అన్వేషించండి

Suvendu Adhikari Aide Murder:పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం రక్తసిక్తం! సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్య! 

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిన రోజులు గడవక ముందే ఘోరం జరిగింది. బీజేపీ అగ్రనేత సువేందు అధికారికి అత్యంత సన్నిహితుడు, పీఏను దుండగులు కాల్చి చంపారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సువేందు అధికారి అనుచరుడు చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు.
  • దుండగులు కారును అడ్డగించి, కిటికీల గుండా కాల్పులు జరిపారు.
  • గతంలో వైమానిక దళంలో పనిచేసిన చంద్రనాథ్, సువేందుకి నమ్మకస్తుడు.
  • సువేందు అధికారి ప్రొఫెషనల్ హంతకుల పనేనని ఆరోపించారు.

Suvendu Adhikari Aide Murder:పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో మరోసారి రక్తపాతం చోటు చేసుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 207 స్థానాలతో ప్రభంజనం సృష్టించి, తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనకు చరమగీతం పాడింది. ఈ విజయాన్ని ఉత్సవంగా జరుపుకుంటున్న వేళ విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉండి ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన సువేందు అధికారికి కుడి భుజంగా పేరుగాంచిన చంద్రనాథ్‌ రథ్‌ దారుణ హత్యకు గురయ్యారు. కోల్‌కతా శివారు ప్రాంతమైన మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. 

పక్కా ప్లాన్ ప్రకారం కాల్పులు 

బుధవారం రాత్రి సుమారు పదిన్నర గంటల సమయంలో చంద్రనాథ్‌ రథ్ తన నివాసానికి మహీంద్రా స్కార్పియో వాహనంలో తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. మధ్యమ్‌గ్రామ‌ పరిధిలోని దోహారియా జంక్షన్‌ వద్ద దుండగులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఒక కారు చంద్రనాథ్‌ కారును ముందు నుంచి అడ్డుకోగా, వెనుక నుంచి మోటార్ సైకిళ్లపై వచ్చిన దుండగులు కారుపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. 

స్పాట్‌లోనే చంద్రనాథ్ మృతి

చంద్రనాథ్ కారులో డ్రైవర్ పక్క సీటులో కూర్చొని ఉండగా, దుండగులు పాయింట్ బ్లాంక్‌ రేంజ్‌లో కిటికీ అద్దాల గుండా కాల్పులు జరిపారు. మొత్తం మూడు నుంచి నాలుగు రౌండ్ల కాల్పులు జరిగినట్టు ప్రాథమిక సమాచారం. ఈ దాడిలో చంద్రనాథ్ శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకుపోయాయి. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో చంద్రనాథ్‌ కారు డ్రైవర్ కూడా బుల్లెట్ గాయాలకు గురై, ప్రస్తుతం కోల్‌కతా ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. 

గుండెను చీల్చిన బుల్లెట్లు

చంద్రనాథ్‌ను పరీక్షించిన వివా సిటీ ఆసుపత్రి వైద్యులు షాకింగ్ వివరాలు వెల్లడించారు. ఆయన ఛాతీ ఎడమ భాగంలో రెండు బుల్లెట్లు, పొత్తికడుపులో ఒక బుల్లెట్ దిగింది. ఛాతీలోకి దూసుకెళ్లిన బుల్లెట్‌ ఆయన గుండెను పూర్తిగా చీల్చివేసి అవతలి వైపు నుంచి బయటకు వచ్చాయని, దీని వల్ల ఆయన స్పాట్‌లోనే మృతి చెందారు. ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే ఆయనలో స్పందన లేని డాక్టర్‌ ప్రతిమ్‌ సేన్‌గుప్తా వెల్లడించారు. 

ఇంతకీ ఎవరీ చంద్రనాథ్‌ రథ్‌

చంద్రనాథ్‌ రథ‌ నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడి అనుచరుడు మాత్రమే కాదు, దేశం కోసం పని చేసిన మాజీ సైనికుడు. చంద్రనాథ్‌ రథ్ దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత వైమానిక దళంలో పని చేశారు. రామకృష్ణ మిషన్‌లో విద్యాభ్యాసం చేసిన ఆయనపై రామకృష్ణ మిషన్ సిద్ధాంతాల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఒక దశలో ఆయన ఆధ్యాత్మిక జీవితం వైపు వెళ్లాలని కూడా భావించారు. వైమానిక దళం నుంచి స్వచ్ఛంద పదవి విరమణ పొందిన తర్వాత కొంత కాలం కార్పొరేట్ రంగంలో పని చేశారు 2019లో సువేందు అధికారి మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో చంద్రనాథ్‌ ఆయన అధికారిక బృందంలో చేరారు. 

సువేందుకు నమ్మకస్తుడు

సువేందు అధికారి 2020లో టీఎంసీని వీడి బీజేపీలో చేరినప్పుడు చంద్రనాథ్‌ కూడా ఆయన వెంట నడిచారు. తక్కువ కాలంలోనే సువేందుకి అత్యంత సన్నిహితుడిగా, రాజకీయ వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా భవానీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మమతా బెనర్జీపై సువేందు సాధించిన విజయంలో చంద్రనాథ్ కీలక పాత్ర పోషించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

సువేందు అధికారి తీవ్ర ఆరోపణలు 

ఘటన జరిగిన వెంటనే ఆసుపత్రికి చేరుకున్న సువేందు అధికారి తీవ్ర ఆవేశానికి గురయ్యారు. ఇది సాధారణ హత్య కాదని, పక్కా ప్రణాళికతో జరిగిన కోల్డ్ బ్లడెడ్‌ మర్డర్ అని అన్నారు. గత రెండు మూడు రోజులుగా దుండగులు చంద్రనాథ్ కదలికలపై నిఘా ఉంచి, రెక్కీ నిర్వహించినట్టు సువేందు ఆరోపించారు. కారులో చంద్రనాథ్ ఎక్క కూర్చుంటారో కూడా ముందే తెలుసుకుని సరిగ్గా కిటికీ అద్దాల గుండా కాల్పులు జరపడం ఇది ప్రొఫెషనల్‌ హంతకుల పనేనని ఆయన అన్నారు. గత 15 ఏళ్లుగా రాష్ట్రంలో కొనసాగుతున్న మహా జింగ్ల రాజ్‌ ఫలితమే ఇదని ఇలాంటి గూండాలను ఏరిపారేసే పనిని బీజేపీ ప్రారంభిస్తుందని ఆయన హెచ్చరించారు. 

నకిలీ నెంబర్‌ ప్లేట్ లభ్యం 

పశ్చిమ బెంగాల్ డీజీపీ సిద్ధ్ నాథ్ గుప్తా ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. హత్యకు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ వాహనంపై ఉన్న నెంబర్‌ ప్లేట్ నకిలీదని తేలింది. దాన్ని ట్యాపరింగ్ చేశారని పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో లైవ్ రౌండ్లు, ఖాళీ తూటాలు పోరెన్సిక్‌ బృందం సేకరించింది. నాలుగు మోటార్ సైకిళ్లై వచ్చి ఉండవచ్చని, దాడి తర్వాత కారు  వదిలేసి బైక్‌్లపై పరారయ్యారని ప్రాథమిక విచారణలో తేలింది. 

హత్యపై స్పందించిన టీఎంసీ, తమకు సంబంధం లేదని ప్రకటించింది. ఈ హత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.  మొత్తానికి చంద్రనాథ్ రథ్ హత్య బెంగాల్ రాజకీయాల్లో పెన సంచలనంగా మారింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరక ముందే జరిగిన ఈ ఘటన, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఎలా ఉండబోతోందో సూచిస్తోంది. 

Frequently Asked Questions

చంద్రనాథ్ రథ్‌ హత్య ఎక్కడ, ఎప్పుడు జరిగింది?

చంద్రనాథ్‌ రథ్‌ కోల్‌కతా శివారు ప్రాంతమైన మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి దాదాపు పదిన్నర గంటల సమయంలో హత్యకు గురయ్యారు.

చంద్రనాథ్‌ రథ్‌ ఎవరు?

చంద్రనాథ్‌ రథ్‌ సువేందు అధికారికి సన్నిహితుడు, మాజీ సైనికుడు. ఆయన గతంలో భారత వైమానిక దళంలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేశారు.

చంద్రనాథ్‌ రథ్‌ హత్యకు గల కారణాలు ఏమిటి?

ప్రస్తుతం హత్యకు గల ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. అయితే, సువేందు అధికారి మాత్రం ఇది ప్రణాళికాబద్ధమైన హత్య అని ఆరోపించారు.

ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఏమి కనుగొన్నారు?

హత్యకు ఉపయోగించిన కారు నకిలీ నంబర్ ప్లేట్ తో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలం నుండి లైవ్ రౌండ్లు, ఖాళీ తూటాలను సేకరించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Koheda Tragedy: బిడ్డను అమ్మేసి వెరే వ్యక్తితో వెళ్లిపోయింది - ఆ భర్త ప్రాణం తీసుకున్నాడు - హైదరాబాద్ లో విషాదం
బిడ్డను అమ్మేసి వెరే వ్యక్తితో వెళ్లిపోయింది - ఆ భర్త ప్రాణం తీసుకున్నాడు - హైదరాబాద్ లో విషాదం
Karimnagar Robbery: బీహార్ జైలు నుంచి కరీంనగర్ జ్యూయలరీ షాపు దోపిడీ స్కెచ్ - ఇది మనీహీస్ట్ తాతలాంటి క్రైమ్ స్టోరీ!
బీహార్ జైలు నుంచి కరీంనగర్ జ్యూయలరీ షాపు దోపిడీ స్కెచ్ - ఇది మనీహీస్ట్ తాతలాంటి క్రైమ్ స్టోరీ!
Shamshabad Tahsildar ACB: డబ్బులు బయటకు విసిరేశారు.. టాయిలెట్‌లో ఫైళ్లు దాచి పెట్టారు - ఏసీబీ దాడితో శంషాబాద్ తహసీల్దార్ కష్టాలు
డబ్బులు బయటకు విసిరేశారు.. టాయిలెట్‌లో ఫైళ్లు దాచి పెట్టారు - ఏసీబీ దాడితో శంషాబాద్ తహసీల్దార్ కష్టాలు
Online Betting Racket: రెడ్డీ అన్న పేరుతో బెట్టింగ్ యాప్ - కోల్‌కతాలో విశాఖ పోలీసుల ఆపరేషన్ - సంచలన విషయాలు వెలుగులోకి..
రెడ్డీ అన్న పేరుతో బెట్టింగ్ యాప్ - కోల్‌కతాలో విశాఖ పోలీసుల ఆపరేషన్ - సంచలన విషయాలు వెలుగులోకి..
Advertisement

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Cylinder Shortage: ఎమండోయ్ ఇది చూశారా.. సిలిండర్ల వాహనానికి పోలీస్ ఎస్కార్ట్ - కలికాలం!
ఎమండోయ్ ఇది చూశారా.. సిలిండర్ల వాహనానికి పోలీస్ ఎస్కార్ట్ - కలికాలం!
Bandi Bhagirath Case Latest News: బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకొచ్చాం.. బాధితురాలి తల్లి సంచలన లేఖ విడుదల
బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకొచ్చాం.. బాధితురాలి తల్లి సంచలన లేఖ విడుదల
Radhan Pandit: 101 ఏళ్ల వరకు విజయ్ సీఎం.. రష్యా-అమెరికా గొడవలు కూడా తీరుస్తారట - దళపతి తీసేసిన జ్యోతిష్యుడి అతి వైరల్!
101 ఏళ్ల వరకు విజయ్ సీఎం.. రష్యా-అమెరికా గొడవలు కూడా తీరుస్తారట - దళపతి తీసేసిన జ్యోతిష్యుడి అతి వైరల్!
NEET UG Exam Online: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే.. నీట్ రీఎగ్జామ్ అభ్యర్థులకు వారం గడువు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే.. నీట్ రీఎగ్జామ్ అభ్యర్థులకు వారం గడువు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
PM Modi కాన్వాయ్‌లో 2 వాహనాలు Range Rover , Fortuner లలో సేఫ్టీ, మైలేజీలలో ఏది బెస్ట్ తెలుసా..
PM Modi కాన్వాయ్‌లో 2 వాహనాలు Range Rover , Fortuner లలో సేఫ్టీ, మైలేజీలలో ఏది బెస్ట్ తెలుసా..
Aviation Fuel Crisis: విమానం ఒక్క ట్రిప్ వేస్తే ఎన్ని లక్షల రూపాయల ఇంధనం ఖర్చవుతుందో తెలుసా..? క్రూడ్ సంక్షోభం ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందంటే..
విమానం ఒక్క ట్రిప్ వేస్తే ఎన్ని లక్షల రూపాయల ఇంధనం ఖర్చవుతుందో తెలుసా..? క్రూడ్ సంక్షోభం విమానయానంపై ఎంతటి ప్రభావం చూపుతుందంటే..
Supreme Court: ప్రధానికి వ్యతిరేకంగా మంత్రి వెళ్లగలరా? ఎన్నికల సంఘం నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రధానికి వ్యతిరేకంగా మంత్రి వెళ్లగలరా? ఎన్నికల సంఘం నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Bad Boy Karthik OTT : ఓటీటీలోకి నాగశౌర్య డిజాస్టర్ మూవీ - సడన్‌గా స్ట్రీమింగ్
ఓటీటీలోకి నాగశౌర్య డిజాస్టర్ మూవీ - సడన్‌గా స్ట్రీమింగ్
Embed widget