అన్వేషించండి

Crime News: బంగారం చోరీ కేసు, దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ - విచారణకు ఉన్నతాధికారుల ఆదేశం

Police Brutality Against SC Woman : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బంగారం దొంగతనం చేసిందంటూ దళిత మహిళను పోలీసులు తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

Custodial Torture On Sc Women: కొందరు పోలీసులు ఒక్కోసారి తాము మనుషులం అన్న విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. చేతిలో లాఠీ ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు. కొందరు పోలీసుల అత్యుత్సాహంతో కొన్నిసార్లు అమాయకులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. బంగారం దొంగతనం చేసిందన్న ఆరోపణలతో పోలీసులు ఎస్సీ మహిళను దారుణంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు కూడా ఆదేశించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకుంది. పోలీస్‌ స్టేషన్‌లో పెట్టి ఎస్సీ మహిళను హింసించిన ఈ ఘటన వ్యవహారం ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని శంషాబాద్‌ డీసీపీ వెల్లడించారు. 

భర్త, కుమారుడి ముందే కొట్టిన పోలీసులు

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. గత నెల 24వ తేదీన షాద్‌ నగర్‌ పట్టణంలోని అంబేద్కర్‌ నగర్‌ కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతులు దొంగతనానికి పాల్పడ్డారంటూ నాగేందర్‌ అనే వ్యక్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత, భీమయ్యతోపాటు 13 ఏళ్ల కుమారుడిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా ఆమె భర్తను వదిలేసిన డిటెక్టివ్‌ సీఐ రామిరెడ్డి, అతని సిబ్బంది సునీతను తీవ్రంగా కొట్టారు. భర్త, కుమారుడి ముందే విచక్షణా రహితంగా కట్టడంతో సునీత తీవ్రంగా గాయపడింది. దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలంటూ సీఐ తీవ్రంగా వేధించడంతో స్పృహ సునీత స్పృహ కోల్పోయింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆమెను ఇంటికి పంపించేశారు. ఈ మేరకు సునీత పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన విషయాన్ని బయటకు వెళ్లడించింది. దీన్ని కొందరు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేవారు. 

తులం బంగారం, నాలుగు వేల నగదు రికవరీ

ఈ దొంగతనం కేసులో 24 తులాల బంగారం, రెండు లక్షల నగదు పోయినట్టు ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు తులం బంగారం, నాలుగు వేల నగదును రికవరీ చేసినట్టు చెబుతున్నారు. మహిళపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు పది రోజులు గడుస్తునప్పటికీ రిమాండ్‌ విధించకుండా ఇంటికి పంపించడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం పోలీసులు వ్యవహరించిన తీరుగానే చెబుతున్నారు. మహిళను తీవ్రంగా కొట్టడంతో ఆమెకు పెద్ద గాయాలు అయినట్టు చెబుతున్నారు. మళ్లీ స్టేషన్‌కు తీసుకువస్తే ఏదైనా ఇబ్బంది జరుగుతుందన్న ఉద్ధేశంతోనే పోలీసులు రిమాండ్‌ విధించడం లేదని చెబుతున్నారు. పోలీసులు దళిత మహిళపై వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్ని వైపుల నుంచి ఈ ఘటనకు సంబంధించి విమర్శలు రావడంతోనే విచారణకు సిద్ధపడినట్టు తెలుస్తోంది. మరి ఈ కేసు విచారణలో ఎటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. 

Also Read: చాక్లెట్ ఇప్పిస్తానని బాలిక కిడ్నాప్ - గంటల్లోనే ఛేదించిన పోలీసులు, కిడ్నాపర్‌పై చిన్నారి బంధువుల దాడి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Share Market Record 20 Sept: స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
iPhone 16 Sale: రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా యూజర్స్​!
రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా క్యూలు​!
IND vs BAN : బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
Embed widget