అన్వేషించండి

Crime News : మద్యం తాగొచ్చి వేధిస్తున్నాడని, మెడకు చున్నీ బిగించి భర్తను చంపేసిన భార్య

Telangana : మద్యం మహమ్మారి ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. రోజు తాగి వచ్చి భర్త పెడుతున్న హింసను భరించలేక భార్య చున్నీని మెడకు బిగించి హత్య చేసింది. ఈ ఘటన ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది.

Hyderabad Crime News: మద్యం మహమ్మారి అనేక కుటుంబాల్లో చిచ్చుకు కారణమవుతోంది. మద్యం మత్తులో మగవాళ్లు చేసే అరాచకాలకు ఎంతో మంది మహిళలు బలి అవుతున్నారు. కొన్నిసార్లు ఈ వేధింపులు తట్టుకోలేక మహిళలు కూడా తాగుబోతు భర్తలను హతమార్చేస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. నిత్యం మద్యం తాగి వచ్చి వేధిస్తున్న భర్త ఆగడాలను భరించలేకపోయిన ఇల్లాలు అతని మెడకు చున్నీని బిగించి కంపేసింది. ఈ ఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ దుర్గా రామలింగ ప్రసాద్‌ మీడియాకు వెల్లడించారు. అసోం రాష్ట్రానికి చెందిన అలీ హుస్సేన్‌ లస్కర్‌ (35), రుస్తానా బేగం లస్కర్‌ దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు రెండేళ్ల కిందట వీరు హైదరాబాద్‌ నగరానికి వచ్చారు. అప్పటి నుంచి మియాపూర్‌ హఫీజ్‌పేటలోని ప్రేమ్‌నగర్‌ కాలనీలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అలీ హుస్సేన్‌ లస్కర్‌ మద్యానికి అలవాటు పడ్డాడు. క్రమంగా ఈ అలవాటు బానిసత్వానికి దారి తీసింది. నిత్యం మద్యం తాగి వచ్చి గొడవ చేయడంతోపాటు భార్యను వేధింపులకు గురి చేసేవాడు. పిల్లలను కూడా కొడుతుండడంతో తీవ్రంగా ఇబ్బందులు పడేది. సోమవారం రాత్రి కూడా అలీ హుస్సేన్‌ పూటుగా తాగి వచ్చాడు. ఎప్పటి మాదిరిగానే ఇంట్లో గొడవ చేయడంతోపాటు భార్యను, పిల్లలను కొట్టాడు. 

గొడవ పెద్దది కావడంతో చున్నీతో బిగించిన భార్య

మద్యం మత్తులో ఉన్న హుస్సేన్‌ భార్యను, పిల్లలను తీవ్రంగా కొడుతుండడంతో భార్య రుస్తానా బేగం ఎదురు తిరిగింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున కూడా మరోసారి గొడవకు దిగడంతో సహనం కోల్పోయిన రుస్తానా తన చున్సీతో భర్త అలీ హుస్సేన్‌ లస్కర్‌ మెడకు భిగించింది. గట్టిగా చున్నీని బిగించడంతో హుస్సేన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌ గురైన బేగం అక్కడి నుంచి పారిపోయింది. మృతుడి సోదరుడు అక్బర్‌ హుస్సేన్‌ ఫిర్యాదు మేరకు మియాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్యను భార్య రుస్తానా బేగం చేసినట్టు నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో హత్య చేసిన విషయాన్ని బేగం అంగీకరించారు. భర్త వేధింపులను భరించలేక చున్నీని తానే మెడకు బిగించి హత్య చేసినట్టు వెల్లడించింది. నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. మద్యం మహమ్మారి ఒక ప్రాణాన్ని బలిగొనగా, మరొకరిని జైలు పాలు చేసింది. దీంతో ముగ్గురు చిన్నారులు ఇప్పుడు అనాథలుగా మిగిలారు. ఈ తరహా ఘటనలు అనేకం చోటుచేసుకుంటుండడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Nandu World Couple Reaction : డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
Nandu World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
IPL final match driving accident: ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !
ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget