అన్వేషించండి

Satya Sai District News : నిద్రపోతున్న భార్యపై గొడ్డలితో భర్త దాడి, అతికిరాతకంగా హత్య!

Satya Sai District News : కుటుంబ కలహాలతో భార్యను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపేశాడు భర్త. ఈ ఘటన సత్యసాయి జిల్లాలో సంచలనమైంది.

Satya Sai District News :  శ్రీ సత్య సాయి జిల్లాలో దారుణం జరిగింది. లేపాక్షి మండలం మైదు గోళం గ్రామంలో కుటుంబ కలహాలతో హసీనా(50) అనే మహిళను ఆమె భర్త వాజిద్ గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఇంట్లో నిద్రపోతున్న హసీనా తలపై గొడ్డలితో నరకడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది.  పట్టపగలే భార్యను భర్త హత్య చేసిన సంఘటన గ్రామంలో సంచలనం సృష్టించింది. భార్యను హత్య చేసిన తర్వాత నిందితుడు పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 

అసలేం జరిగింది? 

శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షి మండలం మైదుగోళం గ్రామానికి చెందిన వాజిద్, హసీనా భార్యభర్తలు. ఇరువురు కుటుంబ కలహాలతో తరచూ గొడవపడేవారు. వాజిద్ మద్యానికి బానిసై భార్యను నిత్యం వేధించే వాడు. సోమవారం సాయంత్రం  మద్యం సేవించి వచ్చిన వాజిద్ భార్య హసీనా నిద్రపోతున్న సమయంలో తలపై గొడ్డలితో బలంగా కొట్టాడు. దీంతో తీవ్రగాయమైన హసీనా అక్కడికక్కడే మరణించింది. హత్యకు ఉపయోగించిన గొడ్డలి అక్కడే వదలి నిందితుడు పరారయ్యాడు. నిందితుని కోసం లేపాక్షి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

అదనపు కట్నం కోసం భార్యకు ఉరి వేసిన భర్త 

జగిత్యాల జిల్లా మల్యాలలో పల్లెపు మహేందర్ అనే వ్యక్తి భార్యను అదనపు కట్నం కోసం వేధించేవాడు. తాగిన మైకంలో భార్య నవ్యను ఉరి వేసి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. వీరికి 4 నెలల పాప ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

పెళ్లైన మూడు రోజులకే 

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈనెల 9వ తేదీన మాధవరం గ్రామానికి చెందిన యువతిని రచ్చమర్రి గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే యువతి అంతకుముందే శివాజీ అనే మరో వ్యక్తిని ప్రేమించింది. పెళ్లైన మూడో రోజే ఆమె శివాజీతో వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన బంధువులు శివాజీ ఇంటికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఇంట్లో దుస్తులు, బియ్యం కాలిపోయాయి. ఎస్‌ఐ రాజకుళ్లాయప్ప సిబ్బందితో వెళ్లి చుట్టుపక్కల వారి సాయంతో మంటలు ఆర్పేశారు. ఆ సమయానికి శివాజీ కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం రచ్చమర్రి, మాధవరం గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.

Also Read : Road Accident In Alluri District: అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం - ప్రైవేట్ బస్సు బోల్తా, ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి

Also Read : Chittoor Crime : ప్రేమ పెళ్లికి డబ్బులు ఇవ్వలేదని యువకుడు ఆత్మహత్య!

టాప్ హెడ్ లైన్స్

Pune Realtor Ketan Agarwal Murder: పాపం కేతన్ - ప్రాణాలే కాదు ముందుగా కోటి కూడా పోగొట్టుకున్నాడు - సియా ప్లాన్ నెక్ట్స్ లెవల్ !
పాపం కేతన్ - ప్రాణాలే కాదు ముందుగా కోటి కూడా పోగొట్టుకున్నాడు - సియా ప్లాన్ నెక్ట్స్ లెవల్ !
Delhi Dehradun Expressway Accident: ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
Dharavath Nikhil Death Case: ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget