అన్వేషించండి

Polytechnic Courses: పాలిటెక్నిక్‌ కోర్సుల కొనసాగింపుపై క్లారిటీ ఇచ్చిన ఏఐసీటీఈ

తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు, కళాశాలల భవిష్యత్తుపై గత మూడేళ్లుగా నెలకొన్న సందిగ్ధతకు 'ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE)' ముగింపు పలికింది.

తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు, కళాశాలల భవిష్యత్తుపై గత మూడేళ్లుగా నెలకొన్న సందిగ్ధతకు 'ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE)' ముగింపు పలికింది. పాలిటెక్నిక్ కోర్సులు గతంలో మాదిరిగానే యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేసింది. ఇటీవల ఢిల్లీలో అన్ని రాష్ట్రాల సాంకేతిక విద్యాశాఖ అధికారులతో నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్(NCRF) విధానంపై నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని ఏఐసీటీఈ ఛైర్మన్ సీతారామ్ స్పష్టం చేశారు. బీటెక్ రెండేళ్లు పూర్తయిన తర్వాత చదువు మానేసే వారికి ఇచ్చే డిప్లొమా సర్టిఫికెట్‌కు, మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమాకు అసలు పొంతనే లేదని, పాలిటెక్నిక్ కోర్సులు యథాతథంగా ఉంటాయని, అవి ఇండస్ట్రియల్ పరిజ్ఞానాన్ని పెంచేందుకు అందిస్తున్న కోర్సులని తేల్చి చెప్పారు. 

బీటెక్‌లో డిప్లొమా సర్టిఫికెట్‌తో ఉద్యోగాలు పొందే నైపుణ్యాలు సాధించలేరని, అది కేవలం మళ్లీ భవిష్యత్తులో బీటెక్ చదివేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని సీతారామ్ వివరించినట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (SBTET) కార్యదర్శి పుల్లయ్య చెప్పారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో 56 ప్రభుత్వ, 62 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. వాటిల్లో సుమారు 32 వేల సీట్లున్నాయి.

మూడేళ్ల క్రితం విడుదల చేసిన జాతీయ నూతన విద్యా విధానం-2020లో బీటెక్‌లో చేరి ఏడాది తర్వాత బయటకు వెళ్తే సర్టిఫికెట్, రెండేళ్ల తర్వాత వెళ్తే డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తామని పొందుపరిచారు. దీంతో ఇక పాలిటెక్నిక్ కోర్సులు ఉండవని ఊహాగానాలు వినిపించాయి. గత ఏడాది కళాశాలలకు అనుమతుల ప్రక్రియకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఏఐసీటీఈ నిర్వహించిన సమావేశంలో పలువురు పాలిటెక్నిక్ కళాశాలల ప్రతినిధులు ఈ విషయంపై అప్పటి ఛైర్మన్ సహస్రబుద్ధేను ప్రశ్నించారు. దానిపై చర్చిస్తున్నామని, ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన సమాధానమివ్వడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. తాజాగా నూతన ఛైర్మన్ అవన్నీ అపోహలేనని స్పష్టత ఇచ్చారు.

ALSO READ: 

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు 'ఇంటర్న్‌షిప్‌', ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే అవకాశం
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ (Internship) చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు డిసెంబరు 20న ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని బీటెక్ (B.Tech), ఎంటెక్ (M.Tech) చివరి సంవత్సరం చదివే విద్యార్థులతో.. ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9 తరగతులు చదివే విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయులకు నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకోసం 6,790 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఇంజినీరింగ్ కళాశాలలతో అనుసంధానించింది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

పెరల్ అకాడమీలో డిజైన్‌ & మేనేజ్‌మెంట్‌ కోర్సులు, ప్రవేశాలు ఇలా
దేశంలోని పలు క్యాంపస్‌లో 2024-25 విద్యాసంవత్సరానికిగాను వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం పెరల్ అకాడమీ దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

దేశవ్యాప్తంగా 10 వేల విద్యాసంస్థలకు రుణాల జారీ లక్ష్యం: ఆక్సిలో ఫిన్‌సర్వ్‌
రాబోయే 5 సంవత్సరాలలో (2028 నాటికి) దేశవ్యాప్తంగా 10 వేల పాఠశాలలు, విద్యా సంస్థలకు రుణ నిధులు సమకూర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆక్సిలో ఫిన్‌సర్వ్ సంస్థ తెలిపింది. ఈ మేరకు డిసెంబరు 20న ప్రణాళికలను ప్రకటించింది. విద్యా సంస్థలు తమ సామర్థ్య పెంపుదల, ప్రాంగణాల విస్తరణ కోసం భూమి కొనుగోలు, బోధనా సౌకర్యాల ఆధునీకరణ, అధిక ఖర్చుతో కూడిన అప్పుల భర్తీకి సంబంధించిన అవసరాలను తీర్చడానికి ఆర్థిక సహాయం చేయనున్నట్లు పేర్కొంది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Case:  వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు -సిట్ ఎదుట హాజరైన ధర్మారెడ్డి - నెయ్యి కల్తీ కేసులో సిబీఐ సిట్ దూకుడు
వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు -సిట్ ఎదుట హాజరైన ధర్మారెడ్డి - నెయ్యి కల్తీ కేసులో సిబీఐ సిట్ దూకుడు
Ande Sri Last Rites: అందెశ్రీ పాడె మోసిన రేవంత్‌ రెడ్డి.. పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్న  సీఎం
అందెశ్రీ పాడె మోసిన రేవంత్‌ రెడ్డి.. పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్న సీఎం
PM Modi on Delhi Blast: ఢిల్లీ పేలుడు కుట్రదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. ప్రధాని మోదీ హెచ్చరిక
ఢిల్లీ పేలుడు కుట్రదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. ప్రధాని మోదీ హెచ్చరిక
Jubilee Hills by election: మాగంటి సునీతను అడ్డుకున్న పోలీసులు.. నాన్ లోకల్స్‌పై కేసులు నమోదుకు ఈసీ ఆదేశం
మాగంటి సునీతను అడ్డుకున్న పోలీసులు.. నాన్ లోకల్స్‌పై కేసులు నమోదుకు ఈసీ ఆదేశం
Advertisement

వీడియోలు

PM Modi First Reaction on Delhi Blast | ఢిల్లీ బ్లాస్ట్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్
Drone in Jubilee Hills Bypoll | ఎన్నికల్లో ఇదే మొదటిసారి డ్రోన్ ప్రయోగం
White Collar Terror Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
White Collar Terror Attack Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
Jubilee Hills Polling Updates | పోలింగ్ బూత్ ల వద్ద ప్రధాన పార్టీల ప్రలోభాల గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Case:  వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు -సిట్ ఎదుట హాజరైన ధర్మారెడ్డి - నెయ్యి కల్తీ కేసులో సిబీఐ సిట్ దూకుడు
వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు -సిట్ ఎదుట హాజరైన ధర్మారెడ్డి - నెయ్యి కల్తీ కేసులో సిబీఐ సిట్ దూకుడు
Ande Sri Last Rites: అందెశ్రీ పాడె మోసిన రేవంత్‌ రెడ్డి.. పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్న  సీఎం
అందెశ్రీ పాడె మోసిన రేవంత్‌ రెడ్డి.. పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్న సీఎం
PM Modi on Delhi Blast: ఢిల్లీ పేలుడు కుట్రదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. ప్రధాని మోదీ హెచ్చరిక
ఢిల్లీ పేలుడు కుట్రదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. ప్రధాని మోదీ హెచ్చరిక
Jubilee Hills by election: మాగంటి సునీతను అడ్డుకున్న పోలీసులు.. నాన్ లోకల్స్‌పై కేసులు నమోదుకు ఈసీ ఆదేశం
మాగంటి సునీతను అడ్డుకున్న పోలీసులు.. నాన్ లోకల్స్‌పై కేసులు నమోదుకు ఈసీ ఆదేశం
Assam Marriages Act: వివాహాలపై అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం.. త్వరలో అసెంబ్లీకి రానున్న బిల్లు
వివాహాలపై అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం.. త్వరలో అసెంబ్లీకి రానున్న బిల్లు
Video is real or made by AI: ఓ వీడియో ఒరిజినల్ ఆ AIతో క్రియేట్ చేశారా ఇలా చేస్తే నిమిషాల్లో తెలుసుకోవచ్చు
ఓ వీడియో ఒరిజినల్ ఆ AIతో క్రియేట్ చేశారా ఇలా చేస్తే నిమిషాల్లో తెలుసుకోవచ్చు
Delhi Blast: ఎర్రకోట పేలుడు మాస్టర్ మైండ్‌ అతనేనా? వెలుగులోకి కీలక సీసీటీవీ పుటేజ్‌- ఫరీదాబాద్ మాడ్యూల్‌కు చెందిన డాక్టర్‌పై అనుమానం
ఎర్రకోట పేలుడు మాస్టర్ మైండ్‌ అతనేనా? వెలుగులోకి కీలక సీసీటీవీ పుటేజ్‌- ఫరీదాబాద్ మాడ్యూల్‌కు చెందిన డాక్టర్‌పై అనుమానం
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కోసం ఆటో డ్రైవర్లు ఉచిత సర్వీస్, పోలింగ్ పెరగడం గ్యారంటీనా?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కోసం ఆటో డ్రైవర్లు ఉచిత సర్వీస్, పోలింగ్ పెరగడం గ్యారంటీనా?
Embed widget