అన్వేషించండి

Crime News : మద్యం తాగొచ్చి వేధిస్తున్నాడని, మెడకు చున్నీ బిగించి భర్తను చంపేసిన భార్య

Telangana : మద్యం మహమ్మారి ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. రోజు తాగి వచ్చి భర్త పెడుతున్న హింసను భరించలేక భార్య చున్నీని మెడకు బిగించి హత్య చేసింది. ఈ ఘటన ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది.

Hyderabad Crime News: మద్యం మహమ్మారి అనేక కుటుంబాల్లో చిచ్చుకు కారణమవుతోంది. మద్యం మత్తులో మగవాళ్లు చేసే అరాచకాలకు ఎంతో మంది మహిళలు బలి అవుతున్నారు. కొన్నిసార్లు ఈ వేధింపులు తట్టుకోలేక మహిళలు కూడా తాగుబోతు భర్తలను హతమార్చేస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. నిత్యం మద్యం తాగి వచ్చి వేధిస్తున్న భర్త ఆగడాలను భరించలేకపోయిన ఇల్లాలు అతని మెడకు చున్నీని బిగించి కంపేసింది. ఈ ఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ దుర్గా రామలింగ ప్రసాద్‌ మీడియాకు వెల్లడించారు. అసోం రాష్ట్రానికి చెందిన అలీ హుస్సేన్‌ లస్కర్‌ (35), రుస్తానా బేగం లస్కర్‌ దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు రెండేళ్ల కిందట వీరు హైదరాబాద్‌ నగరానికి వచ్చారు. అప్పటి నుంచి మియాపూర్‌ హఫీజ్‌పేటలోని ప్రేమ్‌నగర్‌ కాలనీలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అలీ హుస్సేన్‌ లస్కర్‌ మద్యానికి అలవాటు పడ్డాడు. క్రమంగా ఈ అలవాటు బానిసత్వానికి దారి తీసింది. నిత్యం మద్యం తాగి వచ్చి గొడవ చేయడంతోపాటు భార్యను వేధింపులకు గురి చేసేవాడు. పిల్లలను కూడా కొడుతుండడంతో తీవ్రంగా ఇబ్బందులు పడేది. సోమవారం రాత్రి కూడా అలీ హుస్సేన్‌ పూటుగా తాగి వచ్చాడు. ఎప్పటి మాదిరిగానే ఇంట్లో గొడవ చేయడంతోపాటు భార్యను, పిల్లలను కొట్టాడు. 

గొడవ పెద్దది కావడంతో చున్నీతో బిగించిన భార్య

మద్యం మత్తులో ఉన్న హుస్సేన్‌ భార్యను, పిల్లలను తీవ్రంగా కొడుతుండడంతో భార్య రుస్తానా బేగం ఎదురు తిరిగింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున కూడా మరోసారి గొడవకు దిగడంతో సహనం కోల్పోయిన రుస్తానా తన చున్సీతో భర్త అలీ హుస్సేన్‌ లస్కర్‌ మెడకు భిగించింది. గట్టిగా చున్నీని బిగించడంతో హుస్సేన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌ గురైన బేగం అక్కడి నుంచి పారిపోయింది. మృతుడి సోదరుడు అక్బర్‌ హుస్సేన్‌ ఫిర్యాదు మేరకు మియాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్యను భార్య రుస్తానా బేగం చేసినట్టు నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో హత్య చేసిన విషయాన్ని బేగం అంగీకరించారు. భర్త వేధింపులను భరించలేక చున్నీని తానే మెడకు బిగించి హత్య చేసినట్టు వెల్లడించింది. నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. మద్యం మహమ్మారి ఒక ప్రాణాన్ని బలిగొనగా, మరొకరిని జైలు పాలు చేసింది. దీంతో ముగ్గురు చిన్నారులు ఇప్పుడు అనాథలుగా మిగిలారు. ఈ తరహా ఘటనలు అనేకం చోటుచేసుకుంటుండడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Mudragada Kapu Reservation Legacy: కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Embed widget