అన్వేషించండి

Crime News: బంగారం చోరీ కేసు, దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ - విచారణకు ఉన్నతాధికారుల ఆదేశం

Police Brutality Against SC Woman : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బంగారం దొంగతనం చేసిందంటూ దళిత మహిళను పోలీసులు తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

Custodial Torture On Sc Women: కొందరు పోలీసులు ఒక్కోసారి తాము మనుషులం అన్న విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. చేతిలో లాఠీ ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు. కొందరు పోలీసుల అత్యుత్సాహంతో కొన్నిసార్లు అమాయకులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. బంగారం దొంగతనం చేసిందన్న ఆరోపణలతో పోలీసులు ఎస్సీ మహిళను దారుణంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు కూడా ఆదేశించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకుంది. పోలీస్‌ స్టేషన్‌లో పెట్టి ఎస్సీ మహిళను హింసించిన ఈ ఘటన వ్యవహారం ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని శంషాబాద్‌ డీసీపీ వెల్లడించారు. 

భర్త, కుమారుడి ముందే కొట్టిన పోలీసులు

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. గత నెల 24వ తేదీన షాద్‌ నగర్‌ పట్టణంలోని అంబేద్కర్‌ నగర్‌ కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతులు దొంగతనానికి పాల్పడ్డారంటూ నాగేందర్‌ అనే వ్యక్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత, భీమయ్యతోపాటు 13 ఏళ్ల కుమారుడిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా ఆమె భర్తను వదిలేసిన డిటెక్టివ్‌ సీఐ రామిరెడ్డి, అతని సిబ్బంది సునీతను తీవ్రంగా కొట్టారు. భర్త, కుమారుడి ముందే విచక్షణా రహితంగా కట్టడంతో సునీత తీవ్రంగా గాయపడింది. దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలంటూ సీఐ తీవ్రంగా వేధించడంతో స్పృహ సునీత స్పృహ కోల్పోయింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆమెను ఇంటికి పంపించేశారు. ఈ మేరకు సునీత పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన విషయాన్ని బయటకు వెళ్లడించింది. దీన్ని కొందరు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేవారు. 

తులం బంగారం, నాలుగు వేల నగదు రికవరీ

ఈ దొంగతనం కేసులో 24 తులాల బంగారం, రెండు లక్షల నగదు పోయినట్టు ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు తులం బంగారం, నాలుగు వేల నగదును రికవరీ చేసినట్టు చెబుతున్నారు. మహిళపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు పది రోజులు గడుస్తునప్పటికీ రిమాండ్‌ విధించకుండా ఇంటికి పంపించడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం పోలీసులు వ్యవహరించిన తీరుగానే చెబుతున్నారు. మహిళను తీవ్రంగా కొట్టడంతో ఆమెకు పెద్ద గాయాలు అయినట్టు చెబుతున్నారు. మళ్లీ స్టేషన్‌కు తీసుకువస్తే ఏదైనా ఇబ్బంది జరుగుతుందన్న ఉద్ధేశంతోనే పోలీసులు రిమాండ్‌ విధించడం లేదని చెబుతున్నారు. పోలీసులు దళిత మహిళపై వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్ని వైపుల నుంచి ఈ ఘటనకు సంబంధించి విమర్శలు రావడంతోనే విచారణకు సిద్ధపడినట్టు తెలుస్తోంది. మరి ఈ కేసు విచారణలో ఎటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. 

Also Read: చాక్లెట్ ఇప్పిస్తానని బాలిక కిడ్నాప్ - గంటల్లోనే ఛేదించిన పోలీసులు, కిడ్నాపర్‌పై చిన్నారి బంధువుల దాడి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Speaker Gaddam Prasad Kumar: పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
Trump: ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
India Exports to America: భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
Adilabad Latest News: ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Speaker Gaddam Prasad Kumar: పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
Trump: ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
India Exports to America: భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
Adilabad Latest News: ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
Iran vs America: అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!
అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!
I-PAC Raid Case: బెంగాల్ డీజీపీని తొలగించండి! సుప్రీంకోర్టులో ఈడీ కొత్త పిటిషన్ దాఖలు!
బెంగాల్ డీజీపీని తొలగించండి! సుప్రీంకోర్టులో ఈడీ కొత్త పిటిషన్ దాఖలు!
Zubeen Garg Death: మరణం వెనుక మద్యం మత్తు... ప్రముఖ సింగర్ డెత్ మిస్టరీ రివీల్ చేసిన సింగపూర్ పోలీసులు
మరణం వెనుక మద్యం మత్తు... ప్రముఖ సింగర్ డెత్ మిస్టరీ రివీల్ చేసిన సింగపూర్ పోలీసులు
TMMTMTTM Box Office: రిలీజ్‌కు ముందు హడావిడి చేశారు... తిప్పి కొడితే 50 కోట్లు కూడా రాలేదుగా
రిలీజ్‌కు ముందు హడావిడి చేశారు... తిప్పి కొడితే 50 కోట్లు కూడా రాలేదుగా
Embed widget