అన్వేషించండి

AP EAPCET: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్షలు ప్రారంభం, 23 వరకు పరీక్షల నిర్వహణ!

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు ఈఏపీసెట్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సోమవారం(మే 15) ప్రారంభమయ్యాయి. మే 23 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు ఈఏపీసెట్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సోమవారం(మే 15) ప్రారంభమయ్యాయి. మే 23 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఎంసెట్ పరీక్షలకు 'ఒక్క నిమిషం' నిబంధనను అమలు చేస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.  మే19 వరకు ఎంపీసీ గ్రూప్‌ వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక మే 22, 23 తేదీల్లో బైపీసీ స్ట్రీమ్‌ వారికి ఈఏపీసెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు తమ హాల్‌‌టికెట్‌లో పొరపాట్లు ఉంటే సహాయకేంద్రానికి ఫోన్‌ ద్వారా, లేదా మెయిల్‌ పంపి సరిచేయించుకోవచ్చన్నారు. ఈ సారి మొత్తం 136 కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు చేశారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 129, తెలంగాణలో 7 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారు. 

ఏపీఈఏపీసెట్ పరీక్ష మొదటిరోజైన మే 15న ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభంకాగా.. విద్యార్థులను 7.30 నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. మధ్యాహ్నం 3 గంటలకు పరీక్ష ఆరంభమయ్యే పరీక్షకు 1.30 నుంచే అనుమతించనున్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాలేజీ ఐడీ కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్‌ ఐడీలలో ఏదో ఒక ఒరిజినల్‌ కార్డును వెంట తీసుకెళ్లాలి. జిరాక్స్‌, స్కాన్డ్‌ కాపీలను అనుమతించరు. గోరింటాకు పెట్టుకున్నా పరీక్షకు అనుమతించరు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పరీక్ష రోజే కులధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని ఈఏపీసెట్‌ ఛైర్మన్‌ సూచించారు. 

ఈఏపీసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,37,422 దరఖాస్తులు రాగా.. వీటిలో ఇంజినీరింగ్ విభాగానికి 2,37,055; అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు 99,388, రెండు విభాగాలకు 979 దరఖాస్తులు వచ్చాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 15 నుంచి 19 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 08554-23411, 232248 ఫోను నంబర్ల ద్వారా హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.

Also Read:

డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆనర్స్ కోర్సు, ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి!
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా బీఎస్సీ ఆనర్స్ కోర్సు అందుబాటులోకి రానుంది. 2023-24 విద్యాసంవత్సరం నుంచే 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో పాటు మరికొన్ని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ కోర్సులో ప్రవేశాలు పొందిన విద్యార్థులు మూడేళ్ల తర్వాత కూడా ఆపేయవచ్చు. మూడేళ్ల తర్వాత నిలిపివేసిన విద్యార్థులకు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఇస్తారు. నాలుగేళ్లు పూర్తి చేసిన వారికి మాత్రం బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆనర్స్ డిగ్రీ ఇస్తారు. రెండేళ్ల క్రితం తొలిసారిగా పొలిటికల్ సైన్స్, ఆర్థికశాస్త్రంలో బీఏ ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టారు. నిజాం కళాశాల, కోఠి మహిళా కళాశాల, బేగంపేట మహిళా, సిటీ కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. తాజాగా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్‌కు కూడా ఆనర్స్‌ను విస్తరించారు.

డిగ్రీ ప్రవేశాలకు 'దోస్త్‌' నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్ ప్రవేశాలకు 'దోస్త్' నోటిఫికేషన్‌ వెలువడింది. మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి‌ కార్యాలయంలో గురువారం (మే 11) డిగ్రీ దోస్త్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, కళాశాల విద్యాకమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16 నుంచి జులై 10 వరకు దోస్త్ ప్రవేశ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం మూడు విడతలుగా ప్రవేశాలను కల్పిస్తారు. ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన తర్వాత జులై 17 నుంచి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. విద్యార్థులు మొదటి విడతలో రూ.200 చెల్లించాలి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని, రెండు, మూడో విడుతలో రూ.400 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 
దోస్త్ నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

టాప్ హెడ్ లైన్స్

AP Constable Result: నేడు ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
నేడు ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
Telangana Cabinet: బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా - క్లారిటీ వచ్చాకే స్థానిక ఎన్నికలు- తెలంగాణ సర్కార్ నిర్ణయం
బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా - క్లారిటీ వచ్చాకే స్థానిక ఎన్నికలు- తెలంగాణ సర్కార్ నిర్ణయం
Andhra Smart meters Issue: ప్రజలు అంగీకరిస్తేనే విద్యుత్  స్మార్ట్ మీటర్లు బిగింపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రజలు అంగీకరిస్తేనే విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Aakasamlo Oka Tara: 'ఆకాశంలో ఒక తార' గ్లింప్స్... జనరల్ బోగీలో దుల్కర్ ఎంత సింపుల్‌గా ఉన్నాడో చూశారా?
'ఆకాశంలో ఒక తార' గ్లింప్స్... జనరల్ బోగీలో దుల్కర్ ఎంత సింపుల్‌గా ఉన్నాడో చూశారా?
Advertisement

వీడియోలు

Mother Left Her Baby in BUS Stand For Insta Lover | ప్రియుడి కోసం బస్టాండ్‌లో బిడ్డను వదిలేసిన తల్లి | ABP Desam
Eng vs Ind Test Series Gill Jadeja Records | క్రికెట్ లెజెండ్స్ సరసన నిలిచిన గిల్, జడేజా | ABP Desam
Ben Stokes Appeal for Draw Jadeja Denied | సెంచరీలు కొట్టే టైమ్ కి ఇంగ్లండ్ కు డ్రా గుర్తొచ్చింది | ABP Desam
Ben Stokes Rishabh Pant Injuries | సబ్ స్టిట్యూట్స్ ను పెట్టుకోవటంపై బెన్ స్టోక్స్ మండిపాటు | ABP Desam
Eng vs Ind Fourth Test Draw Day 5 Highlights | తెగువ చూపించి మాంచెస్టర్ టెస్ట్ ను డ్రా చేసిన యంగ్ ఇండియా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Constable Result: నేడు ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
నేడు ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
Telangana Cabinet: బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా - క్లారిటీ వచ్చాకే స్థానిక ఎన్నికలు- తెలంగాణ సర్కార్ నిర్ణయం
బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా - క్లారిటీ వచ్చాకే స్థానిక ఎన్నికలు- తెలంగాణ సర్కార్ నిర్ణయం
Andhra Smart meters Issue: ప్రజలు అంగీకరిస్తేనే విద్యుత్  స్మార్ట్ మీటర్లు బిగింపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రజలు అంగీకరిస్తేనే విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Aakasamlo Oka Tara: 'ఆకాశంలో ఒక తార' గ్లింప్స్... జనరల్ బోగీలో దుల్కర్ ఎంత సింపుల్‌గా ఉన్నాడో చూశారా?
'ఆకాశంలో ఒక తార' గ్లింప్స్... జనరల్ బోగీలో దుల్కర్ ఎంత సింపుల్‌గా ఉన్నాడో చూశారా?
Crime News: ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతున్న యువతి, గొడవ పడి దారుణంగా హత్య చేసిన సోదరుడు
ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతున్న యువతి, దారుణంగా హత్య చేసిన సోదరుడు
Jasprit Bumrah Availability in 5th Test: బుమ్రా ఆడ‌టంపై గంభీర్ కీల‌క వ్యాఖ్య‌లు..! జ‌ట్టులో మార్పులు ఖాయం..!! పంత్ స్థానంలో ఆ ప్లేయ‌ర్.. జోరుమీదున్న గిల్ సేన‌
బుమ్రా ఆడ‌టంపై గంభీర్ కీల‌క వ్యాఖ్య‌లు.. జ‌ట్టులో మార్పులు ఖాయం..! పంత్ స్థానంలో ఆ ప్లేయ‌ర్.. జోరుమీదున్న గిల్ సేన‌
Meenakshi Natarajan Padayatra: తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర - కాంగ్రెస్ నేతలంతా కలసి వస్తారా?
తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర - కాంగ్రెస్ నేతలంతా కలసి వస్తారా?
YS Jagan meets Governor: గవర్నర్‌తో జగన్ దంపతుల భేటీ - లిక్కర్ స్కామ్ అరెస్టులపై ఫిర్యాదు?
గవర్నర్‌తో జగన్ దంపతుల భేటీ - లిక్కర్ స్కామ్ అరెస్టులపై ఫిర్యాదు?
Embed widget