అన్వేషించండి

IB Syllabus: ప్రభుత్వ పాఠశాలల్లో 'ఐబీ సిలబస్‌' - వచ్చే ఏడాది నుంచే అమలు!

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం (2025 జూన్) నుంచి ఇంటర్నేషనల్ బకలారియేట్(ఐబీ) సిలబస్ అమల్లోకి రానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జనవరి 31న తెలిపారు.

IB syllabus in AP Schools: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం (2025 జూన్) నుంచి ఇంటర్నేషనల్ బకలారియేట్(ఐబీ) సిలబస్ అమల్లోకి రానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జనవరి 31న తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో మొదట 1వ తరగతి నుంచి మొదలై.. ఆ తర్వాత రెండు.. ఇలా ఏటా ఒక్కో తరగతిలో ఐబీ బోధన మొదలవుతుందని సీఎం వెల్లడించారు. 2035 నాటికి పదో తరగతి, 2037 నాటికి 12వ తరగతిలో ఐబీ బోధన ప్రారంభమవుతుంది. ఐబీని ప్రభుత్వ విద్యారంగంలో భాగస్వామ్యం చేయడం గొప్ప సంతృప్తి ఇస్తోందన్నారు. 

భవిష్యత్ తరాలు మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, ప్రపంచంలో నంబర్ వన్‌గా నిలవాలన్నా.. భారత్ లాంటి దేశాల్లో నాణ్యమైన విద్య అవసరం. ఇప్పుడున్న విద్యా విధానాలను ఉన్నతీకరించాలి. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ విధానంలో ఎడ్యుకేషన్ నాలెడ్జ్‌ని వినియోగించడం కీలకం. ఐబీ ద్వారా ఇది సాధ్యమని విశ్వసిస్తున్నాం. ముందు ఉపాధ్యాయులకు, సిబ్బందికి సామర్థ్యాలు పెంచేలా వచ్చే ఏడాదిలో శిక్షణ కార్యక్రమాలు అమలవుతాయి. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలిలో ఐబీ భాగస్వామ్యంతో బోధన, అభ్యాసాలు పరిణామం చెందుతాయి. ఇది కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందని సీఎం జగన్ వివరించారు.

ఒప్పందం..
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమక్షంలో బుధవారం ఐబీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటోన్ బిగిన్‌తో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఒప్పందం చేసుకున్నారు. ఇంత పెద్ద స్థాయిలో భాగస్వామ్యం కావడం ఇదే ప్రథమమని ఆన్‌లైన్‌లో హాజరైన ఐబీ డైరెక్టర్ జనరల్ ఒలీ పెక్కా హీనోనెన్ పేర్కొన్నారు. భారత్‌తో విద్యా రంగంలో మా సంబంధాలు మరింత మెరుగుపడతాయి. తొలుత ఆటల ఆధారిత అభ్యసన విధానంతో పిల్లల్లో ఆసక్తిని పెంచుతాం. వారు మాతృభాషతో పాటు విదేశీ భాషలు నేర్చుకోవడంపైనా దృష్టి సారిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం విద్య, అనలిటిక్స్ కోసం బైజూస్ కంటెంట్ వాడకం ద్వారా పోటీ తత్వాన్ని పెంచుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు అంతర్జాతీయంగా వారు పోటీ పడేలా ఐబీ సిలబస్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ విద్యా పరిశోధనా మండలి ఎస్.సి.ఈ.ఆర్.టితో అంతర్జాతీయ విద్యాబోర్డు అయిన ఐబీని భాగస్వామిగా మారుస్తూ ఒకటో తరగతి నుంచి క్రమంగా ప్రవేశపెడుతున్న ఈ ఉమ్మడి సిలబస్ తో ఎన్నో ప్రయోజనాలు ఉండబోతున్నాయి.

ఉపాధ్యాయులు సిద్ధం కావాల్సిందే..
రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో ఐబీ సిలబస్ ప్రవేశపెట్టాలంటే ముందుగా ఉపాధ్యాయుల్ని అందుకు సిద్ధం చేయాలి. ఈ ప్రక్రియ చేపట్టేందుకు వచ్చే విద్యాసంవత్సరాన్నివాడుకోనున్నారు. అనంతరం 2025-26 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ఐబీ సిలబస్‌ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఏడాది దాన్ని రెండో తరగతికి విస్తరిస్తారు. అలా 2035 నాటికి పదో తరగతికి, 2037 నాటికి పన్నెండో తరగతికి దీన్ని విస్తరిస్తారు. ఇలా ఐబీ సిలబస్‌లో చదివిన వారికి ఐబీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి సర్టిఫికెట్లు ఇస్తారు.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా..
ఐబీ సిలబస్ తో విద్యార్ధులు చదవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా అంతర్జాతీయంగా అత్యుత్తమ బోధనా పద్ధతులు ఇందులో ఉంటాయి. బట్టీ చదువులకు బదులు థియరీతో పాటు ప్రాక్టికల్ అప్లికేషన్ విధానంలో విద్యా బోధన ఉంటుంది. అంతేకాదు విద్యార్ధుల్లో నాయకత్వ లక్షణాలను ప్రోత్సహిస్తారు. సిలబస్ రూపకల్పనతో పాటు బోధనా పద్ధతులు, మూల్యాంకనం కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

UPSC Prelims 2026: యూపీఎస్సీ పరీక్ష ప్రక్రియలో ఏఐ వాడకం! పరీక్షకు ముందే 569 మంది దరఖాస్తులు తిరస్కరణ!
యూపీఎస్సీ పరీక్ష ప్రక్రియలో ఏఐ వాడకం! పరీక్షకు ముందే 569 మంది దరఖాస్తులు తిరస్కరణ!
NEET JEE Weightage Changes: NEET, JEE అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50% వెయిటేజీ? విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పనిలో కేంద్రం!
NEET, JEE అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50% వెయిటేజీ? విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పనిలో కేంద్రం!
Telangana Breakfast Scheme: ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
NEET UG 2026 Result: నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌ ఫలితాలు జూలై 20 నాటికి విడుదల! ఎంబిబిఎస్ అడ్మిషన్లు, కొత్త సెషన్స్‌పై కీలక ప్రకటన!
నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌ ఫలితాలు జూలై 20 నాటికి విడుదల! ఎంబిబిఎస్ అడ్మిషన్లు, కొత్త సెషన్స్‌పై కీలక ప్రకటన!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Vizag Fishermen Missing: ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌- ఆరుగురు జాలర్లపై ఆశలు గల్లంతు, రూ.10 లక్షల పరిహారం
ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌- ఆరుగురు జాలర్లపై ఆశలు గల్లంతు, రూ.10 లక్షల పరిహారం
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
E20 ఇంధనంపై మరో కొత్త చర్చ - పాత బైక్‌లు, కార్ల రబ్బర్‌ భాగాలు పాడయ్యే ఛాన్స్‌!
E20 పెట్రోల్‌తో పాత బండ్లకు ప్రమాదం! రబ్బర్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని ARAI హెచ్చరిక
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
Embed widget