అన్వేషించండి

RGUKT: ఏపీలోని ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు జులై 20 నుంచి కౌన్సెలింగ్! ఈ సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోండి!

ఏపీ రాష్ట్రంలోని ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళంలోని ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూలును ఆర్జీయూకేటీ అధికారులు ప్రకటించారు. జులై 20 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది.

ఏపీ రాష్ట్రంలోని ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళంలోని ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలును ఆర్జీయూకేటీ అధికారులు ప్రకటించారు. దీనిప్రకారం జులై 20 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. నూజివీడులో జులై 20, 21 తేదీల్లో, ఇడుపులపాయలో జులై 21,22 తేదీల్లో; ఒంగోలు, శ్రీకాకుళంలోని ఎచ్చెర్ల ట్రిపుల్ఐటీ క్యాంపస్‌కు జులై 24-25 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల పరిధిలో మొత్తం 4,040 సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. కౌన్సెలింగ్‌కు సంబంధించిన కాల్ లెటర్లను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు తర ఆర్జీయూకేటీ అప్లికేషన్ నెంబరు, పదోతరగతి హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి కాల్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి..
కౌన్సెలింగ్ కాల్ లెటర్ల కోసం క్లిక్ చేయండి..

ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్‌ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను గురువారం (జులై 13) విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా 10శాతంతో కలిపి 4,400 సీట్లు ఉండగా.. దివ్యాంగులు, ఎన్‌సీసీ, క్రీడలు, స్కౌట్, సైనికోద్యోగుల కోటాకు సంబంధించిన 360 మినహా మిగతా సీట్లకు జాబితాను ప్రకటించారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచారు. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళంలోని ఒక్కో ట్రిపుల్‌ ఐటీలో 1000 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి. ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల్లో మొదటి 20 స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల్లో నలుగురు మినహా మిగతా 16మంది నూజివీడు ప్రాంగణాన్నే ఎంపిక చేసుకున్నారు. నలుగురు ఆర్‌కే వ్యాలీ క్యాంపస్‌కు ఐచ్ఛికం ఇచ్చారు. ఒంగోలు, శ్రీకాకుళం ప్రాంగణాల్లో మౌలికసదుపాయాలు లేకపోవడంతో ఈ రెండింటిలో చేరేందుకు టాపర్లు ఆసక్తి చూపడం లేదు.

Website

64 శాతం సీట్లు బాలికలకే..
రాజీవ్‌ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్‌ఐటీల్లో ఈ ఏడాది సైతం బాలుర కంటే బాలికలకు ఎక్కువ సీట్లు లభించాయి. మొత్తం సీట్లలో బాలికలకు 64 శాతం దక్కాయి. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల్లో 4,040 సీట్లకు జాబితాను ప్రకటించగా.. బాలికలు 2,585, బాలురు 1,455మంది సీట్లు పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 23,628, ప్రైవేటు బడులకు చెందిన 14,727మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 3,345(82.79%), ప్రైవేటు నుంచి 695(17.20%)మంది సీట్లు పొందారు. స్థానికేతర కోటాలో తెలంగాణకు చెందిన 88 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 4శాతం వెయిటేజీ ఇచ్చారు. ఒక్కో సబ్జెక్టుకు నాలుగు మార్కుల చొప్పున అదనంగా 24మార్కులు కలిపారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 10.02%, వైయస్‌ఆర్‌ జిల్లా నుంచి 6.66%, విజయనగరం జిల్లా నుంచి 6.36% మంది ఎంపికయ్యారు. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి 0.23%మంది సీట్లు పొందారు. ఆగస్టు మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.

కౌన్సెలింగ్‌కు ఈ సర్లిఫికేట్లు సిద్ధం చేసుకోండి..

కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. రెండు సెట్ల జిరాక్స్ కాపీలతోపాటు, ఒరిజినల్ సర్టిఫికేట్లతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.

1) పదోతరగతి పరీక్షల హాల్‌టికెట్

2) పదోతరగతి మార్కుల జాబితా (గ్రేడ్-షీట్)

3) 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ/బోనఫైడ్ సర్టిఫికేట్లు.

4) రెసిడెన్స్ సర్టిఫికేట్

5) క్యాస్ట్/కమ్యూనిటీ/ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్.

6) ఇన్‌కమ్ సర్టిఫికేట్ (01.04.2023 తర్వాత జారీచేసినది).

7) విద్యార్థి ఫోటోలు-6, రెండు తల్లిదండ్రుల ఫోటోలతోపాటు, ఇద్దరు గార్డియన్‌ల ఫోటోలు ఉండాలి. 

8) ఫ్యామిలీ రేషన్ కార్డు కాపీ. 

9) ఆధార్ కార్డు. 

10) చదువు కోసం బ్యాంకు రుణం కోరేవారు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు క్యాంపస్‌లో బ్యాంకులో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుతోపాటు కింది డాక్యుమెంట్లు అవసరమవుతాయి.

➥ 4 సెట్ల సర్టిఫికేట్ కాపీలు 

➥ తల్లిదండ్రులు ఉద్యోగులైతే ఎంప్లాయి ఐడీ కార్డు కాపీ. 

➥ గడచిన 3 నెలల శాలరీ సర్టిఫికేట్లు (పే స్లిప్స్) 

➥ విద్యార్థి, తల్లిదండ్రుల పాన్‌కార్డు

➥ రేషన్ కార్డు/పాన్‌కార్డు/ఓటరు ఐడీకార్డు/ఆధార్ కార్డు (విద్యార్థి, తల్లిదండ్రుల)

➥ చివరి 6 నెలల బ్యాంకు స్టేట్‌మెంట్.

➥ విద్యార్థి ఫోటోలు-6, రెండు తల్లిదండ్రుల ఫోటోలు నాలుగు అవసరమవుతాయి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
World Head Injury Awareness Day: బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హాఫ్‌ హెల్మెట్‌ మంచిదా? ఫుల్ హెల్మెట్‌ పెట్టుకుంటే బెటరా? 
బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హాఫ్‌ హెల్మెట్‌ మంచిదా? ఫుల్ హెల్మెట్‌ పెట్టుకుంటే బెటరా? 
Telangana new education system: తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
KV Admission 2026: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు షురూ! ఎగ్జామ్‌ లేదు, ఇంటర్వ్యూ లేదు! లాటరీ ద్వారానే ఎంపిక!
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు షురూ! ఎగ్జామ్‌ లేదు, ఇంటర్వ్యూ లేదు! లాటరీ ద్వారానే ఎంపిక!

వీడియోలు

RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
Embed widget