడిసిన్ ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్ సీట్లు సాధించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకొచ్చిందిజ

IIT Medicine Foundation Courses: తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ  ప్రతిభ గురుకులాల్లోని విద్యార్థులకు ఐఐటీ, మెడిసిన్ ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఇంజినీరింగ్, మెడిసిన్ సీట్లు సాధించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా సంబంధింత గురుకులాల పరిధిలోని 54 ప్రతిభ పాఠశాలల్లో (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్-CEO) 8వ తరగతి నుంచే ఫౌండేషన్ కోర్సులు ప్రవేశ పెట్టనున్నారు. ఈ విద్యాసంవత్సరం (2024-25) నుంచే ఈ కొత్త విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. అదేవిధంగా ఆయా గురుకులాల్లో పూర్తిస్థాయిలో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. పాఠశవాలలో చదివే ప్రతి విద్యార్థికి కనీసం రెండు గంటలు కంప్యూటర్ అందుబాటులో ఉంచాలని ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలు నిర్ణయించాయి.

పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో..
ప్రతిభ పాఠశాలల్లో సీట్లకు పోటీ ఎక్కువగా ఉంది. ఇక్కడ విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో చేరిన తరువాత చదువుతోపాటు ఇంజినీరింగ్, మెడికల్ సీట్లు సాధించేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. కానీ విద్యార్థులపై ఒత్తిడి పెరిగి సీట్లు పొందలేకపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు 2023-24 విద్యాసంవత్సరంలో పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని పాఠశాలల్లో ఎనిమిదో తరగతి నుంచి ఫౌండేషన్ కోర్సులతో శిక్షణ ఇప్పించేందుకు ఎస్సీ, ఎస్టీ సొసైటీలు ప్రణాళికను సిద్ధం చేశాయి. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించాయి. 

కార్పొరేట్ సంస్థతో గురుకుల సొసైటీలు ఒప్పందం..
రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 8 ప్రీమియర్ సీవోఈలు, 32 నాన్ ప్రీమియర్ సీవోఈలు ఉన్నాయి. అలాగే ఎస్టీ సొసైటీ పరిధిలో 14 కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఎనిమిదో తరగతి నుంచే రోజువారీ పాఠాలతోపాటు అత్యుత్తమ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంపై ఫౌండేషన్ కోర్సులు బోధించనున్నారు. ప్రతి విద్యార్థి పేరిట ప్రత్యేక లాగిన్ ఐడీ సదుపాయాన్ని కల్పిస్తారు. దీంతో వారు ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. రెండేళ్లపాటు రూ.20 కోట్ల విలువైన ఆన్‌లైన్ కంటెంట్ ఉచితంగా అందించేందుకు ఓ కార్పొరేట్ సంస్థతో గురుకుల సొసైటీలు ఒప్పందం చేసుకున్నాయి. అయితే విద్యార్థులకు ప్రత్యేకంగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు అందుబాటులో లేకపోవడంతో ప్రతి పాఠశాలలో అవసరమైన కంప్యూటర్లను సొసైటీ సమకూర్చుతోంది. పలు కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కంప్యూటర్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.

స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం. . . 
ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు (Summer Holidays in AP) ప్రకటించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి సమ్మర్ హాలీడేస్ ప్రారంభంకానున్నాయి. జూన్ 11 వరకు సెలవులు కొనసాగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఏప్రిల్ 2న అధికారక ప్రకటన విడుదల చేసింది. మార్చి 18 నుంచి ఒంటిపూట బడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట ఒడులు నిర్వహిస్తున్నారు. కాగా.. ఏపీ వ్యాప్తంగా ఏప్రిల్ 23 నాటికి అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు పూర్తి చేసి.. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
Drinking water After Meals: భోజనం తర్వాత ఎంత సమయానికి నీళ్లు తాగాలి? మధ్య మధ్యలో వాటర్ తాగడం మంచిదా కాదా?
భోజనం తర్వాత ఎంత సమయానికి నీళ్లు తాగాలి? మధ్య మధ్యలో వాటర్ తాగడం మంచిదా కాదా?
NEET Paper Leak: NEET UG 2026 పరీక్ష రద్దు చేసిన NTA .. పేపర్ లీకేజీ కేసుపై CBI దర్యాప్తు..
NEET UG 2026 పరీక్ష రద్దు చేసిన NTA .. పేపర్ లీకేజీ కేసుపై CBI దర్యాప్తు..
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
Embed widget