అన్వేషించండి

Sahiti Infra Fraud : మొన్న అమీన్ పూర్ నేడు కొంపల్లి - మరోసారి వందల కోట్లకు జనాల్ని ముంచేసిన రియల్ ఎస్టేట్ కంపెనీ !

సాహితి ఇన్‌ఫ్రాటెక్ కొంపల్లి వెంచర్‌లోనూ ఖాతాదారులను మోసం చేసింది. ఈ సంస్థ టీటీడీ బోర్డు సభ్యుడు లక్ష్మినారాయణదని బాధితులు చెబుతున్నారు.

 

Sahiti Infra Fraud :   సాహితీ ఇన్ ఫ్రాటెక్  వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇళ్ల కొనుగోలుదారులకు కుచ్చుటోపి పెట్టింది. మేడ్చల్ జిల్లా కొంపల్లి పరిధిలోని గుండ్ల పోచంపల్లి లో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కట్టిస్తామని భారీ మోసం చేసింది.  డబ్బులు వసూలు చేసిన నిర్మాణ రంగ సంస్థ ఎంతకూ ఇళ్లు కట్టివ్వకపోవడంతో బాధితులు పోలీసులకు ఫఇర్యాదు చేశారు.  గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో పలువురు ప్లాట్ లను బుక్ చేసుకొని లక్షల్లో డబ్బులు చెల్లించారు.   2020 ఏప్రిల్ నుంచి నిర్మాణాలు ముందుకు సాగక పోగా, కనీసం సమాధానం చెప్పడం లేదని తమ సంస్థకు డబ్బులు ఇచ్చి మోసపోయామని 8 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. 

మూడు నెలల కిందట అమీన్‌పూర్‌లో ఇదే తరహా మోసం 
 
హైదరాబాద్ శివారులో అమీర్ పూర్ దగ్గర  23 ఎకరాల్లో   సాహితీ ఇన్ఫ్రాటెక్ కంపెనీ వెంచర్ వేసింది. పది టవర్లు నిర్మిస్తామని చెప్పుకుంది. ఆకర్షణీయమైన ప్రకటనలు చేసింది.  ఈ వెంచర్ లో మొత్తం 4300 ఫ్లాట్లు   ఉంటాయని చెప్పి..  2019 జూన్ లో ఫ్రీ లాంచ్ కార్యక్రమం ఏర్పాటు చేసింది.  భారీ ఎత్తున ప్లాటన్లు విక్రయించింది.  ఫ్రీ లాంచ్ లో 1200 మందికి పైగా కస్టమర్లు ఫ్లాట్ కొనుగోలు చేశారు.  2023 మార్చ్ కంత ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే  గడువు ముగిసే దశకు వస్తున్నా..  ఇప్పటి దాకా నిర్మాణం ప్రారంభించలేదు. కేవలం స్థలం చదును చేసి వదిలేసింది.  ఎలాంటి  బ్యాంక్ లోన్లు లేకుండా ముందుగా డబ్బులు కట్టిన వారికే ప్రీలాంచ్ ఆఫర్లు అనిచెప్పడంతో  చాలా మంది బాధితులు వివిధ మార్గాల్లో డబ్బులు సేకరించి కంపెనీకి కట్టారు. కానీ ఇప్పుడు కంపెనీ అడ్డగోలుగా మోసం చేయడానికి సిద్ధం కావడంతో  బాధితులంతా లబోదిబోమంటున్నారు. చెప్పిన దాని ప్రకారం  ప్లాట్లు మాకు అప్పగించమని అడిగితే యాజమాన్యం బెదిరింపులకు దిగుతోంది.  డబుల్ బెడ్ రూం కి 25 లక్షలు ట్రిబుల్ బెడ్ రూం కి 35 లక్షలు వసూలు చేసిన యాజమాన్యం తమను నట్టేట ముంచిందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. మొత్తంగా 2000 బాధితుల నుంచి ఇప్పటిదాకా 1500 కోట్లు వసూలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. 

సాహితీ ఇన్ఫ్రాటెక్ ఎం డి లక్ష్మీనారాయణకు రాజకీయ పలుకుబడి  !

సాహితీ ఇన్ఫ్రాటెక్ ఎం డి లక్ష్మీనారాయణ. అధికార పార్టీ నేతలు.. ఇతర రాజకీయ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ డబ్బులు తిరిగి ఇవ్వాలని అంటున్న వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. ప్రిలాంచ్ సమయంలో చాలా మాటలు చెప్పారు.. తర్వాత కూడా రకరకాల ప్లాన్లు చెప్పారు. ఈ వ్యవహారం తేడాగా ఉండటంతో కొంత మంది తమ ప్లాట్లను రద్దు చేసుకున్నారు. వారికి కూడా అరకొరగానే  డబ్బులు ఇచ్చారు. అసలు నిర్మాణం చేపట్టకపోగా భూమిని కూడా అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలియడంతో బాధితులు రగిలిపోతున్నారు.  పోలీసులు కూడా మా పిర్యాదు పట్టించుకోవట్లేదని బాధితులు వాపోతున్నారు. 

టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న లక్ష్మినారాయణ ! 
 
టీటీడీ బోర్డు సభ్యుడుగా ప్రస్తుతం సాహితి ఇన్‌ఫ్రాటెక్ ఎండీ  లక్ష్మినారాయణ ఉన్నారు.  జగన్ ప్రభుత్వం తెలంగాణ నుంచి మొత్తం ఐదుగుర్ని టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమిస్తే అందులో ఒకరు లక్ష్మినారాయణ.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadiyam Kavya: బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiyam Kavya: బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
Sivaji Raja: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Embed widget