అన్వేషించండి

TS ECET Admissions: ఏపీ విద్యార్థులకు టీఎస్ ఈసెట్ ప్రవేశాలు లేవు..

టీఎస్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్- 2021 పరీక్షలో ఉత్తీర్ణులైన ఏపీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడం లేదని తెలంగాణ సాంకేతిక విద్యా శాఖ వెల్లడించింది.

టీఎస్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET)- 2021 పరీక్షలో ఉత్తీర్ణులైన ఏపీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడం లేదని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ వెల్లడించింది. వీరిని కౌన్సెలింగ్‌కు అనుమతించడం లేదని స్పష్టం చేసింది. ఈసెట్ కౌన్సెలింగ్‌కు ధ్రువపత్రాలు అవసరమని, ఏపీలో పాలిటెక్నిక్ చివరి సంవత్సరం పరీక్షలు ఇప్పటివరకు నిర్వహించని కారణంగా అక్కడి విద్యార్థులకు ఎలాంటి ధ్రువపత్రాలు ఉండవని తెలిపింది. ఈ కారణంతోనే కౌన్సెలింగ్‌కు అనుమతించడం లేదని అధికారులు చెబుతున్నారు. 

పాలిటెక్నిక్ అభ్యర్థులు ఇంజనీరింగ్, బీఫార్మసీ సెకండియర్‌లో చేరేందుకు గానూ ఈసెట్ పరీక్ష నిర్వహిస్తారు. టీఎస్ ఈసెట్ పరీక్ష ఈ నెల 3న జరిగింది. ఈసెట్ పరీక్షలకు మొత్తం 24,808 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 23,667 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 22,522 మంది అర్హత సాధించారు. వారిలో 1500 మందికి పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉన్నారు. 

ఆగస్టు 29 వరకు..
ఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన ఆగస్టు 26 నుంచి ప్రారంభం అయింది. ఇది ఆగస్టు 29వ తేదీ వరకు కొనసాగనుంది. ఏపీలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన విద్యార్థులు మహబూబ్ నగర్‌లోని పాలిటెక్నిక్ కేంద్రంలో కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. అయితే వీరిని అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. 
కౌన్సెలింగ్‌కు అనుమతించకపోవడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము ప్రాసెసింగ్ ఫీజు రూ.1200 చెల్లించామని.. ఇప్పుడు కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. 

సెప్టెంబర్ 2న సీట్ల కేటాయింపు..
టీఎస్ ఈసెట్ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 2వ తేదీన ఉంటుందని చెప్పారు. సెప్టెంబరు 2 నుంచి 7 వరకు ఆన్‌లైన్ విధానంలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

సెప్టెంబర్‌ 13 నుంచి తుది విడత.. 
సెప్టెంబర్‌ 13వ తేదీ నుంచి ఈసెట్ తుది విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. సెప్టెంబర్‌ 14వ తేదీన ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం కల్పించినట్లు పేర్కొంది. వెబ్ ఆప్షన్లను సెప్టెంబర్ 14, 15 తేదీల్లో ఇచ్చుకోవచ్చని సూచించింది. సీట్ల కేటాయింపు వివరాలను సెప్టెంబరు 17న ప్రకటిస్తామని వెల్లడించింది. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించింది. స్పాట్ అడ్మిషన్లకు సెప్టెంబర్ 18వ తేదీన అవకాశం కల్పిస్తామని తెలిపింది. మరిన్ని వివరాల కోసం https://ecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 

Also Read: AP Schools Reopen: ఏపీ బడుల్లో కరోనా కలవరం.. పదిరోజుల్లో 50 మంది విద్యార్థులకు కరోనా... ఆందోళనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు

Also Read: AP School Fee Row : ఏపీలో అతి తక్కువ స్కూల్ ఫీజులు విద్యార్థులకు వరం..! మరి స్కూళ్లకు..?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Petrol Diesel Price Hike: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?
BRS Internal Crisis: కేటీఆర్‌, హరీష్ రావుకు మధ్య పెరుగుతున్న దూరం - బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
కేటీఆర్‌, హరీష్ రావుకు మధ్య పెరుగుతున్న దూరం - బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
AP University Posts: ఏపీ యూనివ‌ర్సిటీల్లో 1523 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ముఖ్యమైన తేదీలు, వర్సిటీల వారీగా ఖాళీల వివరాలు
ఏపీ యూనివ‌ర్సిటీల్లో 1523 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ముఖ్యమైన తేదీలు, వర్సిటీల వారీగా ఖాళీల వివరాలు

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol Diesel Price Hike: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?
BRS Internal Crisis: కేటీఆర్‌, హరీష్ రావుకు మధ్య పెరుగుతున్న దూరం - బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
కేటీఆర్‌, హరీష్ రావుకు మధ్య పెరుగుతున్న దూరం - బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
AP University Posts: ఏపీ యూనివ‌ర్సిటీల్లో 1523 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ముఖ్యమైన తేదీలు, వర్సిటీల వారీగా ఖాళీల వివరాలు
ఏపీ యూనివ‌ర్సిటీల్లో 1523 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ముఖ్యమైన తేదీలు, వర్సిటీల వారీగా ఖాళీల వివరాలు
Prateek Yadav Last Rites: అల్లుడికి అంత్యక్రియలు నిర్వహించే హక్కు మామకు ఉంటుందా? గరుడ పురాణం ఏం చెబుతోంది!
అల్లుడికి అంత్యక్రియలు నిర్వహించే హక్కు మామకు ఉంటుందా? గరుడ పురాణం ఏం చెబుతోంది!
Formula E Race Case: కేటీఆర్‌కు షాక్ - ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు - జూలై 31న హాజరు కావాలని ఆదేశం!
కేటీఆర్‌కు షాక్ - ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు - జూలై 31న హాజరు కావాలని ఆదేశం!
IPL 2026 MI VS PBKS Result Update: పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
Arshdeep Singh Racist Comment on Tilak Varma: ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
Embed widget