అన్వేషించండి

Siddipet Gun Fire: సిద్ధిపేట కాల్పుల కలకలం... నిందితుల్ని 24 గంటల్లో పట్టుకుంటామని సీపీ శ్వేత ప్రకటన

సిద్ధిపేట కాల్పుల కేసును 24 గంటల్లో ఛేదిస్తామని సీపీ శ్వేత అన్నారు. సిద్ధిపేట రిజిస్ట్రేషన్ ఆఫీసు వద్ద కాల్పులు జరిపి ఇద్దరు నిందితులు రూ.43 లక్షలతో పరారయ్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన సిద్ధిపేట కాల్పుల కేసును 24 గంటల్లో ఛేదిస్తామని సిద్దిపేట సీపీ శ్వేత ధీమా వ్యక్తం చేశారు. సిద్ధిపేట పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కాల్పులు జరిగిన ప్రదేశాన్ని సీపీ పరిశీలించారు. సీపీ శ్వేత మాట్లాడుతూ నిందితులను పట్టుకోవడానికి 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల పరిశీలిస్తున్నామని, నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద సోమవారం కాల్పులు జరిపి ఓ రియల్టర్ వద్ద భారీ మొత్తంలో నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. సిద్ధిపేటలోని ఓ ప్లాట్ విక్రయానికి చేర్యాలకు చెందిన రియల్టర్ నర్సయ్య, ఆయన డ్రైవర్ పర్శరాములు కారులో రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వచ్చారు. ప్లాట్ విక్కయించగా వచ్చిన రూ. 43 లక్షలు నర్సయ్య తీసుకొని డ్రైవర్‌కు ఇచ్చి కారులో పెట్టాడు. సంతకం చేయడానికి నర్సయ్య ఆఫీస్ లోపలికి వెళ్లగానే ఇద్దరు దుండగులు పల్సర్ బైక్‌పై వచ్చి ఇన్నోవా కారు అద్దాలు పగుల కొట్టి డ్రైవర్ పై కాల్పులు జరిపారు. మరో వ్యక్తి కారు ఉన్న రూ.43 లక్షల నగదు తీసుకుని పరారయ్యారు. నిందితులు గన్‌ను కారులోనే వదిలేశారు. పోలీసులు కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. 

అసలేం జరిగిందంటే....

సిద్దిపేటలో తుపాకీ కాల్పులు స్థానికుల్ని బెంబేలెత్తించాయి. సిద్దిపేట పట్టణంలోని రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో ఓ ఆగంతుకుడు జనాన్ని ఈ భయానికి గురి చేశాడు. అంతేకాదు, ఆ తుపాకీ కాల్పుల అనంతరం మరో వ్యక్తికి చెందిన భారీ సొత్తును ఎత్తుకుపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. తుపాకీ కాల్పులకు ఎవరు పాల్పడ్డారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలులోకి వస్తుండడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఆస్తుల కొనుగోలు దారులు ముందస్తుగానే తమ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే చేర్యాల ప్రాంతానికి చెందిన నర్సయ్య అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా తన ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం అక్కడికి వచ్చారు. సిద్దిపేటలోని ఓ ప్లాట్ లావాదేవీ కోసం నర్సయ్య, ఆయన డ్రైవర్ పర్శరాములు కారులో వచ్చారు. దాదాపు రూ.48.5 లక్షల నగదు వారి వద్ద ఉంది. ప్లాటు విక్రయించగా వచ్చిన డబ్బులు రూ.43 లక్షలు కొనుగోలు దారు నుంచి తీసుకొని డ్రైవర్‌కు ఇచ్చి కారులో పెట్టాలని నర్సయ్య చెప్పారు.

ఈ లోపు సంతకం చేయడానికి నర్సయ్య ఆఫీస్ లోపలికి వెళ్లాడు. ఇంతలో ఇద్దరు ఆగంతకులు పల్సర్ బైక్‌పై వచ్చి ఇన్నోవా కారు అద్దాలు పగుల కొట్టి డ్రైవర్ తొడపై గన్‌తో కాల్చారు. మరో వ్యక్తి కారు డోర్లు తీసి రూ.43 లక్షల నగదు తీసుకుని పారిపోయారు. కాగా.. నిందితులు గన్‌ను కారులోనే వదిలి పారిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆగంతుకుల గురించి ఆరా తీస్తున్నారు. పూర్వం ప్లాటు క్రయ విక్రయాల్లో విభేదాలు వచ్చినవారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలో బాధితులను ప్రశ్నిస్తున్నారు.ఈ దుండగులు కారును ఫాలో అయి ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరు నంబ‌ర్ ప్లేటులేని బైక్‌పై వ‌చ్చారు. కారు అద్దాన్ని ప‌గుల‌గొట్టి.. డ్రైవ‌ర్ ప‌రుశురామ్ కాలిపై కాల్పులు జరిపాడు. మ‌రో వ్యక్తి అవ‌త‌లి వైపు నుంచి వ‌చ్చి న‌గ‌దు ఉన్న బ్యాగును అప‌హ‌రించారు. అనంత‌రం తుపాకీని అక్కడే వ‌దిలిపెట్టి బైక్‌పై పారిపోయారు. ఘ‌ట‌నాస్థలంలో బుల్లెట్లను, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. గాయ‌ప‌డ్డ డ్రైవ‌ర్‌ను చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి త‌ర‌లించారు. అయితే దుండ‌గులు కంట్రీమేడ్ గ‌న్‌తో కాల్పులు జ‌రిపిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు మూడు బృందాల‌ను పోలీసులు రంగంలోకి దింపారు.

Also Read:  పబ్బుల్లో డ్రగ్స్ తో పట్టుబడితే మీ వెనకాల ఎవరున్నా ఉపేక్షించం... సౌండ్స్ పరిమితికి లోబడే పెట్టాలి... మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
Wife Kills Husband With Snake: చివరికి మొగుళ్లను ఇలా కూడా చంపుతున్నారా ? - డ్రైవర్‌తో ఎఫైర్ పెట్టుకుని పాముకాటుతో భర్తను హత్య చేసిన భార్య!
చివరికి మొగుళ్లను ఇలా కూడా చంపుతున్నారా ? - డ్రైవర్‌తో ఎఫైర్ పెట్టుకుని పాముకాటుతో భర్తను హత్య చేసిన భార్య!
Tragedy in Polavaram: గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
Vikarabad Latest News: యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget