అన్వేషించండి

నువ్వెలా బతికావ్ నాన్నా, నేను హ్యాండిల్ చెయ్యలేకపోతున్నా - స్టూడెంట్ సూసైడ్ కేసులో కీలక ఆధారం లభ్యం

కరోనా సమయంలో ఆన్‌లైన్‌ తరగతుల వల్ల తన ఆత్మవిశ్వాసం దెబ్బతినడంతో పాటు, మరో మూడు కారణాలు తాను ప్రాణాలు తీసుకొనేందుకు కారణమని బింగుమల్ల రాహుల్‌ అనే 24 ఏళ్ల విద్యార్థిని తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.

హైదరాబాద్ ఐఐటీలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఎంటెక్ విద్యార్థి కేసులో కీలక ఆధారం లభ్యమైంది. అందులో తాను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న విషయాలు చనిపోకముందు యువకుడు రాసుకున్నాడు. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ తరగతుల వల్ల తన ఆత్మవిశ్వాసం దెబ్బతినడంతో పాటు, మరో మూడు కారణాలు తాను ప్రాణాలు తీసుకొనేందుకు కారణమని బింగుమల్ల రాహుల్‌ అనే 24 ఏళ్ల విద్యార్థిని తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో ఎంటెక్‌ చదువుతున్న ఏపీలోని నంద్యాలకు చెందిన రాహుల్‌ తన హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగస్టు 31న ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

ఆ గదిని పరిశీలించిన పోలీసులకు లోపల ఒక పుస్తకంలో ‘ఇంపార్టెంట్‌ టెక్ట్స్‌ ప్లీజ్‌ సీమై ల్యాప్‌టాప్‌’ అని రాసి ఉన్నట్లు కనిపించింది. ల్యాప్ ట్యాప్ తెరిపించి అందులో ఉన్న సూసైడ్‌ లెటర్‌ ను పోలీసులు చదివారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్‌ మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆ లెటర్ ను చదివి వినిపించారు. 

‘‘నాకు బతకాలని లేదు. ప్లేస్‌మెంట్స్‌ ఒత్తిళ్లు, థీసిస్‌, ఫ్యూచర్ లో ఉద్యోగంలో సమస్యలు వస్తాయని అనిపిస్తుంది. రోజూ మానసిక ఒత్తిడి ఉంటోంది. చాలా మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్స్‌ కోసమే ఎంటెక్‌లో ప్రవేశిస్తారు. మరి థీసిస్‌ ఎందుకు? ట్రిపుల్‌ ఐటీ బెంగళూరులో థీసిస్‌కు బదులుగా ఇంటర్న్‌షిప్‌ను చేయిస్తున్నారు. థీసిస్‌ కోసం ఏ విద్యార్థినీ ఒత్తిడి చేయొద్దు ప్లీజ్. నా నిర్ణయానికి గైడ్‌ కారణం కాదు.. కేవలం భవిష్యత్తు మీద నాకున్న భయం మాత్రమే. ఒత్తిడిని తట్టుకునేందుకు ఆల్కహాల్, స్మోకింగ్ కి అలవాటుపడ్డా. ఒత్తిడిని తట్టుకోలేకపోయా. 

అమ్మా, నాన్నా నా అవయవాలను ఎవరికైనా దానం చేయండి. నాన్నా నువ్వు నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నావు. నాకు ఆశ్చర్యమేస్తోంది. నువ్వు ఇన్ని రోజులు నీ జీవితంలో సమస్యలతో ఎలా పోరాడావో.. ఈ చిన్నదాన్నే నేను భరించలేకుండా ఉన్నా. 2019లో జరిగిన మూడు సూసైడ్ ల నుంచి ఐఐటీ ఏమీ నేర్చుకోలేదు. విద్యార్థులకు స్టైఫండ్ టైమ్ లిమిట్ లోగా ఇవ్వాలి’’ అని బాధితుడు ల్యాప్‌టాప్‌లో రాసిన లేఖలో పేర్కొన్నారు. 

ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రం
ఇలాంటి ఒత్తిడికి గురైన సందర్భాల్లో ఐఐటీ హైదరాబాద్‌లో కౌన్సెలింగ్‌ కోసం ప్రత్యేక కేంద్రం ఉందని ఎస్పీ రమణ కుమార్‌ వివరించారు. అయినా దాన్ని రాహుల్‌ వాడుకోలేదని చెప్పారు. 

2019 నుంచి ఆరుగురు ఆత్మహత్య

అంతకుముందు కొద్ది రోజుల క్రితం సంగారెడ్డిలోని ఓ లాడ్జ్ పై నుంచి దూకి హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన మేఘా కపూర్ గా గుర్తించారు. మేఘా కపూర్ మూడు నెలల క్రితమే ఐఐటీ హైదరాబాద్ లో బీటెక్ లో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాతి నుంచి సంగారెడ్డిలో ఉన్న ఆధ్యా లాడ్జిలో ఒక రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. పోలీసులు అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. 2019 నుంచి ఐఐటీ హైదరాబాద్ కు చెందిన ఆరుగురు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MI vs LSG IPL 2025: వాంఖడేలో డేంజరస్ ముంబైని ఢీకొడుతున్న లక్నో, ఆరో విజయం దక్కేది ఎవరికో 
వాంఖడేలో డేంజరస్ ముంబైని ఢీకొడుతున్న లక్నో, ఆరో విజయం దక్కేది ఎవరికో 
KCR at BRS Meeting: సాయంత్రం బీఆర్ఎస్ బహిరంగ సభ, కేసీఆర్ స్పీచ్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాలు
సాయంత్రం బీఆర్ఎస్ బహిరంగ సభ, కేసీఆర్ స్పీచ్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాలు
PM Modi AP Tour Schedule: ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
Telangana ఉద్యమానికి, బీఆర్​ఎస్​ ప్రస్థానానికి లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ సార్ స్ఫూర్తి.. అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్​ నివాళులు
రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ సభ చరిత్ర సృష్టించబోతోంది.. అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్​ నివాళులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs LSG Match Preview IPL 2025 | వాంఖడేలో ముంబైని ఢీకొట్టనున్న లక్నో సూపర్ జెయింట్స్ | ABP DesamMS Dhoni on CSK Performances | సీఎస్కే వైఫల్యాలపై తొలిసారి మాట్లాడిన ధోనీ | ABP DesamThala Ajith in CSK vs SRH IPL 2025 | నిన్న చెన్నై అభిమానులకు ఒకే టికెట్ పై రెండు షోలుCSK Comparison With RCB Wins | IPL 2025 లో గతేడాది RCB మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయిన CSK

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MI vs LSG IPL 2025: వాంఖడేలో డేంజరస్ ముంబైని ఢీకొడుతున్న లక్నో, ఆరో విజయం దక్కేది ఎవరికో 
వాంఖడేలో డేంజరస్ ముంబైని ఢీకొడుతున్న లక్నో, ఆరో విజయం దక్కేది ఎవరికో 
KCR at BRS Meeting: సాయంత్రం బీఆర్ఎస్ బహిరంగ సభ, కేసీఆర్ స్పీచ్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాలు
సాయంత్రం బీఆర్ఎస్ బహిరంగ సభ, కేసీఆర్ స్పీచ్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాలు
PM Modi AP Tour Schedule: ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
Telangana ఉద్యమానికి, బీఆర్​ఎస్​ ప్రస్థానానికి లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ సార్ స్ఫూర్తి.. అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్​ నివాళులు
రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ సభ చరిత్ర సృష్టించబోతోంది.. అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్​ నివాళులు
Kishkindapuri Movie: మరోసారి హిట్ పెయిర్ జోడీ - బెల్లంకొండ, అనుపమ హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి', ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడంటే?
మరోసారి హిట్ పెయిర్ జోడీ - బెల్లంకొండ, అనుపమ హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి', ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడంటే?
PM Modi: మన్‌ కీ బాత్‌లో Sachet App గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, అసలేంటీ అప్లికేషన్, దాని ప్రయోజనాలివే
మన్‌ కీ బాత్‌లో Sachet App గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, అసలేంటీ అప్లికేషన్, దాని ప్రయోజనాలివే
Subham Trailer: భర్తలూ.. టీవీ ఆర్పారో ఇక అంతే! - డిఫరెంట్ రోల్‌లో సమంత.. 'శుభం' ట్రైలర్ అదిరిపోయిందిగా..
భర్తలూ.. టీవీ ఆర్పారో ఇక అంతే! - డిఫరెంట్ రోల్‌లో సమంత.. 'శుభం' ట్రైలర్ అదిరిపోయిందిగా..
BRS Silver Jubilee Meeting: బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
Embed widget