అన్వేషించండి

Visakhapatnam Land Scam: ఎమ్మెల్యే కుమారుడినే బురిడీ కొట్టించేందుకు యత్నం... కోట్ల విలువైన భూమి అమ్మేందుకు కుట్ర... పత్రికా ప్రకటన బట్టబయలు

రూ.కోట్లు విలువ చేసే భూమిని నకిలీ డాక్యుమెంట్లతో ఎమ్మెల్యే కుమారుడికి అమ్మేందుకు ప్రయత్నించారు కేటుగాళ్లు. చివరికి పత్రికా ప్రకటనతో గుట్టురట్టైంది.

కోట్లు విలువ చేసే భూమిని అడ్డదారిలో కొట్టేద్దామనుకున్న కేటుగాళ్ల వ్యూహాన్ని పత్రికా ప్రకటన బట్టబయలు చేసింది. విశాఖ నగరంలో కోట్లు విలువ చేసే భూమిని అడ్డదారిలో అమ్మడానికి కుట్రపన్నారు. రిజిస్ట్రేషన్‌ వరకూ వెళ్లిన వ్యవహారం పత్రికా ప్రకటనతో నిలిచిపోయింది. ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులను విచారణకు ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు విషయాలను సోమవారం విశాఖ సీపీ కార్యాలయంలో సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా వెల్లడించారు.

తప్పుడు పత్రాలతో 

అమెరికాలో ఉంటున్న తుమ్మల కృష్ణచౌదరికి విశాఖ కొమ్మాదిలో 12.26 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించి అమ్మేందుకు విశాఖకు చెందిన జరజాపు శ్రీనివాసరావు, తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన వి.జయసూర్యలను ప్రయత్నించారు. వీరద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణచౌదరి భార్య లక్ష్మీసూర్య ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నెల ఒకటో తేదీన కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో వ్యక్తి ఆనందరాజ్‌ అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంటున్నారు. ఇంటర్‌పోల్‌ సాయంతో అతన్ని అరెస్టు చేస్తామని సీపీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. కృష్ణచౌదరిలా కొనుగోలుదారులతో మాట్లాడి మోసం చేసేందుకు ప్రయత్నించినందుకు అతనిపై వారెంట్‌ జారీ చేశామన్నారు. 

ఎమ్మెల్యే కుమారుడికి అమ్మేందుకు

శ్రీనివాసరావుకు తుమ్మల కృష్ణచౌదరితో పదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. కొమ్మాదిలో ఉన్న 12.26 ఎకరాల భూమి అత్యంత విలువైనది కావడంతో ఎలాగైనా విక్రయించి డబ్బు సంపాదించాలనుకున్నాడు శ్రీనివాసరావు. ఈ విషయాన్ని జయసూర్యకు చెప్పి విశాఖ జిల్లా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు కుమారుడు, కశ్యప్‌ డెవలపర్స్‌కు చెందిన సుకుమార్‌వర్మకు ఈ భూమిని అమ్మేందుకు ప్లాన్ చేశాడు. న్యూయార్క్‌లో ఉన్న ఆనందరాజ్‌తో కృష్ణచౌదరిలా మాట్లాడించారు. అనంతరం అడ్వాన్స్‌గా రూ. కోటి తీసుకున్నారు. రిజిస్ట్రేషన్‌కు మాత్రం జాప్యం చేశారు. రిజిస్ట్రేషన్‌ చేయాలని సుకుమార్‌వర్మ డిమాండ్‌ చేయగా సంతకాలు, ఇతర పత్రాలు ఫోర్జరీ చేసి తమ పేరున తప్పుడు జీపీఏ సృష్టించారు. రిజిస్ట్రేషన్‌ చేయించే ముందు పత్రికా ప్రకటన ఇస్తే మంచిదని భావించిన ఎమ్మెల్యే కుటుంబం పత్రికలో ప్రకటన ఇచ్చారు. 

Also Read: Public Servent Cases : రాజకీయ నేతల అవినీతికి రక్షణ ? "పబ్లిక్ సర్వెంట్‌" కేసులపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు అందుకేనా..?

నకిలీ జీపీఏతో

ఈ ప్రకటన కృష్ణచౌదరి భార్య లక్ష్మీ సూర్యప్రసన్న దృష్టికి వచ్చింది. దీనిపై వెంటనే స్పందించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ జీపీఏ ద్వారా డాక్యుమెంటు సృష్టించి రిజిస్ట్రేషన్‌ను చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఆ భూమిని రూ.18.75 కోట్లకు ఎమ్మెల్యే కుటుంబీకులకు అమ్మేందుకు ఒప్పందం కుదిరిందని పోలీసులు తెలిపారు. అడ్వాన్స్ గా రూ.5 కోట్లు వరకు ఇచ్చారు. ఫోర్జరీ పత్రాలతో ప్రజల ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్న ఘటనలు తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీపీ కోరారు. ఏ కొంచెం అనుమానం వచ్చినా వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు. 

 

Also Read: Viral Video: ఇసుక అక్రమ రవాణా వ్యవహారం... మంత్రి ఫోన్ సంభాషణ వైరల్!

 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget