అన్వేషించండి

Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్

Andhra News: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏడేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు.

Punganuru Police Hit The Child Murder Case: చిత్తూరు జిల్లా పుంగనూరులో (Punganuru) ఏడేళ్ల చిన్నారి హత్య కేసు మిస్టరీ వీడింది. ఆర్థిక లావాదేవీలే చిన్నారి హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి హత్య ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. చిన్నారి తండ్రి ఓ మహిళకు రూ.3.5 లక్షలు అప్పుగా ఇచ్చాడని.. అది తిరిగి చెల్లించాలని ఆ మహిళను బెదిరించడం, తిట్టడ, కోర్టులో కేసు వేస్తానని చెప్పడంతో ఆమె అతనిపై పగ పెంచుకున్నట్లు చెప్పారు. ఇంటి వద్ద ఆడుకుంటోన్న చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అనంతరం పాపకు ఊపిరాడకుండా చేసి హత్య చేశారని చెప్పారు. 

హత్య తర్వాత చిన్నారిని బైక్‌పై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్‌లో పడేశారని ఎస్పీ తెలిపారు. నిందితులు రేష్మ, ఆమె తల్లి హసీనా, సహకరించిన బాలుడు అఖిల్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. చిన్నారి మిస్ అయిన రోజునే సమ్మర్ స్టోరేజ్‌లో పడేశారని.. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని వెల్లడించారు. అటు, కొన్ని ఛానల్స్ చిన్నారి మృతిపై తప్పుడు ప్రచారం చేశాయని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాల్లో మీడియా బాధ్యతగా ఉండాలని అన్నారు.

బాధిత కుటుంబ సభ్యులకు సీఎం ఫోన్

అటు, బాధిత కుటుంబానికి నేతలు అండగా నిలిచారు. చిన్నారి కుటుంబాన్ని మంత్రులు వంగలపూడి అనిత, ఫరూక్, రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. చిన్నారి తండ్రితో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయనకు ధైర్యం చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 

బాలిక మృతిని వైసీపీ రాజకీయం చేస్తోందని రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చిన్నారి మృతిపై పోలీసులు పటిష్ట విచారణ చేపట్టారని అన్నారు. బాలికపై అత్యాచారం చేశారని వైసీపీ నేతలు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. అత్యాచారం జరగలేదని పోస్టుమార్టం రిపోర్టులో ఉందని చెప్పారు. చిన్నారి హత్యపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేసి వారి కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇదీ జరిగింది

చిత్తూరు జిల్లా పుంగనూరులో గత నెల 29న ఆదివారం రాత్రి ఇంటి వద్ద ఆడుకుంటోన్న ఏడేళ్ల చిన్నారి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక యువత వెతికినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. డాగ్ స్క్వాడ్ బృందాలు ఉబేదుల్లా కాంపౌండ్, చెంగ్లాపురం రోడ్డు పరిసర ప్రాంతాల్లో సంచరించాయి. ఎస్పీ మణికంఠ స్వయంగా దర్యాప్తును పర్యవేక్షించారు. చివరకు ఈ నెల 2వ తేదీన (బుధవారం) సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు నిర్థారించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. చివరకు చిన్నారిని హత్య చేసిన నిందితులను గుర్తించారు.

Also Read: Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
Jogi Ramesh Latest News:వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?
వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
526km కియా సైరోస్‌ EV ఎంట్రీ - టాటా ఎక్సాన్‌ EV, మహీంద్రా XUV 3XO EV కంటే బెటరా?
Kia Syros EV వర్సెస్‌ Nexon EV వర్సెస్‌ XUV 3XO EV - A టు Z కంపారిజన్‌, ఏ ఎలక్ట్రిక్‌ SUV కొంటారు?
Jana Nayagan Collections: 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Embed widget