అన్వేషించండి

Viral News: పుట్టగొడుగులు తిని ముగ్గురు మృతి, సినిమాను తలపించే క్రైం

Viral News: ఆస్ట్రేలియాలో విక్టోరియా రాష్ట్రంలో గత జులై 29న మూడు అనుమానాస్పద మరణాలు సంభవించాయి. అడవి పుట్టగొడుగులు తిని ముగ్గురు మృత్యువాత పడ్డారు.

Viral News: ఆస్ట్రేలియాలో విక్టోరియా రాష్ట్రంలో గత జులై 29న మూడు అనుమానాస్పద మరణాలు సంభవించాయి. అడవి పుట్టగొడుగులు తిని ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ కేసు స్థానికంగా కలకలం రేపింది. ఈ మేరకు బుధవారం ఆస్ట్రేలియన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో వారికి ఎటువంటి క్లూ దొరకడం లేదు. కేసు చిక్కుముడి వీడడం లేదు.

కానీ పోలీసులు మాత్రం ముగ్గురు వ్యక్తులు ఎలా చనిపోయారు? ఇద్దరు ఆస్పత్రిలో ఉండడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. అదే రోజు ఇంట్లో వంట చేసిన మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే ఆమె నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తలెత్తింది. తరువాత ఆమెపై ఎటువంటి అభియోగాలు నమోదు చేయకుండా విడిచిపెట్టారు. అయితే ఆమె ప్రవర్తనపై మాత్రం పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

అసలేం జరిగిందంటే
విక్టోరియా రాష్ట్రం లియోంగథా పట్టణానికి చెందిన ఓ మహిళ జులై 29న తన 70 ఏళ్ల అత్తామామలు గెయిల్, డాన్ ప్యాటర్‌సన్‌, భర్త ఇయాన్ విల్కిన్సన్, పిన్ని వరుస అయ్యే హీతర్ విల్కిన్సన్, పాస్టర్‌కు విందుకు పిలిచింది.  రకరకాల వంటలతో పాటు పుట్టగొడుగులతో స్పెషల్ వండి వడ్డించింది. ఆ ఆహారం తిన్న నలుగురిలో మహిళకు చెందిన అత్తామామలు గెయిల్, డాన్ ప్యాటర్‌సన్‌, వారి బంధువు హీతర్ విల్కిన్సన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. భర్త ఇయాన్ విల్కిన్సన్, బాప్టిస్ట్ పాస్టర్ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. 

స్థానికంగా కలకలం రేపిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళను అదుపులోకి విచారణ చేశారు. అయితే అసలేం జరిగిందో తనకు తెలియదని మహిళ సమాధానం ఇచ్చింది.  తాను ఏం చేయలేదని, తన అత్తామామలు చనిపోయినందుకు తనకు చాలా బాధగా ఉందని చెప్పారు. అతిథులకు ఎలాంటి భోజనం పెట్టారు? పుట్టగొడుగులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పడానికి మహిళ నిరాకరించింది. 

కేసు గురించి విక్టోరియా పోలీస్ ఇన్‌స్పెక్టర్ డీన్ థామస్ మాట్లాడుతూ.. చనిపోయిన వారు ఏ రకమైన పుట్టగొడుగులను తిన్నారో స్పష్టంగా తెలియదన్నారు. వారి మరణం వెనుక కుట్ర జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవాలు తెలియడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ప్రస్తుతం సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నామని వీలైనంత త్వరగా కేసును ఛేదిస్తామన్నారు.

అనుమానిత మహిళ తన భర్త నుంచి విడిపోయిందని, అయితే వారి మధ్య స్నేహం కొనసాగతోందని థామస్ చెప్పారు. మధ్యాహ్న భోజనం సమయంలో ఆమె పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారని, వారు ఆ భోజనం తినలేదు. దీనిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, మహిళ ఎందుకు ఆహారం తినలేదనే కోణంలో దర్యాప్తు సాగుతోందన్నారు. గత శనివారం పోలీసులు మహిళ ఇంట్లో సోదాలు జరిపారు.  పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించేందుకు ఆహార నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు పోలీసులు చెప్పారు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
KTR: కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
Rakul Preet Singh : సమంత డ్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ వేసుకుందా? IIFA అవార్డ్స్​లో ఆమెని చూశారా?
సమంత డ్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ వేసుకుందా? IIFA అవార్డ్స్​లో ఆమెని చూశారా?
Second Moon: భూమికి నేటి నుంచి రెండో చంద్రోదయం, 56 రోజుల పాటు అతిథిగా ఉండనున్న మరో చందమామ
భూమికి నేటి నుంచి రెండో చంద్రోదయం, 56 రోజుల పాటు అతిథిగా ఉండనున్న మరో చందమామ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
KTR: కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
Rakul Preet Singh : సమంత డ్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ వేసుకుందా? IIFA అవార్డ్స్​లో ఆమెని చూశారా?
సమంత డ్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ వేసుకుందా? IIFA అవార్డ్స్​లో ఆమెని చూశారా?
Second Moon: భూమికి నేటి నుంచి రెండో చంద్రోదయం, 56 రోజుల పాటు అతిథిగా ఉండనున్న మరో చందమామ
భూమికి నేటి నుంచి రెండో చంద్రోదయం, 56 రోజుల పాటు అతిథిగా ఉండనున్న మరో చందమామ
Ashu Reddy : కాఫీ కలర్ డ్రెస్​లో కలర్​ఫుల్​గా ముస్తాబైన అషూ రెడ్డి.. Just You and I అంటోన్న హాట్ బ్యూటీ
కాఫీ కలర్ డ్రెస్​లో కలర్​ఫుల్​గా ముస్తాబైన అషూ రెడ్డి.. Just You and I అంటోన్న హాట్ బ్యూటీ
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Viral News: ఆ బాడీగార్డ్‌కు సీఈఓలను మించిన వేతనం- కింగ్‌ కోహ్లీ సెక్యూరిటీ గార్డ్ గురించి ఆసక్తికర విషయాలు
ఆ బాడీగార్డ్‌కు సీఈఓలను మించిన వేతనం- కింగ్‌ కోహ్లీ సెక్యూరిటీ గార్డ్ గురించి ఆసక్తికర విషయాలు
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
Embed widget