అన్వేషించండి

'ప్రతిభ' విద్యార్థులకు ఐఐటీ, మెడిసిన్‌ ఫౌండేషన్‌ కోర్సులు - ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ  ప్రతిభ గురుకులాల్లోని విద్యార్థులకు ఐఐటీ, మెడిసిన్ ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్ సీట్లు సాధించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకొచ్చిందిజ

IIT Medicine Foundation Courses: తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ  ప్రతిభ గురుకులాల్లోని విద్యార్థులకు ఐఐటీ, మెడిసిన్ ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఇంజినీరింగ్, మెడిసిన్ సీట్లు సాధించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా సంబంధింత గురుకులాల పరిధిలోని 54 ప్రతిభ పాఠశాలల్లో (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్-CEO) 8వ తరగతి నుంచే ఫౌండేషన్ కోర్సులు ప్రవేశ పెట్టనున్నారు. ఈ విద్యాసంవత్సరం (2024-25) నుంచే ఈ కొత్త విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. అదేవిధంగా ఆయా గురుకులాల్లో పూర్తిస్థాయిలో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. పాఠశవాలలో చదివే ప్రతి విద్యార్థికి కనీసం రెండు గంటలు కంప్యూటర్ అందుబాటులో ఉంచాలని ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలు నిర్ణయించాయి.

పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో..
ప్రతిభ పాఠశాలల్లో సీట్లకు పోటీ ఎక్కువగా ఉంది. ఇక్కడ విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో చేరిన తరువాత చదువుతోపాటు ఇంజినీరింగ్, మెడికల్ సీట్లు సాధించేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. కానీ విద్యార్థులపై ఒత్తిడి పెరిగి సీట్లు పొందలేకపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు 2023-24 విద్యాసంవత్సరంలో పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని పాఠశాలల్లో ఎనిమిదో తరగతి నుంచి ఫౌండేషన్ కోర్సులతో శిక్షణ ఇప్పించేందుకు ఎస్సీ, ఎస్టీ సొసైటీలు ప్రణాళికను సిద్ధం చేశాయి. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించాయి. 

కార్పొరేట్ సంస్థతో గురుకుల సొసైటీలు ఒప్పందం..
రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 8 ప్రీమియర్ సీవోఈలు, 32 నాన్ ప్రీమియర్ సీవోఈలు ఉన్నాయి. అలాగే ఎస్టీ సొసైటీ పరిధిలో 14 కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఎనిమిదో తరగతి నుంచే రోజువారీ పాఠాలతోపాటు అత్యుత్తమ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంపై ఫౌండేషన్ కోర్సులు బోధించనున్నారు. ప్రతి విద్యార్థి పేరిట ప్రత్యేక లాగిన్ ఐడీ సదుపాయాన్ని కల్పిస్తారు. దీంతో వారు ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. రెండేళ్లపాటు రూ.20 కోట్ల విలువైన ఆన్‌లైన్ కంటెంట్ ఉచితంగా అందించేందుకు ఓ కార్పొరేట్ సంస్థతో గురుకుల సొసైటీలు ఒప్పందం చేసుకున్నాయి. అయితే విద్యార్థులకు ప్రత్యేకంగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు అందుబాటులో లేకపోవడంతో ప్రతి పాఠశాలలో అవసరమైన కంప్యూటర్లను సొసైటీ సమకూర్చుతోంది. పలు కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కంప్యూటర్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.

స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం. . . 
ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు (Summer Holidays in AP) ప్రకటించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి సమ్మర్ హాలీడేస్ ప్రారంభంకానున్నాయి. జూన్ 11 వరకు సెలవులు కొనసాగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఏప్రిల్ 2న అధికారక ప్రకటన విడుదల చేసింది. మార్చి 18 నుంచి ఒంటిపూట బడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట ఒడులు నిర్వహిస్తున్నారు. కాగా.. ఏపీ వ్యాప్తంగా ఏప్రిల్ 23 నాటికి అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు పూర్తి చేసి.. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vamsi Video: సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
Telangana Ration Card Latest News:ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
YS Jagan:  తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
Telangana Highcourt: వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Coming back to Earth | Gravity లేకపోతే మన బతుకులు అథోగతేనా | ABP DesamAdilabad Bala Yesu Festival | క్రిస్మస్ కన్నా ఘనంగా చేసుకునే బాల యేసు పండుగ | ABP DesamPawan Kalyan Maha kumbh 2025 | ప్రయాగ్ రాజ్ లో ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ | ABP DesamHigh Tension in Tuni | ఘర్షణలకు దారి తీసిన తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vamsi Video: సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
Telangana Ration Card Latest News:ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
YS Jagan:  తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
Telangana Highcourt: వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
Telangana Indiramma Illu Latest News: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎగిరి గంతేసే వార్త- బిగ్ అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎగిరి గంతేసే వార్త- బిగ్ అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
Amritha Aiyer: అరెరే అమృతా... ఇంతందంగా ఉంటే ప్రేక్షకులు చూడరా
అరెరే అమృతా... ఇంతందంగా ఉంటే ప్రేక్షకులు చూడరా
Revanth Reddy: సైబర్ నేరగాళ్లు ఒక్క ఏడాదిలో ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలుసా? షీల్డ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి
సైబర్ నేరగాళ్లు ఒక్క ఏడాదిలో ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలుసా? షీల్డ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి
Telangana Ration Card Latest News: తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ ఏ జిల్లాలో ప్రారంభిస్తారు? రాష్ట్రమంతటా ఎప్పుడు ఇస్తారు?
తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ ఏ జిల్లాలో ప్రారంభిస్తారు? రాష్ట్రమంతటా ఎప్పుడు ఇస్తారు?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.