అన్వేషించండి

Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!

Tamil Nadu Family Suicide : తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారంతో ఓ వ్యక్తి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా కుటుంబం మొత్తాన్ని హత్య చేశాడు.

Tamil Nadu Family Suicide :  కరోనా కారణంగా సామాన్యులు అప్పుల సుడిగుండంలో చిక్కుకున్నారు. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతూ, కుటుంబ పోషణే భారంగా మారిన సమయంలో చేసిన అప్పులు తీర్చాలంటూ ఒత్తిడి చేయడంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో కలకలం రేపింది. 

తమిళనాడు రాజధాని చెన్నై మహానగరంలోని శంకర్ నగర్ లో ప్రకాష్(41), గాయత్రి(39) దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే వీరికి నిత్యశ్రీ(13), హరికృష్ణ(9) సంతానం ఉన్నారు. ప్రకాష్ చెన్నైలో వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఎంతో హాయిగా సాగిపోయే వీరి జీవితాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేశాయి. కరోనా సమయంలో చాలా కాలం పాటు వ్యాపారం దెబ్బ తినడంతో కుటుంబ పోషణకు ప్రకాష్ అప్పు చేశాడు. చిన్న చిన్న వాటికి ఇరుగుపొరుగు వారి వద్ద అప్పు చేస్తూ కుటుంబ అవసరాలను తీర్చుకున్నాడు. ప్రకాష్ తల్లిదండ్రులు కరోనా భారిన పడడంతో అప్పు చేసి వారి చికిత్స అందించి కాపాడుకున్నాడు. ఇలా రోజు రోజుకీ ప్రకాష్ అప్పులు పెరుగుతూ వచ్చాయి. ఇలా చేసిన అప్పులకు భారీగానే వడ్డీ పెరిగింది. చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు మరికొన్ని చోట్ల అప్పు చేయాల్సి వచ్చింది. ఇలా అప్పులు ప్రకాష్ కు తలకు మించిన భారంగా మారాయి. 

అప్పుల భారం 

వ్యాపారం కోసం ప్రకాష్ మరికొంత అప్పు చేశాడు. కానీ వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉండడం, అప్పుల ఇచ్చిన వ్యక్తుల వద్ద నుంచి ఒత్తిడి తట్టుకోలేని ప్రకాష్ కు ఏం చేయాలో అర్థం కాలేదు.  కొద్ది రోజుల పాటు బయట ప్రాంతాల్లో ఏదోక ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించుకుంటూ, చేసిన అప్పులు తీర్చాలని భావించాడు. కానీ ప్రకాష్ అనుకున్న విధంగా ఉద్యోగం లభించకపోయే సరికి తీవ్రంగా మనోవేదనకు గురయ్యాడు. ఇంట్లోంచి బయటకు వెళ్తే అప్పులు ఇచ్చిన వారు ఎటువైపు నుంచి వచ్చి గొడవకు దిగుతారో అని ప్రకాష్ ఆవేదనకు గురై కొద్ది రోజులు చెన్నైలో తన తల్లిదండ్రులు వద్దకు వచ్చాడు. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను మృతి చెందిన తరువాత తన కుటుంబంపై అప్పులు బాధ ఎక్కువ అవుతుందని భావించిన ప్రకాష్ వారిని కూడా చంపేయాలని భావించాడు. 

భార్య, బిడ్డల హత్య  

ముందుగా తన భార్య, బిడ్డలను చంపిన తరువాత తాను చనిపోవాలని భావించిన ప్రకాష్.. ఈ నెల 19వ తేదీన అమెజాన్ లో ఎలక్ట్రానిక్ రంపాన్ని ఆర్డర్ చేశాడు. ప్రకాష్ ఆర్డర్ చేసిన రంపం ఇంటికి వచ్చే వరకూ కుటుంబంతో ఎంతో సంతోషంగా గడిపాడు. అయితే గత రెండు రోజుల క్రితం ప్రకాష్ ఆర్డర్ చేసిన రంపం ఇంటికి చేరుకుంది. అయితే ఎలక్ట్రిక్ రంపాన్ని చూసిన గాయత్రి ఎందుకని అడిగింది. తన ఫ్రెండ్ కి అవసరం ఉండడంతో ఆర్డర్ చేసినట్లు చెప్పాడు. శుక్రవారం రాత్రి కుటుంబసభ్యులకు ఆహారంలో మత్తు మందు ఇచ్చాడు.‌ అందరూ మత్తులోకి వెళ్లడంతో ముందుగా భార్యను ఎలక్ట్రిక్ రంపంతో గొంతు కోసి చంపాడు. తరువాత కుమార్తె నిత్యశ్రీ, కుమారుడు హరికృష్ణని గొంతు కోసి హత్య చేశాడు. వారు చనిపోయారని నిర్ధారించుకుని ప్రకాష్ కూడా రంపంతో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఇంట్లో విగతజీవులై 

ప్రకాష్ తండ్రి ఫోన్ చేసినా ఎంతకీ ఫోన్ తీయకపోయే సరికి అనుమానం వచ్చి ఇంటికి వచ్చే చూశారు.  ఇంటి తలుపులు మూసి ఉండడంతో చుట్టు పక్కల వారి సహాయంతో తలుపులను బద్దలు కొట్టి చూసే సరికే కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు రక్తపు మడుగులో‌పడి ఉన్నారు. వారిని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ శంకర్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసిన మృతిదేహాలను చెన్నై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.‌ 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget