అన్వేషించండి

Siddipet: పెళ్లై 36 రోజులే, భర్త గొంతు పిసికి చంపిన భార్య! అంతకుముందు మరో ట్విస్ట్ కూడా, విచారణలో సంచలనాలు

Siddipet Husband Death: రెండు ప్రయత్నాలు చేసింది. మొదటిసారి అన్నంలో విషం కలిపి పెట్టగా, అది విఫలం అయింది. రెండోసారి గొంతు పిసికి చంపింది.

Siddipet Woman Kills Husband: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా మట్టుబెట్టిన ఓ భార్య వ్యవహారం సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. పెళ్లి జరిగి రెండు నెలలు కూడా కాకముందే భర్తను చంపేసింది. పెద్దలు బలవంతంగా ఆమెను ఒప్పించి పెళ్లి జరిపించడమే ఇందుకు కారణం అని పోలీసులు గుర్తించారు. అంతకుముందు ఉన్న ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చింది. అందుకు రెండు ప్రయత్నాలు చేసింది. మొదటిసారి అన్నంలో విషం కలిపి పెట్టగా, అది విఫలం అయింది. రెండోసారి గొంతు పిసికి చంపింది. 

చేసిన హత్యాయత్నం విఫలం కాగా.. రెండోసారి గొంతు నులిమి చంపేసింది. ఛాతీలో నొప్పితో చనిపోయాడని నాటక మాడింది. పోలీసుల దర్యాప్తులో హత్య విషయం వెల్లడవడంతో.. జైలు పాలైంది. పెళ్లయిన 36 రోజుల్లోనే ఇవన్నీ జరగడం గమనార్హం.

పోలీసులు వెల్లడించిన వివరాలివీ.. సిద్దిపేట జిల్లాలో ఏప్రిల్ 28న ఈ హత్య జరిగింది. దుబ్బాక మండలం చిన్న నిజాంపేటకు చెందిన కోనాపురం చంద్రశేఖర్‌ అనే 24 ఏళ్ల వ్యక్తికి తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన శ్యామల అనే 19 ఏళ్ల యువతితో గత మార్చి 23న పెళ్లి జరిగింది. అదే ఊరికి చెందిన శివకుమార్‌ అనే 20 ఏళ్ల వ్యక్తితో శ్యామల మూడేళ్లుగా ప్రేమలో ఉంది. కానీ, పెద్దల ఒత్తిడితో చంద్రశేఖర్‌ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కాపురం నచ్చకపోవడంతో ప్రియుడు శివతో కలిసి హత్యకు ప్లాన్ వేసింది.

Also Read: Vizianagaram Kidnap : కూల్ డ్రింక్స్ ఆశ చూపి ఇద్దరు చిన్నారులను కిడ్నాప్, గంటల వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులు

ఆహారంలో విషం కలిపి..
అందుకోసం మొదటి ప్రయత్నంలో భాగంగా గత నెల 19న తినే ఆహారంలో ఎలుకల మందు కలిపింది. ఆస్పత్రికి తరలించడంతో భర్త బతికాడు. ఫుడ్ పాయిజన్ అయిందని భావించాడు. కొద్ది రోజుల తర్వాత ఓ మొక్కు ఉందంటూ ఏప్రిల్‌ 28న శ్యామల తన భర్తను తీసుకొని బైక్‌పై అనంతసాగర్‌ శివారుకు తీసుకెళ్లింది. ఏకాంతంగా ఉందామని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ ప్రియుడు, అతడి స్నేహితులు కలిసి గొంతు పిసికి చంపేశారు.

అయితే, తన భర్త ఛాతీలో నొప్పితో చనిపోయాడని అందర్నీ నమ్మించింది. కానీ, అత్తామామలు మణెవ్వ, ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చారు.

Also Read: Nalgonda News : నల్గొండలో వైద్యుల నిర్లక్ష్యం, మహిళ కడుపులో దూది పెట్టి కుట్టేశారు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Vizag Firecracker Explosion: విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
Orissa Fire Accident: ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం
ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Embed widget