అన్వేషించండి

Crime News: బంగారం చోరీ కేసు, దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ - విచారణకు ఉన్నతాధికారుల ఆదేశం

Police Brutality Against SC Woman : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బంగారం దొంగతనం చేసిందంటూ దళిత మహిళను పోలీసులు తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

Custodial Torture On Sc Women: కొందరు పోలీసులు ఒక్కోసారి తాము మనుషులం అన్న విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. చేతిలో లాఠీ ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు. కొందరు పోలీసుల అత్యుత్సాహంతో కొన్నిసార్లు అమాయకులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. బంగారం దొంగతనం చేసిందన్న ఆరోపణలతో పోలీసులు ఎస్సీ మహిళను దారుణంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు కూడా ఆదేశించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకుంది. పోలీస్‌ స్టేషన్‌లో పెట్టి ఎస్సీ మహిళను హింసించిన ఈ ఘటన వ్యవహారం ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని శంషాబాద్‌ డీసీపీ వెల్లడించారు. 

భర్త, కుమారుడి ముందే కొట్టిన పోలీసులు

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. గత నెల 24వ తేదీన షాద్‌ నగర్‌ పట్టణంలోని అంబేద్కర్‌ నగర్‌ కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతులు దొంగతనానికి పాల్పడ్డారంటూ నాగేందర్‌ అనే వ్యక్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత, భీమయ్యతోపాటు 13 ఏళ్ల కుమారుడిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా ఆమె భర్తను వదిలేసిన డిటెక్టివ్‌ సీఐ రామిరెడ్డి, అతని సిబ్బంది సునీతను తీవ్రంగా కొట్టారు. భర్త, కుమారుడి ముందే విచక్షణా రహితంగా కట్టడంతో సునీత తీవ్రంగా గాయపడింది. దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలంటూ సీఐ తీవ్రంగా వేధించడంతో స్పృహ సునీత స్పృహ కోల్పోయింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆమెను ఇంటికి పంపించేశారు. ఈ మేరకు సునీత పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన విషయాన్ని బయటకు వెళ్లడించింది. దీన్ని కొందరు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేవారు. 

తులం బంగారం, నాలుగు వేల నగదు రికవరీ

ఈ దొంగతనం కేసులో 24 తులాల బంగారం, రెండు లక్షల నగదు పోయినట్టు ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు తులం బంగారం, నాలుగు వేల నగదును రికవరీ చేసినట్టు చెబుతున్నారు. మహిళపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు పది రోజులు గడుస్తునప్పటికీ రిమాండ్‌ విధించకుండా ఇంటికి పంపించడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం పోలీసులు వ్యవహరించిన తీరుగానే చెబుతున్నారు. మహిళను తీవ్రంగా కొట్టడంతో ఆమెకు పెద్ద గాయాలు అయినట్టు చెబుతున్నారు. మళ్లీ స్టేషన్‌కు తీసుకువస్తే ఏదైనా ఇబ్బంది జరుగుతుందన్న ఉద్ధేశంతోనే పోలీసులు రిమాండ్‌ విధించడం లేదని చెబుతున్నారు. పోలీసులు దళిత మహిళపై వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్ని వైపుల నుంచి ఈ ఘటనకు సంబంధించి విమర్శలు రావడంతోనే విచారణకు సిద్ధపడినట్టు తెలుస్తోంది. మరి ఈ కేసు విచారణలో ఎటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. 

Also Read: చాక్లెట్ ఇప్పిస్తానని బాలిక కిడ్నాప్ - గంటల్లోనే ఛేదించిన పోలీసులు, కిడ్నాపర్‌పై చిన్నారి బంధువుల దాడి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aadhaar Forgery: ఇంట్లో ఇల్లాలు, ఫైవ్ స్టార్ హోటల్లో ప్రియురాలు..కానీ ఆధార్ మాత్రం ఇల్లాలిదే - ఆ భర్త అలా దొరికిపోయాడు!
ఇంట్లో ఇల్లాలు, ఫైవ్ స్టార్ హోటల్లో ప్రియురాలు..కానీ ఆధార్ మాత్రం ఇల్లాలిదే - ఆ భర్త అలా దొరికిపోయాడు!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
Extramarital Affair: పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget