By: ABP Desam | Updated at : 24 May 2022 09:27 AM (IST)
పీకలదాకా తాగి పోలీసులు వీరంగం
తిరుపతి : ప్రజలకు రక్షణ కల్పించేందుకు, సమాజంలో చెడుని నిర్మూలించేందుకు పోలీసులు తమ విధులను నిర్వర్తిస్తుంటారు. అందుకు వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. ఎక్కడైనా అపాయం కానీ, గొడవలు గానీ జరిగితే ముందుగా పోలీసులకు ఫోన్ చేస్తే ఆ సమస్య పరిష్కరం అవుతుందని ప్రజలు నమ్ముతారు. కానీ చెడును అరికట్టాల్సిన పోలీసులే పీకలదాకా మద్యం సేవించి వీధి గూండాలుగా మారి ప్రజలను భయాందోళనకు గురి చేసిన ఘటన తిరుపతి జిల్లాలో ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఆ వివరాలిలా ఉన్నాయి.. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం పరిధిలో కళ్యాణ డ్యాం వద్ద గల పోలీసు ట్రైనింగ్ సెంటర్లో పోలీసు సిబ్బందికి వివిధ అంశాలపై ట్రైనింగ్ ఇస్తోంటి పోలీసు శాఖ. ఈ ట్రైనింగ్ సెంటర్ జూనియర్ అసిస్టెంట్ సిద్దారెడ్డి, సీనియర్ అసిస్టెంట్లు, చిట్టిబాబు, బాలాజీ, అడ్మిన్ మధుబాబు, టైపిస్టు గురుస్వామి, ఏఆర్ ఎస్ఐ శేషాద్రి, ఫార్మాసిస్ట్ బాలారాజు, అటెండర్ కోటేశ్వరరాజులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు చాలాకాలం నుంచి ట్రైనింగ్ సెంటర్ లో విధులు నిర్వర్తిస్తుండటంతో స్నేహితులు అయ్యారు. ఈక్రమంలోనే ఫార్మాసిస్ట్ గా పనిచేసే బాలరాజు తన కుమారుడికి ఐఐటీలో సీటు రావడంతో తమ స్నేహితులకు వీకెండ్ పార్టి ఇవ్వాలని అనుకున్నాడు.
ఐఐటీలో సీటు వచ్చిందని పార్టీ..
విధులు ముగించుకున్న అనంతరం బాలరాజు నివాసంలో పార్టి చేసుకోవాలి అనుకున్నారు. మద్యం, మాంసం వివిధ రకాల ఆహార పదార్ధాలను సమకూర్చుకున్నారు. దాదాపు 8 మంది తిరుపతిలో బాలరాజు నివాసం ఉండే ఉపాధ్యాయనగర్ కు వెళ్లి పార్టీ చేసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమోగానీ అటెండర్ కోటేశ్వరరాజు, సిద్దారెడ్డిల మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. వీరిద్దరిని ఆపేందుకు తోటివారు ప్రయత్నం చేసినా అదుపు చేయలేకపోయారు. బాలరాజు ఇంటి నుండి కోటేశ్వరరాజు మరో ముగ్గురిని తీసుకుని బయటకు వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న సిద్దారెడ్డి,పెట్రోల్ బంక్ వద్ద కోటేశ్వరరాజును అడ్డగించి గొడవకు దిగ్గాడు.
డయల్ 100కి కాల్ చేసిన స్థానికుడు
పోలీసులు అయిన వీరిద్దరూ గొడవ పడుతూ గెట్టిగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి డయల్ 100 కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అలిపిరి పోలీసులు చేరుకోవడంతో ఆరు మంది పరారయ్యారు. తాము బాధ్యత గల పోలీసులమని మరిచి గొడవ పడితున్న సిద్దారెడ్డి, కోటేశ్వరరాజుని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ వెంకటరామిరెడ్డికి తెలియజేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ప్రిన్సిపాల్ వెంకటరామిరెడ్డి ఎనిమిది మందికి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. వీధిలో కేకలు వేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేసిన కోటేశ్వరరావు, సిద్దారెడ్డిపై కేసు నమోదు చేయాలని అలిపరి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వీరిద్దరిపై కేసు నమోదు చేసిన అలిపిరి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో న్యూసెన్స్ క్రియేట్ చేసిన సిద్ధారెడ్డి, కోటేశ్వర రాజులపై పోలీసు శాఖ శాఖాపరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Also Read: YS Jagan Davos Tour: దావోస్లో ఏపీ ధగధగలు, హై ఎండ్ టెక్నాలజీ హబ్గా విశాఖ - రెండోరోజు హైలైట్స్ ఇవే
Also Read: KTR Jagan Meet: దావోస్లో అరుదైన కలయిక, ఒకే ఫ్రేములో డైనమిక్ లీడర్స్
Jagityal Man Kindnapped: ముంబైలో జగిత్యాల జిల్లా వాసి కిడ్నాప్ - కాళ్లు, చేతులు కట్టేసిన ఫొటోతో రూ.15 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్స్
Chittoor News : మేయర్ దంపతుల హత్య కేసులో మరో ట్విస్ట్, విచారణ నుంచి తప్పుకున్న ఏపీపీ
Tirupati Police Thiefs : దోపిడీ చేసిన పోలీసులు - సీఐ, ముగ్గురు ఎస్సైలపై వేటు ! వీళ్లనేమనాలి ?
Crime News: తోడు దొంగలకు ఆ తండ్రీకొడుకులే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్
Sri Satyasai District Auto Accident: ఆటో ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి- బాధితులకు రూ. 10 లక్షల పరిహారం- రూ. 50 లక్షలు ఇవ్వాలని టీడీపీ డిమాండ్
Maharashtra News: అసలైన శివసైనికుడు సీఎం అయ్యాడని, ప్రజలు హ్యాపీగా ఉన్నారు-సీఎం షిండే కామెంట్స్
Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!
PM Modi Tour: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని టూర్ షెడ్యూల్ ఇదే- భారీ ఏర్పాట్లు చేసిన బీజేపీ
TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల