అన్వేషించండి

Shilpa Chowdary Black Money: కోట్లకు కోట్లు ఇచ్చిన వాళ్లు కిక్కురుమనడం లేదా ? శిల్పాచౌదరి కేసులో ఏం జరుగుతోంది ?

శిల్పా చౌదరిని మరోసారి కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసు పెట్టకుండా సొత్తు రికవరీ చేయాలన్న ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటంతో పోలీసులు వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Shilpa Chowdary Cheating Case: శిల్పా చౌదరి అనే మహిళ కిట్టీ పార్టీలు ఇచ్చి రూ. 200 కోట్ల మోసం చేసిందని.. అందులో సినీ ప్రముఖులు ఎక్కువగా ఉన్నారన్న ప్రచారం కలకలం రేపింది. దానికి తగ్గట్లుగానే ఓ యువ హీరో.. మరో హీరో భార్య.. ఇలా కొంత మంది డబ్బులిచ్చినట్లుగా బయటకు వచ్చింది. కానీ ఎక్కువ మంది కేసు పెట్టకుండా తమ డబ్బులిప్పిచ్చాలని పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఎందుకు ఆమెపై ఫిర్యాదు చేయడం లేదు...? ఫిర్యాదు చేస్తే డబ్బులు వెనక్కి రావని భయపడుతున్నారా ? బ్లాక్ మనీ గుట్టు రట్టవుతుందని ఆందోళన చెందుతున్నారా ? 

Also Read : భారత్-మయన్మార్ సరిహద్దులో రూ.500 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత... అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్
 
రూ.200 కోట్లు వసూలు చేసినట్లు రూమర్స్ ..కానీ ముగ్గురే ఫిర్యాదు !  

రూ. 2కోట్ల 50 లక్షల తీసుకుని మోసం చేసిందని ప్రియా అనే మహిళ శిల్పా చౌదరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత మహేష్ బాబు సోదరి  హీరో సుధీర్ బాబు భార్య కూడా ఫిర్యాదు చేసింది. ఆమెకు మూడు కోట్లు టోకరా వేసినట్లుగా భావిస్తున్నారు. మరొకరు కూడా ఫిర్యాదు చేశారు. అంతే వీరందరిదీ కలిపినా రూ. ఆరేడు కోట్ల మోసమే. మరి రూ. రెండు వందల కోట్లు ఎవరిచ్చారు..? వారు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు ?    ఆర్భాటం ప్రదర్శిస్తూ పలువురు సెలబ్రెటీలను సినీ ప్రముఖుల నుంచి ఇండస్ర్టీయలిస్ట్‌ల వరకు బుట్టలో వేసుకొని కోట్లలో బురిడీ కొట్టించిందని భావిస్తున్నారు. ప్రధానం ఆమె అస్త్రం.. బ్లాక్ మనీని వైట్ చేయడం. అందుకే ఆమెకు అత్యధికంగా నగదు ఇచ్చారు. 

Also Read : భార్య వాట్సప్ చాటింగ్ చూసేవాడు.. అనుమానంతో వేధించేవాడు.. చివరకు..

అదంతా అక్రమ డబ్బే .. అందుకే ఫిర్యాదుకు రావడం లేదా !?

మోసపోయిన బాధితులు ఫిర్యాదుచేయడానికి మరి కొందరు ముందుకు రావడంలేదు. ఐటీ కట్టకుండా దాచుకున్న డబ్బు ఆమెకు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంటే అదంతా నల్లధనం . వారి ఆస్తులపై ప్రభుత్వ ఏజెన్సీల నిఘా పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఒక్క బాధితురాలు ఏకంగా రూ.11 కోట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. వారెవరో ఇంత వరకూ ఫిర్యాదు చేయలేదు. పోలీసులు మాత్రం లోతుగా విచారణ చేపడుతున్నారు. అందరూ డబ్బులిచ్చిన బడాబాబులే కావడంతో ఫిర్యాదు చేయం కానీ తమ డబ్బులు తమకు ఇప్పించాలని మాత్రం ఉన్నత స్థాయిలో పోలీసుల మీద ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది. 

Also Read: వివాహేతర సంబంధం.. భర్తతో కలిసి ప్రియుడిని హతమార్చిన మహిళ.. ట్విస్ట్ ఏంటంటే..!

రూ. కోట్లన్నీ డబ్బులన్నీ ఎక్కడికి తరలిపోయాయి..!

డబ్బంతా ఆమె ఎక్కడికి తరలించిందనేదానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.శిల్పాచౌదరి నిర్మాతగా టాలీవుడ్‌లో సెహరి సినిమా నిర్మాణం చేపట్టారు.  ఈ సినిమాకు సహ నిర్మాతగా ఆమె 12శాతం వాటాదారుగా ఉన్నట్టు గుర్తించారు.  రూ.కోట్టలో నగదును నిందితులు ఎక్కడ పెట్టుబడి పెట్టారు, బ్యాంకు ద్వారా లావాదేవీలు నిర్వహించకుండా జాగ్రత్త పడటానికి కారణాలు, లెక్కల్లో చూపని నల్లడబ్బును మార్చేందుకు ఇతరులు శిల్పాచౌదరి ద్వారా వ్యాపారం నిర్వహించాలని ప్రయత్నించినట్లుగా అనుమానిస్తున్నారు.  ఏడాది కాలంలో జరిపిన ఆర్థిక లావాదేవీలపై కూపీ లాగుతున్నారు. ఇవన్నీ బయటకు వస్తే..  కేసు విచారణ ముందుకు సాగే అవకాశం ఉంది. అందుకే రెండో సారి శిల్పా చౌదరిని కస్టడీకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: Honour Killing: సొంత అక్క తల నరికిన తమ్ముడు.. అందుకు కన్నతల్లి సాయం, తల వేరు చేసి తల్లీకొడుకుల సెల్ఫీలు

సొత్తు రికవరీకే పోలీసుల ప్రయత్నం ! 

ఇందులో పెద్ద పెద్ద వారి  డబ్బులు ఉండటంతో పోలీసులు సొత్తు రికవరీపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. శిల్పాచౌదరి బాధితుల జాబితాలో సెలబ్రిటీలు, ఐపీఎస్‌లు, ఇతర బ్యూరోక్రాట్ల బంధువులు కూడా ఉన్నారు. ఆమెను శిక్షించడం కన్నా తమ డబ్బు తమకు వచ్చేలా చేయమని అడిగేవారి సంఖ‌్యే ఎక్కువగా ఉంది. అందుకే అందరి డబ్బులు ఎక్కడున్నాయన్నదానిపైనే పోలీసులు ఆమె నుంచి సమాచారం సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇంత పక్కాగా స్కెచ్ వేసిన శిల్పా.. డబ్బు మాత్రం ఎక్కడ ఉందో తేలికగా చెబుతోంది. తనను ఇతరులు మోసం చేసారని పోలీసులకు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో గుట్టు బయటకు రావడం లేదు. 

Also Read: Visakhapatnam: చిన్నారావును చితక్కొట్టారు... బాలికలతో అసభ్యప్రవర్తన రౌడీషీటర్ కు మహిళలు బడితపూజ

శిల్పా చౌదరి గుట్టు రట్టయితే బ్లాక్ మనీ రాకెట్ కూడా బయటకు వస్తుందా !?

బ్లాక్ మనీని తీసుకున్న శిల్పా చౌదరి అందర్నీ మోసం చేసింది. వారంతా ఇచ్చింది బ్లాక్  మనీ కావడంతో ఆధారాలు కూడా లేవు. సమాజంలో తాడి దన్నేవాడు ఒకడుంటే.. వాడి తలదన్నేవాడు మరొకడు ఉంటాడని అంటారు. అంటే అక్రమ దందాలతో డబ్బు సంపాదించేవారు ఒకరు ఉంటే..వారిని మోసం చేసేవాళ్లు మరి కొందరుంటారు. శిల్పా చౌదరి లాంటి వాళ్లు అలా బయటకు వస్తూనే ఉంటారు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral News: న్యాయం కోసం వెళితే.. టీచర్స్ బ్రాండ్ మద్యం బాటిళ్లు కావాలంటూ ఎస్ఐ డిమాండ్!
న్యాయం కోసం వెళితే.. టీచర్స్ బ్రాండ్ మద్యం బాటిళ్లు కావాలంటూ ఎస్ఐ డిమాండ్!
Tamil Nadu Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
Constable Dies in Road Accident: డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే కానిస్టేబుల్ మృతి- వికారాబాద్ జిల్లాలో ఘటన
డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి- వికారాబాద్ జిల్లాలో ఘటన
Palnadu Crime News: లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!
పల్నాడులో లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Strait of Hormuz: హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
Kavitha And Sharmila: జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
DOST Notification 2026: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
AP Sarpanch Elections: 5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
What Is Quantum Computer: నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
Rajinikanth : రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
Embed widget