అన్వేషించండి

Human Trafficking Case: కంబోడియా సైబర్ నేరగాళ్ల నుంచి 60 మందికి విముక్తి - హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో విశాఖ పోలీసుల దర్యాప్తు ముమ్మరం

Visakha News: కంబోడియాలో సైబర్ నేరగాళ్ల నుంచి 60 మందికి విశాఖ పోలీసులు విముక్తి కల్పించారు. వీరు శుక్రవారం సాయంత్రానికి విశాఖ ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు.

Indian Nationals Rescued From Cambodia: హ్యూమన్ ట్రాఫికింగ్‌ కేసుకు (Human Trafficking Case) సంబంధించి విశాఖ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కంబోడియా (Cambodia) సైబర్ నేరాగళ్ల నుంచి 60 మందికి విముక్తి కల్పించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ వలలో జిల్లాకు చెందిన 150 మంది చిక్కుకున్నారు. కంబోడియా నుంచి బయల్దేరిన 60 మంది శుక్రవారం సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారని సీపీ రవిశంకర్ తెలిపారు. వీరి రాక కోసం బాధిత కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. కంబోడియాలో సైబర్ నేరగాళ్ల చేతిలో 5 వేల మంది భారతీయులు చిక్కుకున్నారని చెప్పారు. కాగా, విదేశాల్లో ఉద్యోగాల ఆశ చూపి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల ముఠాను ఇటీవల విశాఖ (Visakha) పోలీసులు అరెస్ట్ చేశారు. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఏపీ (AP), పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ దేశాలకు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. నిందితులు టాస్క్ గేమ్స్, ఫెడెక్స్ పేరిట సైబర్ నేరాలు చేయడంలో అమాయకులను వాడుకుంటున్నట్లు వెల్లడించారు. డేటా ఎంట్రీ పేరుతో ఉద్యోగాలని చెప్పి ఆన్ లైన్ స్కాంలు చేయడంలో వీరికి ట్రైనింగ్ ఇస్తారని.. మాట వినకుంటే చిత్రహింసలు పెడతారని అన్నారు. దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం కలిగించగా.. పోలీసులు బాధితులను రక్షించి స్వగ్రామాలకు చేరేందుకు చర్యలు చేపట్టారు.

మరోవైపు, ఈ కేసును విచారించేందుకు విశాఖ సీపీ ఆధ్వర్యంలో 20 మందితో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటైంది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్ల దర్యాప్తు బృందం హ్యుమన్ ట్రాఫికింగ్ కేసుపై లోతుగా విచారణ చేపట్టింది.

అసలేం జరిగిందంటే.?

విశాఖ గాజువాక ప్రాంతానికి చెందిన రాజేష్ అనే ఏజెంట్ 2013 నుంచి 2019 వరకూ గల్ఫ్ దేశాల్లో ఫైర్ సేఫ్టీ అండ్ ప్రికాషన్ మేనేజర్ గా పని చేశాడు. విశాఖలోనే ఉంటూ గల్ఫ్ దేశాలకు ఫైర్ సేఫ్టీ ఉద్యోగాలకు మానవ వనరులను సరఫరా చేసేవాడు. గతేడాది మార్చిలో కాంబోడియా నుంచి సంతోష్ అనే వ్యక్తి ఫోన్ చేసి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్స్ గా పని చేసేందుకు కొంతమందిని పంపాలని.. కమీషన్ ఇస్తానని ఆశ చూపాడు. ఇందుకు అంగీకరించిన రాజేష్ సోషల్ మీడియా ద్వారా డేటా ఎంట్రీ ఉద్యోగాలకు ప్రకటన ఇవ్వగా.. నిజమని నమ్మిన కొందరు నిరుద్యోగులు రూ.1.50 లక్షల వంతున అతనికి కట్టారు. రాజేష్ వారిని కంబోడియా ఏజెంట్‌కు అప్పగించాడు. ఇలా పలు దఫాలుగా వివిధ ఏజెంట్ల 150 మంది నిరుద్యోగులను కంబోడియాకు పంపించాడు. 

ఆన్ లైన్ మోసాలపై శిక్షణ

ఉద్యోగాలని నమ్మి అక్కడకు వెళ్లిన వారికి ఆన్ లైన్ స్కామ్స్, సైబర్ నేరాలు ఎలా చేయాలో ఈ ముఠా శిక్షణ ఇచ్చేది. ఫెడెక్స్, టాస్క్ గేమ్స్, ఆన్ లైన్ మోసాలు చేయాలని నిరుద్యోగులను బలంవంతం చేసింది. మాట వినకుంటే వారిపై చిత్ర హింసలకు పాల్పడేది. వారిని రూంలో బంధించి భోజనం కూడా పెట్టకుండా వేధించేది. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకున్న విశాఖ వాసి ఇక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురు నిందితుల ముఠాను అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో బాధితులను గుర్తించారు. ఈ మేరకు విశాఖ సీపీ రవిశంకర్ వివరాలు వెల్లడించారు. 

ఇప్పటికే కేసు గురించి కంబోడియా ఎంబసీ సిబ్బందికి తెలిపినట్లు సీపీ చెప్పారు. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, తుని, పలాస, కలకత్తా నుంచి నిరుద్యోగ యువత వీరి ఉచ్చులో చిక్కుకున్నారని అన్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తునకు కంబోడియాలోని భారత ఎంబసీ సహకారం తీసుకుంటామన్న సీపీ.. ఈ ముఠా వెనుక ఎవరున్నారో ఆరా తీస్తున్నట్లు చెప్పారు. విదేశాల్లో ఉద్యోగం అనగానే నిరుద్యోగులు ఆలోచించాలని.. ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Also Read: Chandra Babu News: టీడీపీ బాధ్యతలు లోకేష్‌కు అప్పగించాలి- చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన రోజే జరగాలి: బుద్దా వెంకన్న

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget