అన్వేషించండి

Vizianagaram Crime News : ఇలాంటి తల్లులు కూడా ఉంటారు - విజయనగరంలో ఆ పాప బయటపడింది !

విజయనగరంలో కుమార్తెను వ్యభిచార రొంపిలోకి దంపాలని ప్రయత్నిస్తున్న తల్లి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

 

Vizianagaram Crime News :   తల్లికి బిడ్డే లోకం. బిడ్డ కంట్లో నీళ్లు కనపడితే.. తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. బిడ్డకు ఏ చిన్న బాధ కలగకుండా కంటికి రెప్పలా కాచుకుంటుంది. అందుకే ఈ సృష్టిలో అమ్మ స్థానం అన్నింటికన్నా గొప్పది. అలాంటి ఓ తల్లి.. ఏకంగా బిడ్డను వక్రమార్గంలోకి నెట్టాలని చూసింది. కాదంటే.. చిత్రహింసలు పెట్టింది. అమ్మతనానికే మాయనిమచ్చ తెచ్చే ఈ అమానుష ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది.                                               

విజయనగరం జిల్లా కేంద్రం తోటపాలెం సమీపంలో ఓ వివాహిత.. పదో తరగతి చదువుతున్న కుమార్తె తో కలసి నివాసం ఉంటోంది. కుమార్తెతో వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నిస్తోంది. తన కుమార్తెను కూడా పలువురి వద్దకు వెళ్లాలని కొన్నాళ్లుగా ఆమె బలవంతం చేస్తోంది. తనకు అటువంటి పని ఇష్టం లేదని కుమార్తె ఎంత నచ్చజెప్పినా వినలేదు. చిత్రహింసలు పెట్టేది. నిద్రమాత్రలు ఇచ్చేది. నయానోభయానో తన దారికి తెచ్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. ఫలానా వారి వద్దకు వెళ్తే సినిమాలో అవకాశాలిప్పిస్తారని.. మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రలోభపెట్టింది. తల్లి పెడుతున్న చిత్రహింసలు భరించలేక ఆ బాలిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వారి నుంచి స్పందన లేకపోవడంతో, తెలిసిన వారి ద్వారా మీడియాను ఆశ్రయించింది. 

వెంటనే వారు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ కేసలి అప్పారావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచనలతో బాలల సంక్షేమ సమితి సభ్యులు అక్కడకు చేరుకుని.. బాలికను ఆ చెర నుంచి తప్పించారు. తొలుత విజయనగరంలోని స్వధార్‌ హోమ్‌కు తరలించారు. అక్కడ బాలల సంక్షేమ సమితి సభ్యులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం విశాఖలోని సంరక్షణ గృహానికి తరలించాలని ఆదేశించారు. దీంతో చైల్డ్‌లైన్‌, బాలల సంరక్షణ సిబ్బంది బాలికను విశాఖకు తరలించారు.                                     

సదరు మహిళ మొదటి భర్త గతంలోనే ఆమెను వదిలి వెళ్లిపోయాడు. దీంతో  రెండో పెళ్లి చేసుకుంది. కొద్ది రోజుల తర్వాత అతను చనిపోయాడు. ప్రస్తుతం మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. మరి కొంత మందితో కూడా ఆమెకు వివాహేతర సంబంధాలు పెట్టుకుందని స్థానికులు చెబుతున్నారు.                     

ఈ ఘటనపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ కేసలి అప్పారావు  తల్లిదండ్రులు పిల్లల పట్ల ఇంత క్రూరంగా వ్యవహరించకూడదన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాలలు ఎక్కడైనా ఈ తరహా ఇబ్బందులకు గురైతే, ధైర్యంగా సమీపంలోని బాలలతో పని చేస్తున్న సంస్థలను సంప్రదించి రక్షణ పొందాలని సూచించారు. వారికి అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Farmhouse Drug Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget