అన్వేషించండి

Warangal Crime News: 250 కేజీల గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు, ఏపీ నుంచి అక్రమంగా!

Telangana News | ఏపీ నుంచి తెలంగాణకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 250 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Interstate Ganja Smuggling Gang Arrested in Warangal | వరంగల్: వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఐదుగురు సభ్యుల గంజాయి రవాణా ముఠా గుట్టు రట్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఏకంగా 256 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం (ఆగస్టు 3న) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంజాయి గ్యాంగ్‌కు సంబంధించిన వివరాలను సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. పట్టుకున్న గంజాయి విలువ 64 లక్షలు ఉంటుందన్నారు. గంజాయి ముఠా వద్ద నుంచి రెండు కార్లు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. 

నర్సంపేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి నర్సంపేట స్టేషన్ పరిధిలోని కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో గంజాయి రవాణా ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న క్రమంలో దొరికిపోయారని వెల్లడించారు. అరెస్ట్ అయిన నిందితులు బానోతు బాబు కుమారస్వామి, నస్కరి కుమారస్వామిలు కారు డ్రైవర్‌ గా చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన వీరికి మహబూబాబాద్ జిల్లాకు చెందిన జలెందర్, భూపాల్‌పల్లి జిల్లాకు చెందిన అంగోతు రాజేందర్, తూర్పు గోదావరికి చెందిన ముకుంద్ లతో పరిచయం ఏర్పడింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు, అక్రమ సంపాదన ఆలోచనకు దారి తీసిందని సీపీ తెలిపారు. 

Warangal Crime News: 250 కేజీల గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు, ఏపీ నుంచి అక్రమంగా!

ఆంధ్రప్రదేశ్‌లోని డొంకరాయి పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు రహస్యంగా తరలించి గంజాయిని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు విచారణలో నిందితులు చెప్పారు. డొంకరాయి గ్రామంలో 256 కిలోల గంజాయిని కోనుగోలు రెండుకిలోల చొప్పున 128 ప్యాకెట్ల లో ప్యాక్ చేసి కారులో ఎవరికి అనుమానం రాకుండా డొంకరాయి నుండి భద్రాచలం, మహబూబాబాద్ మీదుగా నర్సంపేటకి  నిందితులు కారులో గంజాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో  పోలీసులకు అందిన పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ నర్సంపేట  పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్ చేసినట్లు అంబర్ కిషోర్ ఝ తెలిపారు. బానోతూ బాబు కుమారస్వామి, నస్కరి కుమారస్వామిల అరెస్ట్ చేయగా, జలెందర్, అంగోతు రాజేందర్, ముకుంద్ లు ముగ్గురు ప్రస్తుతం పరారీలో ఉన్నారని సిపి అంబర్ కిషోర్ ఝ వెల్లడించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ramana Deekshitulu: తిరుమల లడ్డూ వివాదం - ఐదేళ్లు మహా పాపం జరిగిందని రమణ దీక్షితులు ఆవేదన
తిరుమల లడ్డూ వివాదం - ఐదేళ్లు మహా పాపం జరిగిందని రమణ దీక్షితులు ఆవేదన
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
IND vs BAN : తొలి ఇన్నింగ్స్‌ 376 స్కోర్ తో ముగించిన భారత్,  తొలి ఓవర్ లోనే షాకిచ్చిన జస్ప్రీత్ బుమ్రా
తొలి ఇన్నింగ్స్‌ 376 స్కోర్ తో ముగించిన భారత్, తొలి ఓవర్ లోనే షాకిచ్చిన జస్ప్రీత్ బుమ్రా
Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramana Deekshitulu: తిరుమల లడ్డూ వివాదం - ఐదేళ్లు మహా పాపం జరిగిందని రమణ దీక్షితులు ఆవేదన
తిరుమల లడ్డూ వివాదం - ఐదేళ్లు మహా పాపం జరిగిందని రమణ దీక్షితులు ఆవేదన
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
IND vs BAN : తొలి ఇన్నింగ్స్‌ 376 స్కోర్ తో ముగించిన భారత్,  తొలి ఓవర్ లోనే షాకిచ్చిన జస్ప్రీత్ బుమ్రా
తొలి ఇన్నింగ్స్‌ 376 స్కోర్ తో ముగించిన భారత్, తొలి ఓవర్ లోనే షాకిచ్చిన జస్ప్రీత్ బుమ్రా
Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Samantha: గుడ్ న్యూస్ చెప్పిన సమంత... ఫుల్ ఖుషీగా సామ్ ఫ్యాన్స్
గుడ్ న్యూస్ చెప్పిన సమంత... ఫుల్ ఖుషీగా సామ్ ఫ్యాన్స్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
Ghaati Movie: ‘ఘాటీ’ షూటింగ్ మళ్లీ షురూ చేసిన అనుష్క శెట్టి... హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల షూట్
‘ఘాటీ’ షూటింగ్ మళ్లీ షురూ చేసిన అనుష్క శెట్టి... హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల షూట్
Embed widget