అన్వేషించండి

Hyderabad Accident: అతివేగమే ఆ ఇద్దరి యువకుల ప్రాణాలు తీసింది..!

 Hyderabad Accident: ఎలాంటి బెరుకు, భయం లేకుండా అతివేగంతో ద్విచక్ర వాహనంపై వెళ్లి.. బండిని అదుపు చేయలేక మెట్రో పిల్లర్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

Hyderabad Accident: బంధువుల ఇంటికని కర్ణాటక నుంచి హైదరాబాద్ కు వచ్చారు. అలా భాగ్య నగర అందాలను చూసొద్దామని బండిపై బయలు దేరారు ఓ ఇద్దరు యువకులు. ఎలాంటి భయం లేకుండా అతి వేగంలతో వాహనాన్ని నడిపారు. అదే వారి పాలిట శాపంగా మారింది. వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారు ఇక్కడ ప్రాణాలు కోల్పోయేలా చేసింది. అతివేగం అంత మంచిది కాదని ట్రాఫిక్ పోలీసులు ఎంతగా చెప్తున్నా వినరు. ఇలా ప్రాణాలు పోగొట్టుకొని వాళ్లని నమ్ముకొని బతుకుతున్న వాళ్లకు నరకం చూపిస్తారు. ఈ ఘటనలోనూ ఇదే జరిగింది. 

పాతికేళ్లు కూడా నిండకముందే గాల్లోకి ప్రాణాలు.. 

పంజాగుట్ట ఎస్సై ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటకకు చెందిన 23 ఏళ్ల మోహిన్, 22 సంవత్సరాల ఒబేద్ ఎర్రమంజిల్ నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో సోమాజిగూడ హనుమాన్ దేవాలయం ఎదురుగా ఉన్న మెట్రో పిల్లర్ ను ఢీకొట్టారు. ఒక్కసారిగా కిందపడిపోయిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడచారు. అయితే విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.  

బంధువులు వస్తేనే పూర్తి వివరాలు..

అయితే మోహిన్, ఒబేద్ లు కర్ణాటక నుంచి హైదరాబాద్ లో ఉన్న బందువుల ఇంటికి వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుల బంధువులకు సమాచారం అందించామని.. వారు వస్తే తప్పు వీరికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియవని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే వీరి ప్రమాదానికి కారణం అని పోలీసులు గుర్తించారు. అతివేగం వద్దని ఎంత చెప్తున్నా చాలా మంది యువకులు వినకుండా వాళ్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని పోలీసులు వివరించారు. 

పిల్లల చేతికి బండిచ్చేటప్పుడే ఆలోచించండి..

చేతికి అందివచ్చిన పిల్లలు చనిపోతే.. ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో వర్ణించలేమని అన్నారు. పిల్లలకు బండి ఇచ్చేముందు తల్లిదండ్రులే గట్టిగా చెప్పాలని.. రోడ్డుపై నియమ, నిబంధనలు పాటిస్తేనే బండి ఇవ్వాలని వివరించారు. అలాంటప్పుడే ఇలాంటి ప్రమాదాలను అరికట్టగలమన్నారు. అంతే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్, సరైన పత్రాలు లేని వారికి ద్విచక్ర వాహనం ఇవ్వవద్దనని.. ఇవన్నీ ఉన్నా వారి తీరునే బట్టే బైకులు చేతికి ఇవ్వాలని చెప్పారు. మద్యం సేవించి ఉన్నప్పుడు కూడా వాహనాలను నడపనీయకూడదని స్పష్టం చేశారు. అప్పుడే మీ బిడ్డలను మీరు కాపాడుకోగల్గుతారని.. రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గించగల్గుతారని పోలీసులు వివరించారు. 

టాప్ హెడ్ లైన్స్

DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Jangaon Crime News: నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
కాగజ్‌నగర్ గురుకుల స్కూల్లో దారుణం.. టెన్త్ క్లాస్ స్టూడెంట్ కాళ్లు, చేతులు కట్టేసి క్లాస్‌మేట్స్ దాష్టీకం
గురుకుల స్కూల్లో దారుణం.. టెన్త్ క్లాస్ స్టూడెంట్ కాళ్లు, చేతులు కట్టేసి క్లాస్‌మేట్స్ దాష్టీకం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Jangaon Crime News: నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Embed widget