అన్వేషించండి

Etapaka Murder case: సుపారీ ఇచ్చి కన్నకొడుకుని చంపించిన తల్లిదండ్రులు - అసలు విషయం తెలిసి అంతా షాక్!

కొడుకునే కడతేర్చారు తల్లిదండ్రులు. మద్యానికి బానిసై.. బాధ్యతలు మరిచిన బిడ్డను చంపేశారు. సుపారీ గ్యాంగ్‌తో కలిసి గొంతుకోసం హత్య చేశారు. అల్లూరి జిల్లా ఎటపాకలో జరిగింది ఈ దారుణం.

అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో ఈనెల 10న జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. తల్లిదండ్రులే హంతకులని తేల్చారు. కన్నబిడ్డను సుపారీ ఇచ్చి  మరీ చంపించారని నిర్ధారించారు. పరారీలో ఉన్న పేరంట్స్‌ను వెతికి పట్టుకున్నారు. కడుపున పుట్టిన బిడ్డ.. కన్నవారే ఎందుకు హతమార్చారు..? దీని వెనకున్న స్టోరీ  ఏంటన్నది.. పోలీసులు వివరించారు.

తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిన తనయుడు తలనొప్పిగా తయారయ్యాడు. తాగుడుకు బానిసై.. ఇల్లువాకిలి పట్టకుండా తిరిగాడు. కుటుంబాన్ని గాలికి వదిలేసి... మత్తులో  తేలిపోయాడు. తాగేందుకు డబ్బు కోసం... తల్లిదండ్రులను వేధించాడు. వారికి తలదాచుకునేందుకు చోటు కూడా లేకుండా చేద్దామనుకున్నాడు. ఉన్న ఒక్క ఇల్లు  అమ్మేయాలని... కన్నవారితో కొట్లాడాడు. వారికి నిత్యం నరకం చూపించాడు. కొడుకు వేధింపులు భరించలేని తల్లిదండ్రులు మానసిక క్షోభ అనుభవించారు. ఎంతకీ అతడి  ప్రవర్తన మారకపోగా.. రోజురోజుకూ దిగజారిపోయాడు. అతడి ప్రవర్తనతో విసిగిపోయారు తల్లిదండ్రులు. కొడుకు పెట్టే వేధింపులు భరించేకంటే.. కడుపుకోతే మేలనుకున్నారు. 
ఇలాంటి కొడుకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనుకుని... హత్యకు ప్లాన్‌ చేశారు. సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక  మండలంలో జరిగింది. 

పగిల్ల రాము-సావిత్రి దంపతులు భద్రాచలం మెడికల్‌ కాలనీలో ఉంటున్నారు. వీరికి 35ఏళ్ల కుమారుడు దుర్గాప్రసాద్‌ ఉన్నాడు. కొడుకు చేతికి అందొచ్చాడే గానీ... చేతగాని  వాడు. మద్యానికి బానిసయ్యాడు. తాగొచ్చి... రోజూ ఇంట్లో గొడవపడేవాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన భార్య మౌనిక... పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటోంది. దీంతో  ఇంకొంచెం ఎక్కువగా తాగడం మొదలుపెట్టాడు దుర్గప్రసాద్‌. తాగొచ్చి... ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను హింసించేవాడు. తాగేందుకు డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు. చివరికి  ఉన్న ఇంటిని అమ్మేయాలని ఒత్తిడి చేశాడు. అందుకోసం రోజూ తల్లిదండ్రులను వేపుకుతిన్నాడు. చాలా రోజులు వేధింపులు భరించిన వాళ్లు... ఇక తెగించేశాడు. ఇలాంటి  కొడుకు ఇక వద్దని నిర్ణయించుకున్నాడు. ఊపిరిపోసిన వారే ఊపిరి తీయాలనుకున్నారు. కొడుకును హత్య చేయించేందుకు సుపారీ గ్యాంగ్‌ను సంప్రదించారు. భద్రాచలానికే  చెందిన గుమ్మడి రాజు, షేక్‌ ఆలీ పాషాకి 3లక్షల రూపాయల సుపారీ ఇచ్చారు. తమ కుమారుడు దుర్గాప్రసాద్‌ను చంపేయాలని ఒప్పందం చేసుకున్నారు. ప్లాన్‌ ప్రకారం...  ఈనెల 9న అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న దుర్గాప్రసాద్‌ను హత్య చేశారు. సుపారీ గ్యాంగ్‌తో కలిసి తల్లిదండ్రులు కూడా కత్తితో దుర్గాప్రసాద్‌ గొంతు కోసేశారు. అతను చనిపోయిన  తర్వాత... మృతదేహాన్ని ఆటోలో తుమ్మలనగర్‌ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ చెట్ల మధ్యలో మృతదేహాన్ని పడేసి... పెట్రోలు పోసి తగలబెట్టేశారు. ఆ తర్వాత  తల్లిదండ్రులు, సుపారీ గ్యాంగ్‌లోని ఇద్దరు ఊరు వదిలి వెళ్లిపోయారు.

ఈనెల 10వ తేదీ  మధ్యాహ్నం అటవీ ప్రాంతానికి పుల్లల కోసం వెళ్లిన వ్యక్తికి కాలిపోయిన మృతదేహాన్ని చూసి పోలీసులు ఫిర్యాదు చేశాడు. అక్కడికి వెళ్లి చూసిన ఎటపాక  పోలీసులు... హత్యగా అనుమానించారు. అతను ఎవరనే వివరాలు ఆరా తీశారు. మృతదేహం ఫొటోతో పాంప్లెట్లు వేయించి.. అన్ని చోట్ల అంటించారు. దుర్గాప్రసాద్‌ భార్య  మౌనిక.. మృతదేహాన్ని గుర్తుపట్టింది. చనిపోయింది తన భర్తే అని నిర్ధారించుకుని పోలీసులను ఆశ్రయించింది. మృతుడి వివరాలు తెలియడంతో... పోలీసులు కూపీ లాగారు.  అసలు ఏం జరిగింది..? అనే కోణంలో దర్యాప్తు చేశారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు... దుర్గాప్రసాద్‌ తల్లిదండ్రులు చేసిన దారుణం బయటపడింది. సుపారీ ఇచ్చి మరీ...  కన్నబిడ్డను చంపించిన పేరంట్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుపారీ గ్యాంగ్‌ను కూడా పట్టుకున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Mohali Woman Stabbed to Death: ప్రేమించలేదని ఆఫీసులోనే నరికేశాడు రాక్షసుడు - పంజాబ్‌లో ఘోరం
ప్రేమించలేదని ఆఫీసులోనే నరికేశాడు రాక్షసుడు - పంజాబ్‌లో ఘోరం
Bolla Brahma Naidu Arrest: గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Embed widget