అన్వేషించండి

Shilpa Chowdary Black Money: కోట్లకు కోట్లు ఇచ్చిన వాళ్లు కిక్కురుమనడం లేదా ? శిల్పాచౌదరి కేసులో ఏం జరుగుతోంది ?

శిల్పా చౌదరిని మరోసారి కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసు పెట్టకుండా సొత్తు రికవరీ చేయాలన్న ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటంతో పోలీసులు వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Shilpa Chowdary Cheating Case: శిల్పా చౌదరి అనే మహిళ కిట్టీ పార్టీలు ఇచ్చి రూ. 200 కోట్ల మోసం చేసిందని.. అందులో సినీ ప్రముఖులు ఎక్కువగా ఉన్నారన్న ప్రచారం కలకలం రేపింది. దానికి తగ్గట్లుగానే ఓ యువ హీరో.. మరో హీరో భార్య.. ఇలా కొంత మంది డబ్బులిచ్చినట్లుగా బయటకు వచ్చింది. కానీ ఎక్కువ మంది కేసు పెట్టకుండా తమ డబ్బులిప్పిచ్చాలని పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఎందుకు ఆమెపై ఫిర్యాదు చేయడం లేదు...? ఫిర్యాదు చేస్తే డబ్బులు వెనక్కి రావని భయపడుతున్నారా ? బ్లాక్ మనీ గుట్టు రట్టవుతుందని ఆందోళన చెందుతున్నారా ? 

Also Read : భారత్-మయన్మార్ సరిహద్దులో రూ.500 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత... అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్
 
రూ.200 కోట్లు వసూలు చేసినట్లు రూమర్స్ ..కానీ ముగ్గురే ఫిర్యాదు !  

రూ. 2కోట్ల 50 లక్షల తీసుకుని మోసం చేసిందని ప్రియా అనే మహిళ శిల్పా చౌదరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత మహేష్ బాబు సోదరి  హీరో సుధీర్ బాబు భార్య కూడా ఫిర్యాదు చేసింది. ఆమెకు మూడు కోట్లు టోకరా వేసినట్లుగా భావిస్తున్నారు. మరొకరు కూడా ఫిర్యాదు చేశారు. అంతే వీరందరిదీ కలిపినా రూ. ఆరేడు కోట్ల మోసమే. మరి రూ. రెండు వందల కోట్లు ఎవరిచ్చారు..? వారు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు ?    ఆర్భాటం ప్రదర్శిస్తూ పలువురు సెలబ్రెటీలను సినీ ప్రముఖుల నుంచి ఇండస్ర్టీయలిస్ట్‌ల వరకు బుట్టలో వేసుకొని కోట్లలో బురిడీ కొట్టించిందని భావిస్తున్నారు. ప్రధానం ఆమె అస్త్రం.. బ్లాక్ మనీని వైట్ చేయడం. అందుకే ఆమెకు అత్యధికంగా నగదు ఇచ్చారు. 

Also Read : భార్య వాట్సప్ చాటింగ్ చూసేవాడు.. అనుమానంతో వేధించేవాడు.. చివరకు..

అదంతా అక్రమ డబ్బే .. అందుకే ఫిర్యాదుకు రావడం లేదా !?

మోసపోయిన బాధితులు ఫిర్యాదుచేయడానికి మరి కొందరు ముందుకు రావడంలేదు. ఐటీ కట్టకుండా దాచుకున్న డబ్బు ఆమెకు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంటే అదంతా నల్లధనం . వారి ఆస్తులపై ప్రభుత్వ ఏజెన్సీల నిఘా పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఒక్క బాధితురాలు ఏకంగా రూ.11 కోట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. వారెవరో ఇంత వరకూ ఫిర్యాదు చేయలేదు. పోలీసులు మాత్రం లోతుగా విచారణ చేపడుతున్నారు. అందరూ డబ్బులిచ్చిన బడాబాబులే కావడంతో ఫిర్యాదు చేయం కానీ తమ డబ్బులు తమకు ఇప్పించాలని మాత్రం ఉన్నత స్థాయిలో పోలీసుల మీద ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది. 

Also Read: వివాహేతర సంబంధం.. భర్తతో కలిసి ప్రియుడిని హతమార్చిన మహిళ.. ట్విస్ట్ ఏంటంటే..!

రూ. కోట్లన్నీ డబ్బులన్నీ ఎక్కడికి తరలిపోయాయి..!

డబ్బంతా ఆమె ఎక్కడికి తరలించిందనేదానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.శిల్పాచౌదరి నిర్మాతగా టాలీవుడ్‌లో సెహరి సినిమా నిర్మాణం చేపట్టారు.  ఈ సినిమాకు సహ నిర్మాతగా ఆమె 12శాతం వాటాదారుగా ఉన్నట్టు గుర్తించారు.  రూ.కోట్టలో నగదును నిందితులు ఎక్కడ పెట్టుబడి పెట్టారు, బ్యాంకు ద్వారా లావాదేవీలు నిర్వహించకుండా జాగ్రత్త పడటానికి కారణాలు, లెక్కల్లో చూపని నల్లడబ్బును మార్చేందుకు ఇతరులు శిల్పాచౌదరి ద్వారా వ్యాపారం నిర్వహించాలని ప్రయత్నించినట్లుగా అనుమానిస్తున్నారు.  ఏడాది కాలంలో జరిపిన ఆర్థిక లావాదేవీలపై కూపీ లాగుతున్నారు. ఇవన్నీ బయటకు వస్తే..  కేసు విచారణ ముందుకు సాగే అవకాశం ఉంది. అందుకే రెండో సారి శిల్పా చౌదరిని కస్టడీకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: Honour Killing: సొంత అక్క తల నరికిన తమ్ముడు.. అందుకు కన్నతల్లి సాయం, తల వేరు చేసి తల్లీకొడుకుల సెల్ఫీలు

సొత్తు రికవరీకే పోలీసుల ప్రయత్నం ! 

ఇందులో పెద్ద పెద్ద వారి  డబ్బులు ఉండటంతో పోలీసులు సొత్తు రికవరీపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. శిల్పాచౌదరి బాధితుల జాబితాలో సెలబ్రిటీలు, ఐపీఎస్‌లు, ఇతర బ్యూరోక్రాట్ల బంధువులు కూడా ఉన్నారు. ఆమెను శిక్షించడం కన్నా తమ డబ్బు తమకు వచ్చేలా చేయమని అడిగేవారి సంఖ‌్యే ఎక్కువగా ఉంది. అందుకే అందరి డబ్బులు ఎక్కడున్నాయన్నదానిపైనే పోలీసులు ఆమె నుంచి సమాచారం సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇంత పక్కాగా స్కెచ్ వేసిన శిల్పా.. డబ్బు మాత్రం ఎక్కడ ఉందో తేలికగా చెబుతోంది. తనను ఇతరులు మోసం చేసారని పోలీసులకు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో గుట్టు బయటకు రావడం లేదు. 

Also Read: Visakhapatnam: చిన్నారావును చితక్కొట్టారు... బాలికలతో అసభ్యప్రవర్తన రౌడీషీటర్ కు మహిళలు బడితపూజ

శిల్పా చౌదరి గుట్టు రట్టయితే బ్లాక్ మనీ రాకెట్ కూడా బయటకు వస్తుందా !?

బ్లాక్ మనీని తీసుకున్న శిల్పా చౌదరి అందర్నీ మోసం చేసింది. వారంతా ఇచ్చింది బ్లాక్  మనీ కావడంతో ఆధారాలు కూడా లేవు. సమాజంలో తాడి దన్నేవాడు ఒకడుంటే.. వాడి తలదన్నేవాడు మరొకడు ఉంటాడని అంటారు. అంటే అక్రమ దందాలతో డబ్బు సంపాదించేవారు ఒకరు ఉంటే..వారిని మోసం చేసేవాళ్లు మరి కొందరుంటారు. శిల్పా చౌదరి లాంటి వాళ్లు అలా బయటకు వస్తూనే ఉంటారు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Embed widget