అన్వేషించండి

Jagityal Friends Death: పుట్టింటికి వచ్చిన ఇద్దరు యువతులు.. చివరికి చెరువులో మూడు శవాలు, ఏం జరిగిందంటే..

ముగ్గురికి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే తమ కుమార్తెలు బలవన్మరణానికి పాల్పడ్డారని వివాహితులైన యువతుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జగిత్యాల జిల్లాలో తీవ్రమైన విషాద ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు యువతులు దారుణమైన స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. వారు ముగ్గురూ దగ్గరి బంధువులు.. చిన్నప్పటి నుంచి స్నేహితులు.. కలిసే ఆడుకుంటూ కలిసే చదువుకున్నారు. చివరికి చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు కొద్ది రోజుల క్రితమే వారిలో ఇద్దరి రోజుల వ్యవధిలో వివాహం అయింది. ఇంతలోనే ఈ ఘటన జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది.

జగిత్యాల పట్టణం ఉప్పరిపేటకు చెందిన ఎక్కలదేవి వందన(16), ఎక్కలదేవి గంగాజల(19), సమీపంలోని గాంధీనగర్‌కు చెందిన ఎక్కలదేవి మల్లిక(19) కజిన్స్. చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు కూడా. వారిలో గంగాజల, మల్లికలు ఇంటర్‌ విద్యను కంప్లీట్ చేశారు. మూడో అమ్మాయి వందన ప్రస్తుతం ఇంటర్‌ ఫస్టియర్ చదువుతోంది. వారిలో గంగాజలకు ఆగస్టు 23న జగిత్యాల మండలం నర్సింగాపూర్‌ అనే గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. మరో యువతి మల్లిక వివాహం కూడా అదే నెల 26న కొడిమ్యాల మండలం డబ్బుతిమ్మయ్య పల్లి గ్రామానికి చెందిన అదరవేని రాజు అనే వ్యక్తితో జరిగింది.

Also Read: Merupu Murali Trailer: ‘మెరుపు మురళి’ ట్రైలర్.. విలేజ్ సూపర్ హీరోగా టొవినో థామస్.. ఇతడో అల్లరి ‘పిడుగు’

పెళ్లి జరిగిన ఈ ఇద్దరు యువతులు మెట్టింటి నుంచి వారం క్రితమే పుట్టింటికి వచ్చారు. బుధవారం మధ్యాహ్నం సమయంలో ముగ్గురూ వేర్వేరు కారణాలు చెప్పి ఇళ్లలోంచి బయటికి వెళ్లారు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ముగ్గురు కుటుంబాల వారు కలిసి చుట్టుపక్కల వెతికారు. అయినా, ఆచూకీ లభ్యం కాలేదు. 

Also Read: Sumanth's Malli Modalaindi Trailer: దొంగ సచ్చినోడా... ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావ్ రా!

ఇంతలో గురువారం ఉదయం 11 గంటలకు ధర్మ సముద్రం జలాశయంలో మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వారు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కుటుంబ సభ్యులు గుర్తించారు. పోలీసులు కూాడా ఇదే అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. యువతులు ముగ్గురికి చిన్నతనం నుంచి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే తమ కుమార్తెలు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని యువతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు వారిద్దరితో కలిసి ఆత్మహత్య చేసుకుందని వందన తండ్రి ఆవేదన చెందాడు. పోలీసులు ఈ వ్యవహారంలో విచారణ కోసం వారి సెల్‌ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్ డేటాను, మెసేజ్‌లను పరిశీలిస్తున్నారు. అయితే, వివాహం కారణంగా ఒకరికొకరం దూరమయ్యామనే బాధతోనే వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు చెబుతున్నారు.

Also Read: Family Drama Movie Review 'ఫ్యామిలీ డ్రామా' సమీక్ష: థ్రిల్లింత కొంత... సుహాస్ నటన కొండంత!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bihar Election 2025:  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
Advertisement

వీడియోలు

Ghazala Hashmi New Lieutenant Governor | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలి ముస్లిం మహిళ | ABP Desam
Zohran Mamdani won Newyork Mayor Election |  న్యూయార్క్ మేయర్ గా గెలిచిన జోహ్రాన్ మమ్ దానీ | ABP Desam
పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్
ఫెషాలీ, దీప్తి కాదు.. తెలుగమ్మాయి వల్లే గెలిచాం: రవిచంద్రన్ అశ్విన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Election 2025:  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
YSRCP Leader Roja: తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
Mexican president kiss: మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
India Test Team Against South Africa : దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
Embed widget